ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఆ భూములు తీసేసుకోండి' భూకేటాయింపుల పిల్‌పై తెలంగాణ హైకోర్టు ఆదేశం

‘ఇందూటెక్‌’, ‘బ్రాహ్మణి’ల భూములను స్వాధీనం చేసుకోండి

By ETV Bharat Andhra Pradesh Team

Published : 5 hours ago

INDUSTRIES_LAND_ALLOTMENT_CANCEL
INDUSTRIES_LAND_ALLOTMENT_CANCEL (ETV Bharat)

Telangana High CourtVerdict on Land Allotment Cancel for Industries : ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ భూములు దక్కించుకుని పరిశ్రమలు పెట్టని సంస్థలకు తెలంగాణ హైకోర్ట్ షాక్ ఇచ్చింది. ఇందూటెక్‌ జోన్, బ్రాహ్మణి ఇన్ఫ్రాటెక్‌ సహా నిర్మాణాలు ప్రారంభించని కంపెనీల భూముల్ని 4 నెలల్లో స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇప్పటికే పనులు మొదలైన వాటిలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.

ప్రభుత్వ ఆస్తుల కేటాయింపులో పారదర్శకత ఉండాలి : ఉమ్మడి రాష్ట్రంలో 2001 నుంచి 2006 వరకూ ఎలాంటి ప్రకటన లేకుండా, వేలం నిర్వహించకుండా, నామినేషన్‌ పద్ధతిపై 4,156 ఎకరాలను పలు కంపెనీలకు, వ్యక్తులకు కారుచౌకగా విక్రయంచడం, లీజుపై కేటాయించడాన్ని సవాలు చేస్తూ ఛత్రి అనే స్వచ్ఛంద సంస్థ 2007లో దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై (PIL) తెలంగాణ హైకోర్ట్ సుదీర్ఘ విచారణ చేపట్టి 72 పేజీల తీర్పు వెలువరించింది. పిటిషన్‌పై విచారణ జరుగుతుండగానే పలు పరిశ్రమలు ఏర్పాటయ్యాయని గుర్తుచేసింది. వేల మంది నిరుద్యోగులకు ఉపాధి లభించినందున పిటిషనర్‌ కోరినట్లుగా ప్రస్తుత మార్కెట్‌ ధర ప్రకారం సొమ్ము వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేస్తే అది ప్రభుత్వ విధాన నిర్ణయాలకు విరుద్ధం అవుతుందని అభిప్రాయపడింది.అలాంటి ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది.

'మేం ప్రభుత్వాన్ని ఆదేశించలేం' - గీత కార్మికుల దుకాణాలపై హైకోర్టు తీర్పు - Liquor shops in ap

ఐతే పరిశ్రమలు ఏర్పాటు చేయని కంపెనీల నుంచి భూములను స్వాధీనం చేసుకోలేదనే పిటిషనర్‌ వాదనను సమర్థించింది. భూ కేటాయింపులు జరిగినా నిర్మాణాలు ప్రారంభించని ఇందూటెక్‌ జోన్, బ్రాహ్మణి ఇన్‌ఫ్రాటెక్‌ లిమిటెడ్, స్టార్‌గేజ్‌ ప్రాపర్టీస్, అనంత టెక్నాలజీస్, జెటీ హోల్డింగ్‌లకు కేటాయించిన భూములను 4 నెలల్లో రద్దు చేయాలని తీర్పు వెలువరించింది. ఆలోగా వాటిని స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

చట్టవిరుద్ధంగా విధులకు లైసెన్స్‌ ఇవ్వలేదు - విజయపాల్‌ బెయిల్ పిటిషన్​​ కొట్టివేత - HC Rejected Vijay Pal Bail Petition

పనులు మొదలైన వాటిలో జోక్యం చేసుకోలేం :ఉమ్మడి రాష్ట్రంలో 2001 నుంచి 2006 సంవత్సరం వరకూ భూములు తీసుకున్న పలు కంపెనీలు 2014 ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కొనసాగుతున్నాయని, వాటి విషయంలో జోక్యం చేసుకోలేమని తెలంగాణ హైకోర్ట్ తెలిపింది. ప్రభుత్వం తన విధానాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ భూకేటాయింపులపై చర్యలు తీసుకుంటోందని, అందుకే భూకేటాయింపుల విషయంలో, ప్రభుత్వ విధానాల్లో జోక్యం చేసుకోలేమంటూ పిటిషన్‌పై విచారణను మూసేసింది.

కస్టడీలో నిందితులకు హాని జరగకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులదే : హైకోర్టు - HC on Raghurama Krishna Raju Case

ABOUT THE AUTHOR

...view details