ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం - ఏపీకి పొంచి ఉన్న భారీ వాయుగుండం!

దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం - నేడు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : 14 hours ago

HEAVY_RAINS_IN_AP
HEAVY_RAINS_IN_AP (ETV Bharat)

Heavy Rains in AP :బంగాళాఖాతంలో వాయుగుండం తీరంవైపు దూసుకొస్తోంది. ఇది నెల్లూరు-పుదుచ్చేరి మధ్య గురువారం తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.

RAIN ALERT TO AP : బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ మంగళవారం సాయంత్రం వాయుగుండంగా బలపడింది. ఇది ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, ఏపీలోని దక్షిణ కోస్తా తీరాల వైపు కదులుతోంది. ఇది గురువారం పుదుచ్చేరి, నెల్లూరు మధ్య తీరాన్ని తాకవచ్చని వాతావరణ శాఖ తెలిపింది.

తీరంవైపు దూసుకొస్తున్న దీని ప్రభావంతో నెల్లూరు, ప్రకాశం, వైఎస్సార్​, చిత్తూరు జిల్లాల్లో ఆకస్మిక వరదలకు ఆస్కారముందని ఐఎండీ హెచ్చరించింది. బుధ, గురువారాల్లో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని దక్షిణకోస్తా, రాయలసీమలో కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు, మిగిలినచోట్ల అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గరిష్ఠంగా గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

అల్పపీడన ద్రోణి ఎఫెక్ట్ - పలుచోట్ల విస్తారంగా వర్షాలు

కంట్రోల్ రూమ్ ఏర్పాటు :వాయుగుండం ప్రభావంతో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని పలుప్రాంతాల్లో కుంభవృష్టి కురుస్తోంది. రాత్రి నుంచి ఉరుములు మెరుపులుతో భారీ వర్షం పడుతోంది. కావలిలో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలోని తీరప్రాంత మండలాల్లో గాలులు తీవ్రత పెరిగింది. పలు జిల్లాలో ఇవాళ కూడా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. విపత్తుల నిర్వహణ సంస్థ ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది. జిల్లా కలెక్టరేట్ తో పాటు మండల, డివిజన్, జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.

కంట్రోల్ రూమ్ నంబర్
తిరుపతి కలెక్టరేట్ 0877-2236007
గూడూరు సబ్ కలెక్టరేట్‌ 86242 52807
సూళ్లూరుపేట ఆర్‌డీవో కార్యాలయం 86232 95345
తిరుపతి ఆర్‌డీవో కార్యాలయం 70321 57040
శ్రీకాళహస్తి ఆర్‌డీవో కార్యాలయం 99665 24952

ఏపీలో భారీ వర్షాలు - రేపు ఈ జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు

Nellore District : తీర ప్రాంతాలైన కోట, చిల్లకూరు, వాకాడు, తడ మండలాల్లో అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో (ఎస్​డీఆర్​ఎఫ్)​ బృందాలను సిద్ధంగా ఉంచారు. నెల్లూరు నగరంలోఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అయ్యప్పగుడి సెంటర్, తల్పగిరి కాలనీ, రెవెన్యూ కాలనీ, చంద్రబాబు కాలనీ, వైఎస్సార్​ కాలనీని ఇళ్లల్లో నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నగరంలోని పెన్నా బ్రిడ్జి సమీపంలో పడిన గండిని పూడ్చే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.

Tirupati District :తిరుపతి జిల్లాలో ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తోంది. నాయుడుపేట, సూళ్లూరుపేట పురపాలక సంఘాల పరిధిలో భారీ వర్షానికి వీధులు జలమయమయ్యాయి. సూళ్లూరుపేటలోని లోతట్టు ప్రాంతాల్లో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ జోరు వర్షంలోనూ పర్యటించారు. స్థానికులను పునరావాస కేంద్రాలకు తరలించారు. తిరుమలలో ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షం వల్ల భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో వీఐపీ బ్రేక్‌ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.

'బీ అలర్ట్' - విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు - విద్యాసంస్థలకు సెలవులు

Annamaya District : అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా జోరుగా వర్షం పడుతోంది. ఇవాళ జిల్లాలో అతి భారీ వర్షాలు పడుతాయన్న హెచ్చరికలతో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ప్రజలు అత్యవసర పనులు ఉంటే తప్ప బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల్లో డ్రోన్లు వినియోగించి ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తున్నారు.

YSR District : కడప నగరంలో రాత్రి భారీగా వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణం మొత్తం నీటితో నిండిపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. భరత్ నగర్, అక్కయ్యపల్లి, శాస్త్రినగర్, గంజికుంట కాలనీ, అల్లూరి సీతారామరాజు నగర్, లోహియా నగర్ తదితర ప్రాంతాల్లోని రోడ్లపై వర్షపు నీరు ప్రవహించడంతో ప్రజలు అవస్థలు పడ్డారు.

బంగాళాఖాతంలో అల్పపీడనం - 48 గంటల్లో మరింత బలపడే అవకాశం

Anantapur District : వాయుగుండం ప్రభావంతో అనంతపురం జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. అనంతపురంలో రహదారులపై పలుచోట్ల రెండు అడుగుల మేర నీరు నిలిచింది. శ్రీ సత్యసాయి జిల్లాలోనూ పలుచోట్ల ఎడతెరిపిలేకుండా వర్షం పడుతోంది. వాగులు, వంకలు, నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను జిల్లా యంత్రాంగం అప్రమత్తం చేసింది. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలపై హోం, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి అనిత వరుస సమీక్షలు నిర్వహించారు. తాడేపల్లిలోని విపత్తు నిర్వహణ సంస్థ కార్యాలయంలోనే ఉంటూ జిల్లా కలెక్టర్లకు ఎప్పటికపుడు ఆదేశాలిస్తున్నారు. రెండు, మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ సమాచారంతో ఎస్​డీఆర్​ఎఫ్​, ఎన్​డీఆర్​ఎఫ్​ బృందాలను సిద్ధంగా ఉంచినట్లు మంత్రి తెలిపారు.

ఏపీ వైపు దూసుకొస్తున్న మరో తీవ్ర తుపాను-అప్రమత్తమైన ప్రభుత్వం

ABOUT THE AUTHOR

...view details