తెలంగాణ

telangana

ETV Bharat / state

Viral Video : మహాశివరాత్రి రోజున అరుదైన ఘటన - అదే ఆలయంలో మరోసారి నాగుపాము ప్రత్యక్షం - SNAKE APPEARED IN SHIVA TEMPLE

మహాశివరాత్రి రోజున అరుదైన ఘటన - నాగదేవత విగ్రహం వద్ద దర్శనమిచ్చిన నాగుపాము - పెద్ద సంఖ్యలో తరలివచ్చి దర్శించుకున్న భక్తులు

Snake Appeared in Shiva Temple on Shivaratri
Snake Appeared in Shiva Temple on Shivaratri (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Feb 26, 2025, 7:01 PM IST

Snake Appeared in Shiva Temple on Shivaratri :మహాశివరాత్రి వేళ రాష్ట్రవ్యాప్తంగా శైవక్షేత్రాలన్ని భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పుణ్యస్నానం ఆచరించి పరమశివుని దర్శనం కోసం తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరారు. శంభో శంకర అంటూ ముక్కంటిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు.

ఆలయంలో నాగుపాము దర్శనం :మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పెద్దపల్లి జిల్లా ఓదెల గ్రామంలోని శివాలయంలో ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఓదెల శివాలయం ఆవరణలో ఉన్న నాగదేవత విగ్రహం వద్ద ఓ పెద్ద నాగుపాము దర్శనమిచ్చింది. గతంలోనూ ఈ ఆలయంలో నాగుపాము దర్శనమివ్వగా తాజాగా మహాశివరాత్రి పర్వదినం నాడు మరోసారి నాగుపాము ప్రత్యక్షమవ్వడంతో ఇదంతా దేవుడి మహిమేనని భక్తులు భావిస్తున్నారు. నాగదేవత విగ్రహం వద్ద చాలాసేపు నాగుపాము ఉండటంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి నాగుపామును దర్శించుకున్నారు

Shiva Art On Leaf :మహాశివరాత్రిని పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌కు చెందిన ప్రముఖ లీఫ్ ఆర్టిస్ట్ గుండు శివకుమార్ భక్తులకు వినూత్నంగా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. రావి ఆకుపై ఆ మహాశివుని ప్రతిమను గీసి అరచేతిలో, చేతి గోళ్ళపై శివుని అలంకారాలు, విగ్రహ ప్రతిమలను వేసి భక్తులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

శివరాత్రి పర్వదినాన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ముక్కంటి దర్శనం కోసం రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. MLC కల్వకుంట్ల కవిత రాజన్నను దర్శించుకున్నారు.

Maha Shivratri Celebration 2025 :వరంగల్‌ వెయ్యి స్తంభాల గుడిలో మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా కాళేశ్వరం త్రివేణి సంగమంలో భక్తుల పుణ్యస్నానాలు ఆచరించి, దీప దానాలు, గోదావరి మాతకు విశేష పూజలు చేస్తున్నారు. ఏడుపాయలలోనూ మహా శివరాత్రి జాతర వైభవంగా ప్రారంభమైంది. వనదుర్గభవాని మాతకు వైద్యా ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పట్టు వస్త్రాలు సమర్పించారు. రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలతో, పాడిపంటలతో, సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని మొక్కుకున్నట్లు మంత్రి తెలిపారు. ములుగు జిల్లా పాలంపేటలోని రామప్ప రామలింగేశ్వర ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది.

"శివరాత్రి జాగారానికి సిద్ధమవుతున్నారా? - ఈ తప్పులు చేస్తే జాగరణ కానే కాదు - ఫలితం దక్కదు!"

"అష్ట కష్టాలు" నిజంగానే ఉన్నాయి - శివరాత్రి వేళ తప్పక తెలుసుకోండి - ఇందులో మీరెన్ని పడుతున్నారు?

శివరాత్రి ఉపవాసాల్లో 5 రకాలు! - మీరు పాటించేది ఏ రకం? - శివయ్య ఆశీస్సులు మీ పైనే!

ABOUT THE AUTHOR

...view details