ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నాగార్జున పిటిషన్‌పై విచారణ - మంత్రి కొండా సురేఖకు కోర్టు నోటీసులు

నాంపల్లి ప్రత్యేక కోర్టులో నాగార్జున పిటిషన్‌పై విచారణ - మంత్రి కొండా సురేఖకు నోటీసులు జారీ చేసిన నాంపల్లి ప్రత్యేక కోర్టు - మరోవైపు మంత్రిపై పరువు నష్టం దావా వేసిన కేటీఆర్

By ETV Bharat Andhra Pradesh Team

Published : 4 hours ago

Notices to Telangana Minister Konda Surekha
Notices to Telangana Minister Konda Surekha (ETV Bharat)

Notices to Telangana Minister Konda Surekha :తెలంగాణమంత్రి కొండా సురేఖపై సినీ నటుడు నాగార్జున వేసిన పిటిషన్‌పై న్యాయస్థానం గురువారం విచారణ చేపట్టింది. ఈ మేరకు మంత్రి కొండా సురేఖకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 23కు వాయిదా వేసింది.

తన కుటుంబంతో పాటు, కుమారుడు నాగచైతన్య-సమంత విడాకుల వ్యవహారంపై కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేశారని నాగార్జున నాంపల్లి కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. రాజకీయ విమర్శల్లో భాగంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ నాగార్జున, నాగచైతన్య, సమంతల పేర్లను ప్రస్తావించారు. ఈ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపింది. ఈ క్రమంలో నాగార్జున మంత్రిపై నాంపల్లి కోర్టులో క్రిమినల్‌ పరువు నష్టం దావా వేశారు. ఆమె తమ కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్ఠను దెబ్బతీసేలా నిరాధార వ్యాఖ్యలు చేశారని, ఆమెపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో కోరారు.

కొండా సురేఖ వ్యాఖ్యలతో తీవ్ర మనోవేదనకు గురయ్యాం - హీరో నాగార్జున వాంగ్మూలం

KTR Files Case On Minister Konda Surekha : మంత్రి కొండా సురేఖపై బీఆర్​ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ పరువు నష్టం దావా వేశారు. ఇవాళ నాంపల్లి ప్రత్యేక కోర్టులో ఆయన తరఫు న్యాయవాది ఉమామహేశ్వర్‌రావు దీనికి సంబంధించిన పిటిషన్​ దాఖలు చేశారు. బీఆర్​ఎస్​ నేతలు బాల్క సుమన్‌, సత్యవతి రాఠోడ్‌, తుల ఉమా, దాసోజు శ్రవణ్‌ను సాక్షులుగా ఉన్నట్లు తెలిపారు. ఇటీవల మంత్రి కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ సినీ పరిశ్రమలోని పలువురుని ప్రస్తావిస్తూ కేటీఆర్​పై తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

24 గంటల్లోగా క్షమాపణలు చెప్పాలి - మంత్రి కొండా సురేఖకు కేటీఆర్ లీగల్ నోటీసులు - KTR Notice to Konda Surekha

'మీ మనోభావాలను దెబ్బతీయడం నా ఉద్దేశం కాదు' : సమంతకు మంత్రి సురేఖ క్షమాపణలు - Konda Surekha Apologize to Samantha

ABOUT THE AUTHOR

...view details