తెలంగాణ

telangana

ETV Bharat / state

'నేను చనిపోతా - లేదు నేనే చనిపోతా' - సూసైడ్​పై ఆ ఇద్దరి మధ్య వాట్సాప్ చాటింగ్! - KAMAREDDY MYSTERY DEATH CASE

కామారెడ్డి ఘటనలో వీడని మిస్టరీ - నీటిలో మునిగి ఊపిరాడకే ముగ్గురూ మృతి చెందినట్లు పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడి - శ్రుతి, నిఖిల్‌ ఆత్మహత్య గురించి ముందే మాట్లాడుకున్నట్లు గుర్తించిన పోలీసులు

mystery death case
Kamareddy mystery death case (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Dec 28, 2024, 6:45 AM IST

Updated : Dec 28, 2024, 7:15 AM IST

Suspense on SI, Constable, Computer Operator Death : సంచలనంగా మారిన కామారెడ్డి జిల్లా భిక్కనూర్‌ ఎస్సై సాయికుమార్‌, కానిస్టేబుల్‌ శ్రుతి, బీబీపేట యువకుడు నిఖిల్‌ మృతి కేసు వెనక ఉన్న కారణాలపై మిస్టరీ వీడలేదు. ముగ్గురూ చెరువులో మునగడం వల్లే మృతి చెందినట్లు పోస్టుమార్టం నివేదికల్లో వెల్లడైంది. ముగ్గురి శరీరాలపై ఎలాంటి గాయాలు లేవని, నీటిలో ఊపిరాడకే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే ముగ్గురూ కలిసే చనిపోయారా? ఒకరు ఆత్మహత్యకు యత్నిస్తే కాపాడే క్రమంలో మిగతా ఇద్దరూ మరణించారా? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

ముగ్గురి సెల్‌ఫోన్లు 25న స్విచ్ ఆఫ్‌ అయినట్లు గుర్తించిన పోలీసులు, భిక్కనూర్‌ ఠాణా నుంచి వారు మరణించిన అడ్లూర్‌ ఎల్లారెడ్డి చెరువు వరకూ దారి పొడవునా ఉన్న సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ముగ్గురి కాల్‌ డేటా, వాట్సాప్‌ చాటింగ్‌లు పరిశీలించగా, శ్రుతి, నిఖిల్‌ మధ్య ఆత్మహత్యకు సంబంధించి సంభాషణ జరిగినట్లు తెలుస్తోంది. వారిద్దరూ నేను చనిపోతానంటే, నేను చనిపోతానని వాట్సాప్‌లో చాటింగ్‌ చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆత్మహత్య చేసుకోవాలనుకున్న విషయాన్ని ఎస్సై సాయికుమార్‌తో చర్చించినట్లు తెలుస్తోంది.

అయితే సాయికుమార్‌కు చెందిన మూడు సెల్‌ఫోన్లలో రెండు అన్‌లాక్‌ అయి ఉన్నాయని, వాటిని పరిశీలించిన తర్వాతే మిగతా విషయాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు. ముగ్గురికీ ఆర్థిక పరమైన అంశాలేమైనా ఉన్నాయా? అనే కోణంలో ముగ్గురి బ్యాంక్‌ ఖాతా వివరాలు పోలీసులు సేకరించారు.

ఇక్కడికే ఎందుకు వచ్చారు? : ఈ కేసులో నిజాలు నిగ్గు తేల్చేందుకు అడ్డూర్ ఎల్లారెడ్డి చెరువు వద్ద పోలీసులు సీన్ రీకన్​స్ట్రక్షన్ చేపట్టారు. ముగ్గురు అక్కడికి ఎలా చేరుకున్నారనే దానితో పాటు ఇక్కడికే ఎందుకు వచ్చారనే దానిపై ప్రధానంగా దృష్టి సారించారు. వీటితో పాటు ముగ్గురి మృతుల కుటుంబీకులు, బంధువులు, స్నేహితుల వాంగ్మూలాలు తీసుకోనున్నారు. 2018 బ్యాచ్​కు చెందిన పోలీసుల నుంచి ఎస్సై సాయికుమార్ నడవడిక, ఇతరత్రా విషయాలను ప్రత్యేక బృందం సేకరిస్తోంది. కేసు దర్యాప్తులో భాగంగా అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువు వద్ద మరోసారి సీన్ రీ-కన్​స్ట్రక్షన్ చేపట్టనున్నట్లు పోలీసులు తెలిపారు.

మమ్మీ డాడీ వచ్చాడు :ఇదిలా ఉండగాఎస్సై సాయికుమార్‌ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఓ ఎస్సై యూనిఫాంలో మెదక్‌ జిల్లా కొల్చారంలోని వారింటికి శుక్రవారం వెళ్లారు. అది గమనించి సాయికుమార్‌ కొడుకు శ్రేయాన్ష్‌ ‘మమ్మీ.. డాడీ వచ్చాడు’ అంటూ పరుగున వెళ్లి హత్తుకున్నాడు. కొద్దిసేపటికి తలపైకెత్తి చూడగా వచ్చిన వ్యక్తి డాడీ కాదని నిర్ధారించుకొని వెంటనే నిరాశతో వెనుదిరిగి అతడి తల్లి మహాలక్ష్మి(సాయికుమార్‌ భార్య) ఒడిలోకి చేరాడు. ‘అయ్యో మర్చిపోయాను మమ్మీ.. ఎవరో డాడీని చంపేసి సముద్రంలో పడేశారు కదా’ అని అనడంతోనే అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఏడ్చారు.

ఆ పరిచయమే బలితీసుకుందా? - వీడని ఎస్సై, కానిస్టేబుల్, ఆపరేటర్ డెత్ మిస్టరీ

మహిళా కానిస్టేబుల్​, కంప్యూటర్ ఆపరేటర్‌, ఎస్సై మృతి - అసలేం జరిగింది?

Last Updated : Dec 28, 2024, 7:15 AM IST

ABOUT THE AUTHOR

...view details