Public Protest Against YSRCP Leaders in Flooded Areas : విజయవాడలో వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన వైఎస్సార్సీపీ నేతలకు ప్రజల నుంచి నిరసన సెగ తగిలింది. ఇళ్లు మునిగిన ఐదురోజుల తర్వాత ఎందుకొచ్చారని బాధితులు నిలదీశారు. బాధితులకు సాయం అందకుండా అడ్డుపడుతున్నారని వైఎస్సార్సీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. | Read More
ETV Bharat / state / Telangana News > Telangana News Live Updates: Telangana Latest News in Telugu - 4 September 2024
Telangana News Today Live : తెలంగాణ Wed Sep 04 2024 లేటెస్ట్ వార్తలు- 'ఇన్నాళ్లకు ఊపుకొంటూ వచ్చారా?' - వైఎస్సార్సీపీ నేతలను నిలదీసిన వరద బాధితులు - Public Fire on YSRCP Leaders
Published : Sep 4, 2024, 7:20 AM IST
|Updated : Sep 4, 2024, 10:00 PM IST
'ఇన్నాళ్లకు ఊపుకొంటూ వచ్చారా?' - వైఎస్సార్సీపీ నేతలను నిలదీసిన వరద బాధితులు - Public Fire on YSRCP Leaders
దీప్తి జీవాంజీకి పారాలింపిక్స్లో కాంస్యం - స్వగ్రామంలో సంబురాలు - Deepthi Jeevanji Paris Paralympics
Deepthi Jeevanji Paralympics: మేధోపరమైన సమస్యతో జన్మించిన దీప్తి జీవాంజీ పారాఒలింపిక్స్లో మూడో స్థానంలో నిలిచి క్యాంస్య పతకాన్ని సాధించింది. ఆమె ప్రయాణం ఒక సాహసమే. ఓ వైపు మానసిక వైకల్యం మరో వైపు కడు పేదరికం. వీటన్నింటిని చూసి, అనుభవించి తీవ్ర మనోవేదనకు గురయ్యేది. ఇదే చివర అని ఎప్పుడు ఆగిపోలేదు. ఆత్మబలంతో ముందుకుసాగి విజయాన్ని సొంతం చేసుకుంది. | Read More
ఎవరిని కదిపినా ఒకటే వ్యథ - ముంపు బాధితులందరిదీ అదే కన్నీటి గాథ - MUNNERU FLOOD VICTIMS PROBLEMS
Munneru Flood Victims Problems : ఎవరిని కదిపినా ఒకటే వ్యథ- అందరిదీ ఒకటే గాథ. ఇదీ ఖమ్మంలోని మున్నేరు ముంపు బాధితుల పరిస్థితి. ఊహించని విధంగా వరద సృష్టించిన ప్రళయం ఎంతో మందిని నిరాశ్రయుల్ని చేసింది. ఏ కాలనీ చూసినా వరద మిగిల్చిన గాయాలే కనిపిస్తున్నాయి. వరద తగ్గడంతో తమ ఇళ్లకు చేరుకుంటున్న ప్రజలు జరిగిన నష్టం చూసి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. | Read More
మళ్లీ పెరుగుతున్న బుడమేరు వరద ప్రవాహం - గండి పూడ్చే పనులు సాగేనా? - Budameru Floating
Heavy Rain Water Floating in Budameru : ఏపీలో బుడమేరుకు వరద మళ్లీ పెరుగుతోంది. ఇప్పటికే మొదటి గండిని పూడ్చారు. మరో 2 గండ్లు పూడ్చే పనులు జరుగుతున్నాయి. అయితే పెరుగుతున్న వరద ప్రవాహంతో పనులకు ఆటకం కలుగుతోంది. గండి పూడ్చే పనులను ఏపీ మంత్రులు నారా లోకేశ్, నిమ్మల రామానాయుడు పరిశీలించారు. | Read More
'ఖమ్మం వరద బాధితులకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీల ఒక నెల జీతం విరాళం' - BRS Donation for Flood Victims
BRS Salary Donation for Flood Victims : ఖమ్మం వరద బాధితులకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒక నెల జీతాన్ని విరాళంగా ప్రకటించారు. కేసీఆర్ నిర్ణయం మేరకు తమ పార్టీ నేతలు ఒక నెల జీతం విరాళంగా ఇస్తున్నామని మాజీమంత్రి హరీశ్రావు తెలిపారు. ఖమ్మం వరదలపై కేసీఆర్ విచారం వ్యక్తం చేశారని చెప్పారు. | Read More
మంథని వద్ద గోదావరి ఉగ్రరూపం - పార్వతి బ్యారేజ్కు పెరుగుతున్న వరద - Flood Inflow To Parvati Barrage
Huge Flood Inflow To Parvati Barrage : మంథని వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువ నుంచి వస్తున్న ప్రవాహానికి తోడు, స్థానికంగా ఉన్న వాగులు కూడా ఉప్పొంగడంతో పార్వతి బ్యారేజ్ వద్ద రికార్డు స్థాయిలో 4,24,915 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదవుతోంది. ముందు జాగ్రత్త చర్యగా అధికారులు వచ్చిన నీటినంతా దిగువకు వదులుతున్నారు. | Read More
పవర్ స్టార్ మంచి మనసు - వరద బాధితులకు పవన్ కల్యాణ్ రూ.6 కోట్ల విరాళం - PAWAN KALYAN DONATES 6 CRORES
Pawan Kalyan Donation to Flood Victims: వరద బాధితులకు విరాళాలు ఇచ్చేందుకు టాలీవుడ్ కదిలింది. సినీ నటుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రూ.6 కోట్లు విరాళం ఇవ్వనున్నట్టు వెల్లడించారు. అలాగేే నందమూరి బాలకృష్ణ, మహేష్ బాబు రెండు తెలుగు రాష్ట్రాలకు చెరో 50 లక్షలు సీఎం సహాయనిధికి ఇవ్వనున్నారు. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ తెలుగు రాష్ట్రాలకు రూ.50 లక్షల చొప్పున విరాళం ప్రకటించారు. | Read More
తెలుగు రాష్ట్రాలకు మరో డేంజర్ - ఇవాళ్టి నుంచి 4 రోజుల వరకు అతిభారీ వర్షాలు! - HEAVY RAIN ALERT TO TELUGU STATES
Heavy Rain Alert To Telugu States : తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇరు రాష్ట్రాల్లో ఇవాళ్టి (సెప్టెంబరు 4వతేదీ) ఈనెల 8వ తేదీ వరకు అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. వాతావరణ శాఖ ప్రకటనతో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. మరోవైపు ఇంకో డేంజర్ తమను ముంచేందుకు వస్తోందంటూ లోతట్టు ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. | Read More
ఎస్డీఆర్ఎఫ్ నిధుల వినియోగానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ - SDRF Funds to Telangana
SDRF Funds To Telangana For Flood Affected Areas : తెలంగాణలో ఎస్డీఆర్ఎఫ్ నిధులు వినియోగానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలో వానలు సృష్టించిన బీభత్సంపై కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసి నిధుల వినియోగంపై విన్నవించగా ఆయన సానుకూలంగా స్పందించారు. | Read More
బిర్యానీ రేటు కంటే తక్కువ ధరకే హైదరాబాద్ టు బెంగళూరు - ఛాన్స్ మిస్సవ్వకండి - Flixbus Announce Low Cost Journey
Flixbus Announce Good news : బెంగుళూరు- హైదరాబాద్ ప్రయాణించే వారికి ఫ్లిక్స్బస్ సంస్థ శుభవార్త అందించింది. ఇరు నగరాలకు ప్రయాణించే వారికి రూ. రూ.99తో టికెట్ బుక్ చేసుకునే ఆఫర్ను సంస్థ ప్రకటించింది. టికెట్ బుకింగ్ టైమింగ్స్, ప్రయాణ తేదీలను ప్రకటించింది. | Read More
వరదను అంచనా వేయలేక - నాపై బురద జల్లుతున్నారు : పువ్వాడ అజయ్ - Puvvada Ajay Fires On CM Revanth
Puvvada Ajay Fires On CM Revanth : వరద ప్రభావిత ప్రాంతాల్లో కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ప్రచారంలా పర్యటించారని బీఆర్ఎస్ నేత పువ్వాడ అజయ్ కుమార్ విమర్శించారు. వరద బాధితులకు బీఆర్ఎస్ నేతలు సాయమందిస్తుంటే కాంగ్రెస్ వారు దాడులు చేశారని ఆరోపించారు. ప్రజలను కాపాడటంలో ప్రభుత్వం, మంత్రులు విఫలం అయ్యారని దుయ్యబట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్పై పలు విమర్శలు గుప్పించారు. | Read More
'హిడెన్ కెమెరాల ప్రచారం - అదంతా కట్టుకధే'- ఫేక్ న్యూస్ వెనుక హైదరాబాద్ యూట్యూబర్? - Nude calls controversy IN AP
Hidden Cameras Incident in AP : కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాలలో హిడెన్ కెమెరాల వ్యవహారంలో విచారణ బృందం వాస్తవాలను వెలికితీసింది. ముగ్గురు ఐజీ, ఒక ఎస్పీ స్థాయి అధికారుల పర్యవేక్షణలో సాగుతున్న దర్యాప్తు బృందం, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతుల వ్యాప్తిపైనా దృష్టి సారించింది. ‘కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం (సీఈఆర్టీ) డైరెక్టర్ నేతృత్వంలో మరో ముగ్గురు నిపుణులు, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్ కంప్యూటింగ్ (సి-డాక్)కు చెందిన ఇద్దరు నిపుణులతో కూడిన బృందం కూడా కళాశాలలో అన్ని కోణాల్లో పరిశీలన చేసింది. | Read More
ములుగు జిల్లాలో టోర్నడో తరహా బీభత్సం - 500 ఎకరాల్లో భారీగా నేలకొరిగిన చెట్లు - 50k trees Fall In Eturnagaram
Large Number Of Trees Uprooted : ములుగు జిల్లాలో గాలివానలు బీభత్సం సృష్టించాయి. సుమారు 500 ఎకరాల అటవీ ప్రాంతంలో 50 వేల చెట్లు నేలకొరిగిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై మంత్రి సీతక్క ఆరా తీశారు. వృక్షాలు నేలమట్టమవ్వడంపై విచారణకు ఆదేశించారు. అటవీ ప్రాంతాల్లో చెట్లను పెంచేలా ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరారు. | Read More
వరద నష్టంపై ఏపీ సర్కార్ రిపోర్టు - బాధితులకు సాయం చేయాలనుకుంటున్నారా? - AP FLOOD DAMAGE REPORT 2024
AP Flood Damage Report 2024 : భారీ వర్షాలు, వరదల కారణంగా ఇప్పటి వరకూ రాష్ట్రవ్యాప్తంగా జరిగిన నష్టాన్ని ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా 20 మంది మృతి చెందగా, 1,69,370 ఎకరాల్లో వివిధ పంటలకు నష్టం వాటిల్లినట్లు తెలిపింది. వరదల వలన 22 సబ్ స్టేషన్లు దెబ్బతినగా, 3,312 కిలోమీటర్ల రహదారులు దెబ్బతిన్నాయని వెల్లడించింది. 78 చెరువులకు, కాలువలకు గండ్లు ఏర్పడగా, వరదల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 6,44,536 మంది నష్టపోయారని ప్రభుత్వం తెలిపింది. | Read More
అప్పుడు అందరూ ఎగతాళి చేశారు - ఇప్పుడు మెడల్ సాధించి దేశం గర్వపడేలా చేసింది : దీప్తి తల్లిదండ్రులు - Jeevanji Deepthi Paralympics 2024
Jeevanji Deepthi Parents Gets Emotional After Her Winning : పారాలింపిక్స్లో పతకం గెలిచి చరిత్ర సృష్టించిన దీప్తి విజయాన్ని చూసి ఆమె తల్లిదండ్రులు ఎమెషనల్ అయ్యారు. చాలామంది తనని వదిలేయమని, ఆమెను ఎగతాలి చేసేవారని కానీ ఇప్పుడు ఆమెను చూసి దేశం గర్వింస్తుందని ఆనందం వ్యక్తం చేశారు. | Read More
పాన్ ఇండియా స్టార్ పే....ద్ద మనసు - తెలుగు రాష్ట్రాలకు ప్రభాస్ భారీ విరాళం - Prabhas Dontaion to Telugu States
Hero Prabhas Donation To Telangana : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తెలుగు రాష్ట్రాలకు భారీ విరాళం ప్రకటించారు. దాంతోపాటు వరదలకు గురైన ప్రాంతంలో ప్రజలకు భోజనాలు, నీళ్లు ఏర్పాటు చేసి తన పెద్ద మనసు చాటుకున్నారు. | Read More
'హైడ్రా' పేరుతో వసూళ్లకు పాల్పడితే జైలుకే - కమిషనర్ రంగనాథ్ స్ట్రాంగ్ వార్నింగ్ - HYDRA RANGANATH WARNING
Hydra Commissioner Warning : హైదరాబాద్లో చెరువులు, పార్కులు, ప్రభుత్వ భూములను చెరబట్టి వాటిలో అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. అయితే కొందరు దీని పనితీరును తప్పుదోవ పట్టించేందుకు హైడ్రా పేరుతో బెదిరింపులు, వసూళ్లకు పాల్పడుతున్నారు. అలాంటి వారికి హైడ్రా కమిషనర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అలాంటి విషయాలు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. | Read More
పొలాల నిండా బండరాళ్లు, ఇసుకు మేటలు - భారీ వర్షాలతో ఆనవాళ్లు కోల్పోయిన పంట పొలాలు - Flood Effect To Telangana Crops
Flood Effect To Telangana Crops : వాయుగుండం ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా తీవ్రనష్టం వాటిల్లింది. వాగులు, వంకలు, నదులు ఉద్ధృతంగా ప్రవహించడంతో చేతికందే పంట నీట మునిగింది. వరద నీటి నిల్వ తగ్గుతుండటంతో దెబ్బతిన్న పంట పొలాలు తేలుతున్నాయి. పంట నష్టపోయిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని అన్నదాతలు వేడుకుంటున్నారు. | Read More
శెభాష్ సుభానీ : పోతే నా ఒక్కడి ప్రాణం - వస్తే తొమ్మిది మంది ప్రాణాలు - JCB driver saved flood victims
JCB Driver Saved Flood Victims : ఖమ్మంలోని ప్రకాశ్నగర్ వంతెనపై మున్నేరు వరద ఉద్ధృతిలో చిక్కుకున్న తొమ్మిది మంది ప్రాణాలను జేసీబీతో కాపాడి శెభాష్ అనిపించుకుంటున్నారు సుభానీ. వరద బాాగా ఉన్నప్పటికీ వెనకడుగు వేయకుండా, పోతే నా ఒక్కడి ప్రాణం, వస్తే తొమ్మిది మంది ప్రాణాలంటూ ధైర్యం చేసి వరద బాధితులను రక్షించాడు. | Read More
శ్రీవారి భక్తులకు ముఖ్యగమనిక - మారిన తిరుమల లడ్డూ రూల్స్! మీకు తెలుసా? - New Rules for Tirumala Laddu
TTD Clarifies on Laddu Sales: తిరుమల అంటే స్వామి దర్శనం తర్వాత గుర్తుకువచ్చేది లడ్డూ ప్రసాదం. ఎన్నిసార్లు లడ్డూలు తిన్నా మళ్లీ మళ్లీ తినాలపిస్తుంది. కారణం.. ఇవి అద్భుతమైన రుచిని కలిగి ఉండటమే. అయితే, తాజాగా లడ్డూ ప్రసాదాల విక్రయంపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. | Read More
విద్యార్థులకు మరోసారి వరుస సెలవులు - ఈసారి ఏకంగా 5 రోజులు - Schools Holiday Due To Rains
School Holidays : ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో గత అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. ఇప్పటికే వాయుగుండం ప్రభావంతో తేరుకోకముందే, మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. | Read More
పారాలింపిక్స్లో చరిత్ర సృష్టించిన ఓరుగల్లు బిడ్డ - కాంస్యాన్ని ముద్దాడిన దీప్తి జీవాంజి - Deepthi Jeevanji Wins Bronze Medal
Deepthi Jeevanji Wins Bronze Medak In Paralympics : పారాలింపిక్స్లో వరంగల్ క్రీడాకారిణి చరిత్ర సృష్టించింది. 400 మీటర్ల టీ-20 విభాగం ఫైనల్లో దీప్తి 55.82 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని, క్యాంస్య పతకాన్ని గెలుచుకుంది. పారాలింపిక్స్లో పతకం సాధించిన తొలి తెలుగు అమ్మాయిగా నిలిచింది. | Read More
కబ్జాకు కేరాఫ్ అడ్రస్గా కరీంనగర్ చెరువులు - హైడ్రా మాదిరి వ్యవస్థ కావాలంటున్న స్థానికులు - Ponds encroachment in Karimnagar
Land Encroachment in Karimnagar : భూముల ధరలకు రెక్కలు రావడంతో అక్రమార్కుల కన్ను చెరువులు నాలాలపై పడటం సర్వసాధారణమై పోయింది. అందుకు ప్రజాప్రతినిధుల అండ తోడవడంతో వందల ఎకరాల భూమి అన్యాక్రాంతమవుతోంది. చిన్న చినుకు పడితే చాలు రోడ్లన్నీ చెరువులుగా మారే పరిస్థితి. కరీంనగర్ పట్టణం, పరిసర గ్రామీణ ప్రాంతాల్లో ఈ దృశ్యాలు సాక్ష్యాత్కరిస్తున్నాయి. హైడ్రా తరహాలో ఆక్రమణలపై ఉక్కుపాదం మోపాలనే డిమాండ్ స్థానిక ప్రజల నుంచి వెల్లువెత్తుతోంది. | Read More
హైడ్రా దూకుడు- అమీన్పూర్లో అక్రమ కట్టడాల కూల్చివేత - Demolitions in Sangareddy
Hydra Demolitions in Sangareddy : అక్రమ కట్టడాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పటికే ప్రభుత్వ భూముల్లో నిర్మించిన అక్రమ కట్టడాలను నేలమట్టం చేసిన అధికారులు పటాన్చెరులోని అమీన్పూర్ సహా వివిధచోట్ల నిర్మాణాలను తొలగించారు. హైడ్రా ఆదేశాల మేరకు అక్రమార్కుల చెర నుంచి విలువైన భూములను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. | Read More
వరద బాధితులకు 'మెగా' సాయం - తెలుగు రాష్ట్రాలకు చిరంజీవి భారీ విరాళం - Chiranjeevi Donates 1 Crore Rupees
Actor Chiranjeevi Donates 1 Crore Rupees : తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల కోసం మెగాస్టార్ చిరంజీవి రూ.కోటి విరాళం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్కు చెరో రూ.50 లక్షల చొప్పున విరాళం ప్రకటిస్తున్నట్లు ఆయన ఎక్స్ వేదికగా వెల్లడించారు. | Read More
అతివేగంగా ఒకదానినొకటి ఢీకొన్న 5 కార్లు - అమెరికాలో ముగ్గురు హైదరాబాద్ వాసుల దుర్మరణం - Telangana students died in America
4 Indians Dead in America in Car Crash : అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం అన్నాలోని రోడ్డు నం.75లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు భారతీయులు మృతి చెందారు. వీరిలో ముగ్గురు హైదరాబాద్కు చెందిన వారు కాగా, మరొకరు తమిళనాడు వాసి. వరుసగా 5 వాహనాలు ఒకదానినొకటి అతివేగంగా ఢీకొనడంతో ప్రమాదం సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. | Read More
భద్రాచలం వద్ద 42.3 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం - కాసేపట్లో ఫస్ట్ వార్నింగ్ - Godavari rising at Bhadrachalam
Godavari rising at Bhadrachalam : ఎగువ నుంచి వస్తున్న వరదతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరగుతోంది. ప్రస్తుతం గోదావరి నీటిమట్టం 42.3 అడుగుల వద్దకు చేరి ప్రవహిస్తోంది. గోదావరి నది నీటిమట్టం 43 అడుగులకు చేరితే అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. | Read More
గణేశుడి ప్రతిమలతో హైదరాబాద్ మార్కెట్లు కిటకిట - ధూల్పేట్లో జోరందుకున్న విక్రయాలు - Dhoolpet Ganesh idols 2024
Ganesh Idol Buying In Dhoolpet Hyderabad : ధూల్పేట. హైదరాబాద్ వాసులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ఎందుకంటే ఏటా గణేశ్ చతుర్థికి అడుగు నుంచి 60 అడుగుల వినాయక ప్రతిమలు ప్రాణం పోసుకునేది ఇక్కడే మరి. అయితే వినాయక చవితి సమీపిస్తుండటంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని వారు ధూల్పేటకు వచ్చి పెద్ద మొత్తంలో వినాయకుని ప్రతిమలు తీసుకెళ్తున్నారు. | Read More
మున్నేరు శాంతించినా కన్నీరే మిగిలింది - నీట మునిగిన ఇంట్లో బురదతో బాధితుల ఇబ్బందులు - Munneru Flood Effect
Munneru Floods : మున్నేరు వరద తగ్గినా అది మిగిల్చిన బురద మాత్రం ముంపు బాధితులను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తోంది. చరిత్రలో ఎప్పుడూ రానంత వరద రావడంతో పరీవాహక ప్రాంత కాలనీ వాసులు కట్టుబట్టలతో సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. వరద తగ్గిన తర్వాత వచ్చి చూస్తే కన్నీరే మిగిలింది. పలు కాలనీల్లో మున్నేరు వరద నీరు పది అడుగులకు పైన ప్రవహించడంతో పూర్తిగా ఒక్క రోజు పాటు నీటిలో నానాయి. దీంతో ప్రజలు ఇళ్లను శుభ్రం చేసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. బురదను తొలగించుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. నిలిచిన వరద నీటిపై ఆధారపడుతున్నారు. ప్రజల అవస్థలపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం. | Read More
తుది దశకు రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు - నేటి సాయంత్రానికి అందుబాటులోకి! - kazipet to Vijayawada Trains Cancel
Trains Between Kazipet and Vijayawada Have Been Cancelled : రాష్ట్రంలో కురిసిన భారీ వానలకు పలు ప్రాంతాల్లో రైల్వే ట్రాక్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో అధికారులు వాటిని పునరుద్దరించే పనిలో పడ్డారు. కాగా కాజీపేట - విజయవాడ ట్రాక్ పనులు తుది దశకు చేరుకున్నాయి. | Read More
పంప్హౌస్ నుంచి నీటిని తోడేసేందుకు కసరత్తులు ముమ్మరం - అంతా క్లియర్ అయ్యేందుకు 20 నుంచి 30 రోజులు! - Vattem Pump House Motors Submerge
Palamuru RangaReddy Lift Irrigation : నాగర్ కర్నూల్ జిల్లా వట్టెం వద్ద నీట మునిగిన పంపుహౌజ్ నుంచి నీటిని తోడి వేసేందుకు నీటి పారుదల శాఖ అధికారులు కసరత్తులు ముమ్మరం చేశారు. ఆడిట్ టన్నెల్ ద్వారా సొరంగ మార్గంలోకి వస్తున్న వరదకు అడ్డుకట్ట వేశారు. ప్రవాహం పూర్తిగా ఆగితే ఆరు టన్నెళ్ల వద్ద మోటార్లు ఏర్పాటు చేసి సొరంగ మార్గంలో నిలిచిన నీటిని యుద్ధ ప్రాతిపదికన తోడి వేయనున్నారు. నీటిని తొలగించేందుకు 20 నుంచి 30 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. | Read More