తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రాచీన నృత్యానికి యువ కళాకారుడి సవ్వడి - పేరిణి కళా ప్రతిభకు ప్రధాని నుంచి ప్రశంస - Perini Dance Fame Raj Kumar

Perini Dance Fame Raj Kumar Performance : ఎప్పటి లాగే ఓ రోజు మన్ కీ బాత్‌లో దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం. ఉన్నట్టుండి ప్రధాని నోట, ఆ యువకుడి పేరు రాజ్ కుమార్ నాయక్. అది విన్న ఆ యువకుడికి పట్టలేనంత ఆనందం. కళ్లల్లో ఒక్కసారిగా నీళ్లు తిరిగాయి. ఎక్కడో మారుమూల పల్లెలో ఉన్న తనను, ప్రధాని గుర్తుచేయడం ఏంటనీ ఉబ్బితబ్బిబ్బైపోయాడు. మరోసారి ఏకంగా ప్రధాని నుంచి ఆహ్వానం అందుకుని, అవార్డు సొంతం చేసుకున్నాడు. అయితే ఒకానొక సమయంలో చనిపోవడానికి సిద్ధపడి, ఇప్పుడు దేశ ప్రముఖులచేత ప్రశంసలందుకునే స్థాయికి చేరాడు రాజ్​కుమార్‌. మరి, ఇదంతా ఎలా సాధ్యమైంది? ఎదిగే క్రమంలో ఎలాంటి ఒడిదుడుగులు ఎదుర్కొన్నాడో ఈ కథనంలో చూద్దాం.

By ETV Bharat Telangana Team

Published : Apr 7, 2024, 7:03 PM IST

PM Modi Appreciated to Perini Raj Kumar
Perini Dance Fame Raj Kumar Performance

ప్రాచీన నృత్యానికి యువ కళాకారుడి సవ్వడి - పేరిణి కళా ప్రతిభకు ప్రధాని నుంచి ప్రశంస

Perini Dance Fame Raj Kumar Performance : పేరిణి, ఇది తెలంగాణ ప్రాచీన సంప్రదాయ నృత్యకళ. కాకతీయ కళావైభవంలో ఓ వెలుగు వెలిగిన నాట్యం. అలాంటి వైవిధ్యభరితమైన నృత్యకళను కెరీర్‌గా ఎంచుకున్నాడు ఈ యువకుడు. నేర్చుకున్న కళను ప్రపంచవ్యాప్తం చేయాలని విదేశాల్లోనూ శిక్షణ ఇచ్చాడు. తెలంగాణ భాషా సాంస్కృతికశాఖతో(Telangana Language and Culture Dept) కలిసి వందలాది ప్రదర్శనలు చేశాడు. తన కళాప్రతిభతో ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు ఈ కళాకారుడు.

ఇక్కడ శిక్షణ ఇస్తున్న ఈ యువకుడి పేరు రాజ్‌ కుమార్‌. సూర్యాపేట జిల్లా బీబీ గూడెం స్వస్థలం. పాఠశాల రోజుల్లో జానపదాలపై ఆసక్తి పెంచుకున్నాడు. బాబాయి సహకారంతో అఫ్జల్ పాషా వద్ద ఆంధ్రనాట్యాన్ని నేర్చుకున్నాడు. ఆ తర్వాత వరంగల్‌లోని పోతన విజ్ఞాన పీఠంలో పేరిణి నాట్య గురువు పద్మశ్రీ నటరాజ రామకృష్ణ నిర్వహించిన 45 రోజుల పేరిణి శిక్షణ తరగతులకు హాజరయ్యాడు. ఆ శిక్షణ, రాజ్ కుమార్ జీవితాన్ని మలుపు తిప్పిందని చెబుతున్నాడు.

Perini dance performance : చిన్నారుల సిరిమువ్వల నాదంతో పులకరించిన శిల్పారామం

"మొదట నా స్కూల్​ వయస్సులో జానపదాన్ని అభ్యసించాను. దాని తర్వాత గురువులు అఫ్జల్ పాషా వద్ద ఆంధ్ర నాట్యాన్ని నేర్చుకుంటూ, అక్కడ నుంచి వారి గురువులైన కళాకృష్ణ బండి కుమారి ఆధ్వర్యంలో ఓరుగల్లులో పుట్టిన పేరిణి నృత్యాన్ని నేర్చుకునే అవకాశం లభించింది. ఆ నలభై ఐదురోజుల శిక్షణ శిబిరంలో నా పేరిణి ప్రస్థావన మొదలైంది."-ధరావత్ రాజ్ కుమార్ నాయక్, పేరిణి నాట్యకారుడు

రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రదర్శనలిస్తూ కళాభిమానులను ఆకట్టుకుంటూ పేరిణి గొప్పదనాన్ని వివరించాడు రాజ్ కుమార్. ఈ క్రమంలో దిల్లీ వేదికగా జరిగిన గణతంత్ర వేడుకల్లో పేరిణి నాట్యాన్ని ప్రదర్శించాడు. అనంతరం మలేషియా వెళ్లి, ఐదేళ్లపాటు అక్కడి స్థానిక కళాకారులు, యువతకు పేరిణిలో శిక్షణ ఇచ్చాడు. అయితే మన దేశంలోనే పేరిణి నాట్యాన్ని(Perini Dance) విస్తృతంగా పరిచయం చేయాలనే సంకల్పంతో, ఉద్యోగానికి రాజీనామా చేసి భారత్‌కు తిరిగొచ్చాడు.

PM Modi Appreciated to Perini Raj Kumar : తెలంగాణ సాంస్కృతికశాఖ ప్రోత్సాహంతో తన ఆలోచనలకు కొత్తదారి వెతుక్కున్నాడు రాజ్ కుమార్. 101 రోజులు ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, విశ్వవిద్యాలయాలు, దేవాలయాల్లో సుమారు 200 ప్రదర్శనలిచ్చి పేరిణి నాట్యం విశిష్టతను చాటిచెప్పాడు. ఆ ప్రయత్నాలకు మంచి స్పందన రావడంతో, వెయ్యి మందితో భారీ స్థాయిలో నాట్యాన్ని ప్రదర్శించాలని భావించాడు. అయితే కరోనా అడ్డుపడి తనను ఆర్థికంగా చిదిమేసి ఆత్మహత్యయత్నం చేసే దాకా తీసుకెళ్లిందని చెబుతున్నాడు.

అడుగులు వేయటమే కష్టమంటే - ఆటపాటలతో ఔరా అనేలా - మనో వైకల్యాన్ని జయిస్తే అసాధ్యాలన్నీ సుసాధ్యాలే అంటున్న యువతి

వైవిధ్యభరితంగా రాణిస్తూ, ఇప్పటి వరకు సుమారు 3 వేలకుపైగా ప్రదర్శనలు చేసి పేరిణి నాట్యానికి కొత్త సొగబులు అద్దుతున్నాడు రాజ్ కుమార్. అలాగే తన వద్ద నాట్యం నేర్చుకొని ప్రతిభావంతులయ్యే వారికి దారి ఖర్చులు కూడా ఇస్తుండటం విశేషం. బీటెక్, ఎంటెక్ సహా వివిధ ఉద్యోగాలు చేస్తూ నాట్యం అంటే అభిరుచి, ఆరాధన ఉన్న సుమారు 30 మందికి ఉచితంగా శిక్షణ(Free Training) ఇస్తుండటం మరో విశేషం.

ప్రాచీన కళను ప్రపంచవ్యాప్తం చేయాలనే లక్ష్యం :తెలంగాణ శాస్త్రీయ నృత్యరూపకమైన పేరిణి నాట్యాన్ని బతికించేందుకు రాజ్ కుమార్ చేస్తున్న కృషి వర్ణించలేనిది. అందుకే కేంద్ర ప్రభుత్వం ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారంతో సత్కరించింది. మన్ కీ బాత్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సైతం అభినందించారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కూడా, ప్రతిభను గుర్తించి సన్మానించారు. అయితే క్రీడాకారుల తరహాలోనే కళాకారులను గుర్తించి తగిన ప్రోత్సాహకాలు అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాడు రాజ్​కుమార్‌.

రాజ్​ కుమార్, కాలికి గజ్జ కట్టి కదన రంగంలోకి దూకాడంటే శివతాండవమే కనిపిస్తుంది మనకి. అందుకే ఇతన్ని పేరిణి రాజ్ కుమార్ అని పిలుస్తుంటారు. అంతలా ఆ నాట్యంలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఓ పూట పిడికెడు అన్నం మెతుకుల కోసం తల్లితో కలిసి రైస్ మిల్లులో పనిచేసిన రాజ్ కుమార్, నేడు పేరిణి నాట్య కళాకారుడిగా అందరి చేత ప్రశంసలందుకుంటున్నాడు. అయితే కళాకారుడిగా ప్రదర్శనలే కాకుండా, నమ్ముకున్ననాట్యాన్ని ప్రపంచవ్యాప్తం చేయాలనే లక్ష్యంగా కృషి చేస్తున్నాడు ఈ ఔత్సాహికుడు.

'తీవ్రవాదాన్ని అన్ని రకాలుగా అణిచివేశాం- భారత్ సామర్థ్యానికి ఇదే నిదర్శనం'

'ప్రజల్లో 'వికసిత్‌ భారత్‌' స్ఫూర్తి- నాటునాటుకు ఆస్కార్​తో దేశమంతా ఫుల్ ఖుషీ'

ABOUT THE AUTHOR

...view details