Tiger Entered in Warangal Forest Areas : చుట్టూరా పచ్చదనం, ఎత్తైన గుట్టలు, ఎన్నో వృక్షజాతులు, మరెన్నో వన్యప్రాణులు మరోవైపు గోదావరి పరవళ్లు ప్రకృతి రమణీయతతో ఉమ్మడి వరంగల్ అభయారణ్యం అందరినీ ఆకట్టుకుంటుంది. ఏటూరునాగారం, పాకాల అరణ్యం ఒకప్పుడు పెద్ద పులులకు ఆవాసం. ఇప్పుడు మరోసారి దాని అలికిడి కనిపించింది. ఓరుగల్లు అటవీ ప్రాంతంలో ఆహారానికి సరిపడా వన్యప్రాణులు, తాగునీరు, సేద తీరేందుకు అనువైన అటవీ ప్రాంతం పెద్ద పులులను సాదరంగా ఆహ్వానించింది.
ఇవన్నీ కలిసొచ్చాయని : మహారాష్ట్రల్లోని తాడోబా, ఛత్తీస్గఢ్లోని ఇంద్రావతి టైగర్ రిజర్వుల్లో పులుల సంఖ్య ఎక్కువైంది. అక్కడ ఆహార కొరత ఉండడంతో గోదావరి, ప్రాణహిత తీర ప్రాంతాలు దాటి మనవైపు వస్తున్నాయని అటవీ అధికారులు తెలిపారు. ఇక్కడి అడవుల్లో శాకాహార జంతువులు అధికంగా ఉండడం, పచ్చదనం ఎక్కువ ఉండడంతో కలిసివస్తోంది.
పాదముద్రల ఆనవాళ్ల ఆధారంగా :ఛత్తీస్గఢ్ కీకారణ్యం నుంచి పెద్దపులి వరంగల్లోకి ప్రవేశించింది. ములుగు జిల్లా వెంకటాపురం మండరం చెలిమల, డోలి అభయారణ్యం మీదుగా కొత్తుగుంపు, బోదాపురం అటవీ మార్గంలో గోదావరి తీర ప్రాంతంలోకి చేరుకున్నట్లు అటవీశాఖ అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఇక్కడి పాదముద్రల ఆనవాళ్ల ఆధారంగా ఆ మార్గమే రాకకు సులువైందని నిర్ధారించారు.
బోదాపురం సమీప పెద్దలంక భూముల్లో సాగు చేస్తున్న పుచ్చపంటల గుండా దాదాపు ఐదుకు పైగా చిన్నపాటి పాయలు దాటి గోదావరి ప్రవాహం వైపు వెళ్లింది. ఆ నదిని సైతం దాటినట్లు ఆవలి ప్రాంతమైన మంగపేట మండలం చుంచుపల్లి, రాజుపేట ప్రాంతాల్లో పెద్దపులి పాదముద్రలను అటవీశాఖ అధికారులు గుర్తించారు.
ఎప్పుడొస్తుందో? - ఏ వైపు నుంచి దాడి చేస్తుందో? - పెద్దపులి ఆచూకీ లభించక బిక్కుబిక్కుమంటున్న ప్రజలు