తెలంగాణ

telangana

ETV Bharat / state

గ్రూప్-1 మెయిన్స్‌కు లైన్ క్లియర్ - సింగిల్‌ బెంచ్‌ తీర్పును సమర్థించిన హైకోర్టు- ఈనెల 21 నుంచి మెయిన్స్

గ్రూప్‌-1 మెయిన్స్‌కు లైన్‌ క్లియర్‌ - సింగిల్‌ బెంచ్‌ తీర్పును సమర్థించిన హైకోర్టు- షెడ్యూల్‌ ప్రకారమే ఈనెల 21 నుంచి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు

By ETV Bharat Telangana Team

Published : 4 hours ago

Updated : 3 hours ago

Telangana High Court Decision on Group 1 Exams
Telangana High Court Decision on Group 1 Exams (ETV Bharat)

Telangana High Court Decision on Group 1 Exams :ఎట్టకేలకుగ్రూప్-1 మెయిన్స్‌ పరీక్షలకు లైన్‌ క్లియరైంది. తెలంగాణ గ్రూప్‌-1 పరీక్షలకు దాఖలైన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. సింగిల్‌ బెంచ్‌ తీర్పును హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ సమర్థించింది. దీంతో షెడ్యూల్‌ ప్రకారమే ఈ నెల 21తేదీ నుంచి గ్రూప్‌-1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. ప్రిలిమ్స్‌లోని 7 ప్రశ్నలకు తుది 'కీ'లో సరైన జవాబులు ఇవ్వలేదని, ఏడు ప్రశ్నలకు మార్కులు కలిపి మళ్లీ జాబితా ఇవ్వాలని కోరిన పిటిషనర్లు దాఖలు చేయగా తాజాగా వాటిని హైకోర్టు కొట్టివేసింది.

సుప్రీంకోర్టును ఆశ్రయించిన గ్రూప్-1 అభ్యర్థులు - ఆ జీవో రద్దు కోరుతూ పిటిషన్

నోటిఫికేషన్‌ చెల్లదంటూ, సమాధానాలు తప్పంటూ పిటిషన్లు : 2022లో జారీ చేసిన నోటిఫికేషన్‌ రద్దు చేయకుండా మరో నోటిఫికేషన్ జారీ చేయడం చెల్లదని, ప్రాథమిక కీలో తప్పులున్నాయని వాటిని సవరించాలన్న అభ్యంతరాలను కూడా పట్టించుకోలేదని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. గతంలో గ్రూప్‌1 నియామక పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ ఇదే హైకోర్టు పరీక్షను రద్దు చేసిందని గుర్తుచేశారు. వందల పోస్టులను భర్తీ చేయడానికి నిర్వహిస్తున్న పరీక్షలకు లక్షల మంది ప్రిలిమ్స్‌ రాశారని, టీజీపీఎస్సీ వెలువరించిన తుది 'కీ'లో కూడా 7 ప్రశ్నలకు సమాధానాలు తప్పుగా ఉన్నాయని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదించారు. ఈ ప్రశ్నలను తొలగించి తాజా 'కీ'ని రూపొందించి అభ్యర్థుల జాబితా సిద్ధం చేయాలని కోరారు.

వాళ్ల ఆమోదం తర్వాతే ఫలితాలు :గ్రూప్‌1 ప్రిలిమ్స్‌ రాసిన 3 లక్షల మంది అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు కోరగా 721 మంది భౌతికంగా, 6470 అభ్యంతరాలను ఆన్‌లైన్‌లో స్వీకరించినట్లు టీజీపీఎస్సీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అభ్యంతరాలన్నింటినీ సబ్జెక్టుల వారీగా నిపుణుల కమిటీకి పంపించి వారి ఆమోదం తర్వాతే ఫలితాలు విడుదల చేసినట్లు తెలిపారు.

46కేంద్రాల్లో మెయిన్స్ పరీక్షలు : రాష్ట్రంలో ఈ నెల 21 నుంచి 27వరకు గ్రూప్‌-1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. వీటి నిర్వహణకు టీజీపీఎస్సీ ఏర్పాట్లు పూర్తి చేసింది. గ్రూప్‌-1 ప్రధాన పరీక్షల నిర్వహణకు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో 46 ఎగ్జామ్ సెంటర్లను సిద్ధం చేశారు. ఈ పరీక్షకు 33,383 మంది అభ్యర్థులు హాజరుకానున్నట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్‌ 8, రంగారెడ్డి 11, మేడ్చయల్‌ జిల్లాలో 27 ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రతి ఎగ్జామ్ హాల్, చీఫ్‌ సూపరింటెండెంట్‌ రూమ్, పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, టీజీపీఎస్సీ కార్యాలయ కమాండ్‌ కంట్రోల్ కేంద్రం నుంచి పర్యవేక్షిస్తారు.

అభ్యర్థులు బయోమెట్రిక్‌ హాజరుకు ప్రత్యేక సిబ్బందిని నియమించామని, మధ్యాహ్నం 1.30గంటల తర్వాత కేంద్రంలోని అనుమతించబోమని అధికారులు తెలిపారు. గురువారం సాయంత్రం వరకు 90శాతం మంది అభ్యర్థులు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోగా, 20వ తేదీ వరకు అవకాశముందని టీజీపీఎస్సీ వర్గాలు తెలిపాయి.

గ్రూప్1 అభ్యర్థులకు అలర్ట్ - మెయిన్స్‌ హాల్ టికెట్లు విడుదల

7 ప్రశ్నలపై పీటముడి - గ్రూప్‌-1 నోటిఫికేషన్‌పై హైకోర్టులో తీర్పు రిజర్వ్‌ - Telangana HC Reserved Group 1 Case

Last Updated : 3 hours ago

ABOUT THE AUTHOR

...view details