తెలంగాణ

telangana

ETV Bharat / state

గత ప్రభుత్వం కొత్త మండలాలు ఏర్పాటు చేసి వసతులు మరిచింది : మంత్రి ఉత్తమ్ - Minister Uttam Kumar on BRS

Minister Uttam Kumar on BRS : కేసీఆర్ ప్రభుత్వ హాయంలో కొత్త మండలాలు ఏర్పాటు చేసి ఆఫీస్​ బిల్డింగ్​లు నిర్మించడం మరిచారని మంత్రి ఉత్తమ్​ కుమార్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారం చేపట్టాక మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నామని వెల్లడించారు. సూర్యాపేట జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఉత్తమ్​ కుమార్​ రెడ్డి శంకుస్థాపన చేసిన అనంతరం మాట్లాడారు.

By ETV Bharat Telangana Team

Published : Jul 4, 2024, 3:52 PM IST

Updated : Jul 4, 2024, 5:06 PM IST

Minister Uttam Kumar on BRS
Minister Uttam Kumar on BRS (ETV Bharat)

Minister Uttam Kumar on BRS :గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త మండలాలు ఏర్పాటు చేసి మౌలిక సదుపాయాలు కల్పించడం మరిచిందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. సూర్యాపేట జిల్లా కోదాడ, అనంతగిరి మండలాల్లో రూ.23 కోట్లతో నిర్మిస్తున్న అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. అనంతగిరి మండలంలో పోలీస్ స్టేషన్, ఎమ్మార్వో కార్యాలయాల నిర్మాణానికి శంకుస్థాపన అనంతరం మాట్లాడిన ఆయన బీఆర్ఎస్​పై పలు విమర్శలు గుప్పించారు.

ఆ విషయంలో బీఆర్ఎస్ వైఫల్యం చెందింది :కొత్త మండలాల్లో ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించడంలో బీఆర్ఎస్​ వైఫల్యం చెందిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మౌలిక సదుపాయాలతో కూడిన భవనాలను నిర్మిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అంతకు ముందు కోదాడ పురపాలక సంఘం సర్వసభ్య సమావేశానికి హాజరైన ఉత్తమ్​ కుమార్​ రెడ్డి మున్సిపాలిటీ అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పార్టీ కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.

ఆక్రమణలు అరికట్టేందుకు :పెద్ద చెరువు ఆక్రమణలు అరికట్టేందుకు రూ.8కోట్ల వ్యయంతో మినీ ట్యాంక్ బండ్ నిర్మిస్తున్నట్లు తెలిపారు. కింది స్థాయిలో అభివృద్ధికి ప్రజాప్రతినిధులు-అధికారులు భాగస్వామ్యం కావాలని కోరారు. నాణ్యతా ప్రమాణాలతో పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

"కేసీఆర్ ప్రభుత్వ హాయంలో కొత్త మండలాలు ఏర్పాటు చేసి ఆఫీస్​ బిల్డింగ్​లు నిర్మించడం మరిచింది. కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారం చేపట్టాక మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తోంది. కోదాడ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ వంతమైన ప్రాంతంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తాను. అభివృద్ధి ప్రక్రియలో అధికారులు- ప్రజాప్రతినిధులు భాగస్వామ్యం కావాలి" - ఉత్తమ్​ కుమార్ రెడ్డి, మంత్రి

నెల రోజుల్లోనే ప్రజా పాలన అంటే ఏంటో చూపించాం : ఉత్తమ్​కుమార్​ రెడ్డి

Uttam On Debts: ఎనిమిదేళ్లలో రాష్ట్ర అప్పు ఐదు రెట్లు పెంచారు: ఉత్తమ్

Last Updated : Jul 4, 2024, 5:06 PM IST

ABOUT THE AUTHOR

...view details