ఆంధ్రప్రదేశ్

andhra pradesh

జల దిగ్బంధంలోనే పలు గ్రామాలు - అవస్థలు పడుతున్న ప్రజలు - Godavari floods in ap

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 25, 2024, 9:14 AM IST

Updated : Jul 25, 2024, 10:00 AM IST

People Suffering Due to Godavari Floods in Andhra Pradesh : భీకర ప్రవాహంతో పరీవాహక ప్రాంత ప్రజలను వణికించిన గోదావరి చివరకు శాంతించింది. గోదావరి వరదను చూసి చాలా గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరికొందరు కొండగుట్టలపై తలదాచుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఏటా గోదావరి వరదలతో దుర్భర జీవితం గడుపుతున్నామంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు

godavari_floods
godavari_floods (ETV Bharat)

People Suffering Due to Godavari Floods in Andhra Pradesh :ముంచెత్తిన గోదావరి వరదతో విలీన మండలాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే కొందరు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లగా మరికొందరు కొండ గుట్టలను ఆశ్రయించారు. వరదలు వచ్చిన ప్రతిసారీ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నామంటున్న బాధితులు కొత్త ప్రభుత్వమైనా న్యాయం చేయాలని కోరుతున్నారు.

కొండ గుట్టలపై తాత్కాలిక గుడారాలు :ఏలూరు జిల్లాలోగోదావరి వరద తగ్గుతున్నప్పటికీ కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో వరద ప్రభావం కొనసాగుతోంది. వేలేరుపాడు మండలంలో 20 గ్రామాల్లో, కుక్కునూరు మండలంలో 5 గ్రామాల్లో వరద తీవ్రత (Flood Intensity) ఎక్కువగా ఉంది. ఈ గ్రామాల రహదారులు ముంపునకు గురికావడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. లచ్చిగూడెం, రుద్రంకోట గ్రామాలను వరద నీరు చుట్టుముట్టగా గ్రామస్థులు సమీప కొండ గుట్టలపై తాత్కాలిక గుడారాలు వేసుకున్నారు. గుట్టలపైకి వెళ్లిన వారికి విద్యుత్ సదుపాయం కోసం జనరేటర్ అందుబాటులో ఉంచారు. ప్రతి గ్రామంలోనూ వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి మందులు అందిస్తున్నారు. ముంపు ప్రాంతాల ప్రజల రాకపోకల కోసం 13 బోట్లు ఏర్పాటు చేశారు.

లంకలను ముంచెత్తిన వరద గోదారి - బిక్కుబిక్కుమంటున్న కోనసీమ వాసులు - Godavari Floods in Lanka Villages

"మాకు ప్రతి ఏటా విపరీతమైన గోదావరి వరదలు. కాలువలు ఉప్పొంగడం. దారులు లేకపోవడంతో చాలా దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నాం. మాకు ఇంతవరకు ఇళ్లు కూడా కట్టించలేదు. గోదావరికి వరద వస్తే కొండపైకి రావాల్సిన పరిస్థితి. అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసుకున్నా పట్టించుకోలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం మా పరిస్థితులను అర్థం చేసుకొని ఆర్​ అండ్​ ఆర్​ ప్యాకేజీ మాకు ఇచ్చి ఆదుకోవాలని కోరుకుంటున్నాం" -ముంపు గ్రామ బాధితులు

ప్యాకేజీ నిధులు ఇవ్వండి :వేలేరుపాడు మండలం శివకాశీపురం, భూదేవిపేట, కాచారం, కుక్కునూరు మండలం దాచారంలో నాలుగు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయగా బాధితులు వాటిలో తలదాచుకున్నారు. ప్యాకేజీ నిధులు అందించి పక్కా ఇళ్లు కట్టించాలని నిర్వాసితులు కోరుతున్నారు. పునరావాస కేంద్రాలకు చేరుకుంటున్న వారికి, అత్యవసర సమయాల్లో బాధితులకు అందించేందుకు మెరక ప్రాంతాల్లో 14 చోట్ల బియ్యం, కందిపప్పు నిల్వలను అందుబాటులో ఉంచారు.

ఏజెన్సీ గ్రామాల్లో ఆదివాసీల కష్టాలు - ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వాగులు దాటుతున్న వైనం - Agency People Crossing River

లంక గ్రామాల్లో తగ్గని వరద ఉద్ధృతి - మరపడవల్లోనే ప్రమాదకరంగా రాకపోకలు - Floods in Konaseema

Last Updated : Jul 25, 2024, 10:00 AM IST

ABOUT THE AUTHOR

...view details