ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"తీరం దాటిన వాయుగుండం" - తిరుపతిలో భారీ వర్షాలు - శ్రీవారి మెట్ల మార్గం క్లోజ్ - TTD CLOSED SRIVARI METTU FOOTPATH

వాతావరణశాఖ హెచ్చరికలతో ముందస్తు చర్యలు తీసుకున్న తిరుమల తిరుపతి దేవస్థానం

tirumala_srivari_mettu_footpath_closed
tirumala_srivari_mettu_footpath_closed (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 17, 2024, 1:28 PM IST

Tirumala Srivari Mettu Footpath Closed : వాతావరణశాఖ హెచ్చరికలతో తిరుమల తిరుపతి దేవస్థానం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. భక్తులకు ఇబ్బందిలేకుండా టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీవారిమెట్టు కాలినడక మార్గాన్ని మూసివేశారు. కొండచరియలపై నిఘా ఉంచి ఘాట్‌రోడ్లలో ట్రాఫిక్‌జామ్ కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. భక్తుల దర్శనాలు, వసతికి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశారు. తీరం దాటాక వర్షాలు లేకపోవడంతో టీటీడీ అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.

తీరం దాటిన వాయుగుండం :బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తిరుపతి జిల్లా తడ వద్ద తీరం దాటింది. తీరం దాటిన తర్వాత వాయుగుండం తీవ్ర అల్పపీడనంగా బలహీనపడింది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తీవ్ర అల్పపీడనం ప్రభావంతో ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. విశాఖ, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, ఉమ్మడి కడప జిల్లాల్లో వానలు కురుస్తున్నాయి. ఉమ్మడి కడప జిల్లాలో వానల ప్రభావంతో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.

ఆర్​కే బీచ్​లో అలల తాకిడి - ఉప్పాడ తీరంలో అల్లకల్లోలం - ఓఎన్‌జీసీ ప్లాంటును తాకిన సముద్ర జలాలు

ఆ జిల్లాల్లో భారీ వర్షాలు :చెన్నై - నెల్లూరు మధ్య తడ సమీపంలో వాయుగుండం తీరాన్ని దాటింది. గడచిన 6 గంటలుగా 22 కిలోమీటర్ల వేగంతో తీరం వైపుగా వాయుగుండం కదిలినట్లు భారత వాతావరణ విభాగం తెలిపింది. తీరాన్ని దాటిన అనంతరం ఇది క్రమంగా బలహీనపడి అల్పపీడనంగా మారినట్టు ఐఎండీ వెల్లడించింది. రాగల 12 గంటల్లో ఇది మరింత బలహీనపడుతుందని తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. నెల్లూరు, తిరుపతి, కడప, అన్నమయ్య, సత్యసాయి జిల్లాల్లో మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్టు తెలిపింది.

ఆకస్మిక వరదలు వచ్చే ఆస్కారం :కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. క్రమేపీ సాయంత్రానికి వర్ష ప్రభావం తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని స్పష్టం చేసింది. అల్పపీడనంతో తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల తీరప్రాంతాల్లో గంటకు 45 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నట్టు ఐఎండీ స్పష్టం చేసింది. తీరంలో ఇవాళ మధ్యాహ్నం వరకు అలజడిగానే ఉంటుందని హెచ్చరికలు జారీ చేసింది. భారీ వర్షాల నేపథ్యంలో కోస్తాంధ్రలోని నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, రాయలసీమలోని చిత్తూరు, కడప జిల్లాల్లో వాగులు, వంకల్లో ఆకస్మిక వరదలు వచ్చే ఆస్కారం ఉందని హెచ్చరించింది.

ప్రమాద హెచ్చరికలు జారీ : ప్రస్తుతం విశాఖ, గంగవరం పోర్టుల్లో ఒకటో ప్రమాద హెచ్చరిక, నిజాంపట్నం, కృష్ణపట్నం, మచిలీపట్నం ఓడరేవులకు మూడో నెంబర్‌ ప్రమాద హెచ్చరిక ఇచ్చినట్టు వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో సముద్రపు అలలు 1.5 మీటర్ల ఎత్తున ఎగసిపడతాయని హెచ్చరించింది. ఈ ప్రాంతాల్లో హార్బర్ ఆపరేషన్లను అత్యంత జాగ్రత్తతో నిర్వహించాల్సిందిగా సూచనలు చేసింది.

నెల్లూరుకు వాయు'గండం' - నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు

బంగాళాఖాతంలో వాయుగుండం ఎఫెక్ట్ - తిరుపతిలో భారీ వర్షాలు - స్తంభించిన జనజీవనం

ABOUT THE AUTHOR

...view details