Ram Mohan Naidu at Aero India 2025: బెంగళూరులో జరుగుతున్న ఏరో ఇండియా ప్రదర్శనకు ముఖ్యఅతిథిగా కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు వెళ్లారు. ఈ సందర్భంగా యుద్ధ విమానంలో ప్రయాణించారు. స్వదేశీ పరిజ్ఞానంతో యుద్ధవిమానాలు తయారు చేయడంపై కేంద్రమంత్రి ప్రశంసలు కురిపించారు.
ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు తన ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఏరో ఇండియా-2025లో భాగంగా యుద్ధ విమానాన్ని నడిపడం మరచిపోలేని అనుభూతినిచ్చిందంటూ ఎక్స్ వేదికగా తెలిపారు. హెచ్ఏఎల్ (Hindustan Aeronautics Limited) స్వదేశంలో సగర్వంగా తయారు చేసిన హెచ్ జేటీ-36 'యశస్' అనే అద్భుతమైన జెట్ విమానంలో ప్రయాణించే అరుదైన అవకాశం లభించిందని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. విమానయాన, రక్షణ తయారీలో రోజురోజుకూ పెరుగుతున్న పరాక్రమానికి ఈ స్వదేశీ అద్భుతం నిదర్శనమని కొనియాడారు.