తెలంగాణ

telangana

ఆపద సమయంలో బాధితులకు అండగా రామోజీ గ్రూప్​ - ఆపన్నహస్తంతో ఎన్నో కార్యక్రమాలు - Ramoji Rao Group Relief Funds

By ETV Bharat Telangana Team

Published : Jun 8, 2024, 1:40 PM IST

Updated : Jun 8, 2024, 1:49 PM IST

Ramoji Rao Relief Funds : తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా రామోజీ గ్రూప్​ చేయూతనిచ్చింది. ఈనాడు, రామోజీ సంస్థ సహాయ నిధి ద్వారా ప్రకృతి విపత్తుల సమయంలో కోట్ల రూపాయలు బాధితులకు అందించి అండగా నిలిచింది. తుపాను రక్షిత భవనాలు, ఔత్సాహికులకు భరోసా, కరోనా సమయంలో సీఎం రిలీఫ్​ ఫండ్​ ద్వారా తెలుగురాష్ట్రాలకు రూ.10 కోట్ల సాయం వంటి ఎన్నో ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టి సంస్థ ఛైర్మన్​ ఎన్నో సేవలు అందించారు.

RAMOJI RAO GROUP RELIEF FUNDS
Ramoji Rao Relief Funds (ETV Bharat)

వరద బాధితులకు రామోజీ ఆపన్నహస్తం :తెలంగాణలో 2020లో భారీ వర్షాలతో తీవ్రంగా నష్టపోయి అల్లాడుతున్న ప్రజలకు రామోజీ గ్రూపు ఛైర్మన్ రామోజీ రావు చేయూతనందించారు. రామోజీ గ్రూపు సంస్థల తరఫున ఆయన ముఖ్యమంత్రి సహా యనిధికి రూ.5 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. ఈ మొత్తానికి సంబంధించిన చెక్కును సంస్థ ప్రతినిధులు అప్పటి పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్​కు అందజేశారు. ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళం అందజేసి బాధితులకు బాసటగా నిలచిన రామోజీ గ్రూప్​ను అప్పటి మంత్రి కేటీఆర్ అభినందించారు. 2020లో కూడా దేశాన్ని కబళించిన కరోనా సమయంలోనూ రామోజీ గ్రూప్​ సంస్థ తెలుగు రాష్టాలకు విడివిడిగా సీఎం రిలీఫ్​ ఫండ్​ ద్వారా రూ.10 కోట్ల సాయం చేసింది.

రూ. 7.77 కోట్లతో 116 పక్కా గృహాలు - కేరళ వరద బాధితులకు అండగా నిలిచేందుకు రామోజీ గ్రూపు

2019లో కూడా కేరళ వరదల్లో నిలువ నీడ కోల్పోయిన పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు 'రామోజీ గ్రూపు' శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని అతిపెద్ద మహిళా సహాయక గ్రూపు 'కుటుంబశ్రీ'తో ఇందుకోసం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. వరద బాధితులకు ఆపన్నహస్తం అందిస్తున్నందుకుగాను రామోజీ గ్రూపునకు అప్పటి కేరళ మంత్రులు ధన్యవాదాలు తెలిపారు.

2018లోనూ ఆగస్టులో కేరళను భారీ వరదలు ముంచెత్తాయి. దీంతో ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. చాలామంది ఇళ్లు కోల్పోయారు. బాధితులకు అండగా నిలిచేందుకు రామోజీ గ్రూపు ముందుకొచ్చింది. గ్రూపు సంస్థల తరపున ఛైర్మన్ రామోజీ రావు రూ. 3 కోట్లతో 'ఈనాడు సహాయనిధి'ని ప్రారంభించి, దాతల నుంచి విరాళాలు ఆహ్వానించారు. 'ఈనాడు'తోపాటు రామోజీ గ్రూపులోని ఇతర సంస్థల మీద అచంచల విశ్వాసంతో వేల మంది మానవతావాదులు విరాళాలు అందించారు.

రామోజీ సేవలకు ఎన్నో పురస్కారాలు : దీంతో సహాయక నిధి మొత్తం రూ.7.77 కోట్లకు చేరింది. వరదల ధాటికి తీవ్రంగా దెబ్బతిన్న కేరళలోని అలప్పుజ జిల్లాలో పేదలకు ఈ నిధితో 116 పక్కా గృహాలు కట్టాలని రామోజీ గ్రూపు సంకల్పించింది. ఇందు కోసం ముఖ్యమంత్రి పినరయి విజయన్ సూచన మేరకు 'కుటుంబశ్రీ'కి నిర్మాణ పనులు అప్పగించింది. తొలి విడతలో 40 ఇళ్లు నిర్మించారు. సుశిక్షితులైన కుటుంబశ్రీ మహిళా కార్మికులు ఈ ఇళ్ల నిర్మాణంలో పాలుపంచుకున్నారు.

అంతేకాకుండా ఈనాడు సహాయ నిధి ద్వారా కోట్ల రూపాయలు వెచ్చించి దేశవ్యాప్తంగా ఎన్నో శాశ్వత నిర్మాణాలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల్లో ఇళ్లు, బడులు, తుపాను రక్షిత భవనాలు నిర్మించారు. శ్రమదానోద్యమం, సుజలాం-సుఫలాం ద్వారా ఎన్నో ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టారు. రామోజీ సేవలకు ఎన్నో పురస్కారాలు లభించాయి.

తెలుగు పత్రికారంగంలో చెరగని ముద్ర వేసిన రామోజీరావు - RAMOJIRAO SERVICES TO MEDIA

రైతుబిడ్డగా మొదలై మీడియా మహాసామ్రాజాన్ని నిర్మించిన యోధుడు రామోజీ రావు - Ramoji Rao biography

Last Updated : Jun 8, 2024, 1:49 PM IST

ABOUT THE AUTHOR

...view details