ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కోటప్పకొండలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు: త్రికోటేశ్వరస్వామికి బిందెతీర్ధంతో తొలిపూజ - Kotappa Konda Sivarathri

Sivarathri Celebrations at Kotappa Konda: పల్నాడు జిల్లా కోటప్పకొండలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ రోజు వేకువజాము నుంచే స్వామి వారికి తొలిపూజలో భాగంగా బిందెతీర్ధంతో మహోత్సవాన్ని అర్చకులు ప్రారంభించారు. త్రికోటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తారని అధికారులు అంచనా వేసి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది.

Sivarathri_Celebrations_at_Kotappa_Konda
Sivarathri_Celebrations_at_Kotappa_Konda

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 8, 2024, 1:36 PM IST

కోటప్పకొండలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు: త్రికోటేశ్వరస్వామికి బిందెతీర్ధంతో తొలిపూజ

Sivarathri Celebrations at Kotappa Konda: రాష్ట్రంలోనే ప్రముఖ శైవక్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన పల్నాడు జిల్లా కోటప్పకొండ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. శ్రీ త్రికోటేశ్వరస్వామి (Trikoteshwara Swamy) ఆలయంలో ఈరోజు తెల్లవారుజామున 2 గంటలకు స్వామి వారికి తొలిపూజలో భాగంగా బిందెతీర్ధంతో మహోత్సవాన్ని ఆలయ అర్చకులు ప్రారంభించారు. త్రికోటేశ్వరునికి నిర్వహించే తొలిపూజ వేడుకను తిలకించేందుకు భక్తులుశుక్రవారం రాత్రి నుండే ఆలయంలో బారులు తీరారు.
కోటప్పకొండకు భారీగా తరలివచ్చిన భక్తులు...

Sivarathri Arrangements In Kotappa konda: మహా శివరాత్రి సందర్భంగా నిర్వహించే తిరునాళ్లకుకోటప్పకొండ ముస్తాబైంది. కొండ విద్యుత్ దీపాల (Electric lights) వెలుగులో మెరిసిపోతుంది. కొండ దిగువన బొచ్చుకోటయ్య స్వామి, సిద్ధివినాయక, రాజగోపురం, స్వామి వారి ఆలయం, యాగశాల, నవగ్రహ మండపం, పుట్ట, ధ్యాన మందిరం, అతిథి గృహాలు, క్యూకాంప్లెక్స్‌ తదితరాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. కొండకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా యంత్రాంగం (District Administration) అన్నిశాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేసింది. భక్తులకు సేవల నిమిత్తం ఎక్కడికక్కడే కంట్రోల్‌ రూంలు ఏర్పాటు చేశారు. అదనపు పోలీసు సిబ్బందితో భద్రతా చర్యలతో పాటు ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణ చేయనున్నారు. కొండ చుట్టూ వాహనాల పార్కింగ్‌ కోసం ఏర్పాట్లు చేశారు.

పిలుస్తోంది కోటప్పకొండ
కోటప్పకొండపై ఏర్పాట్లు:కొండపై యాగశాలలో ఒకేసారి 50కు పైగా హోమాలు జరిగేలా ఏర్పాట్లు చేశారు. పంచాయతీరాజ్‌ శాఖ వారి సాయంతో స్వచ్ఛంద సంస్థలను కలుపుకొని తాగునీటితో పాటు, అల్పాహార ఏర్పాట్లు చేశారు. కలెక్టర్‌, ఎస్పీ అతిథి గృహాల్లో కొండపైనే బస చేసి, భక్తుల సౌకర్యాలను పరిశీలించనున్నారు. సామాన్య భక్తులకు ఆర్టీసీ బస్టాండ్‌ నుంచే కొండపైకి బస్సు సౌకర్యం కల్పించారు. తిరునాళ్లలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ప్రభలను కోటప్పకొండ చుట్టు పక్కల గ్రామాలకు చెందిన భక్తులు ఒకరోజు ముందుగానే కొండకు తరలించారు. మరి కొన్ని ప్రభలు ఈరోజు సాయంత్రానికి కొండకు చేరుకొనున్నాయి. తిరునాళ్ల వేడుకలకు ట్రాఫిక్ ఇబ్బంది ఏర్పడకుండా ముందస్తు ఏర్పాట్లు చేసినట్లు పల్నాడుజిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి వెల్లడించారు. వాహనాల రాకపోకలకు ఇప్పటికే పోలీస్ అధికారులు రహదారుల దిశానిర్దేశాలు చేశారు. తిరునాళ్లకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ప్రభుత్వ శాఖల అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు ముందస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

"శైవక్షేత్రాల్లో కోటప్పకొండ త్రికోటేశ్వరాలయానిది ప్రత్యేక స్థానం. ఇక్కడ శివయ్య త్రికోటేశ్వరునిగా దర్శనమిస్తాడు. త్రికూఠాధిపతులుగా చెప్పుకునే మూడు కొండల మధ్య శివుడు వెలిసినట్లు ప్రతితీ. ఈశ్వరుడు కైలాసాన్ని విడిచి ఈ కొండపైనే తపస్సు చేశాడని స్థలపురాణం చెబుతుంది. ఈ కొండలపైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు తపస్సు చేశారని భక్తుల నమ్మకం."

-అయ్యప్ప గురుకుల్, కోటప్పకొండ ప్రధాన అర్చకులు

ఘనంగా కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి ఆరుద్రోత్సవాలు

ABOUT THE AUTHOR

...view details