ఆంధ్రప్రదేశ్

andhra pradesh

బుడమేరు మూడో గండి పనులు మరి కొన్ని గంటల్లో పూర్తవుతాయి: మంత్రి నిమ్మల రామానాయుడు - Nimmala on Budameru Leakage

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 7, 2024, 8:35 AM IST

Minister Nimmala Ramanaidu About Budameru Leakage Works : బుడమేరుకు పడ్డ గండ్లను పూడ్చే పనులు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయి. ఈ పనులను ఈ రోజు ఉదయానికి పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఉద్ధృతంగా వరద ఉన్నప్పుడే రెండు గండ్లను పూడ్చారు. మూడో గండి పనులు దాదాపు పూర్తి అయినట్లే అని మంత్రి నిమ్మల తెలుపుతున్నారు.

minister_nimmala_ramanaidu_about_budameru_leakage_works
minister_nimmala_ramanaidu_about_budameru_leakage_works (ETV Bharat)

Minister Nimmala Ramanaidu About Budameru Leakage Works :బుడమేరు మూడో గండి పుడ్చివేత 90 శాతం పూర్తి అయ్యిందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. ఇంకో రెండు మూడు గంటల్లో చంద్రబాబు కృషి ఫలించి బుడమేరు గండ్లు పూడ్చివేత పనులు పూర్తి అవుతాయన్నారు. మిగిలిన 10శాతం ఇంకో రెండు గంటల్లో పూర్తి చేసి దిగువ ప్రాంతాలకు వెళ్లే వరద నీటిని అరికడతామని మంత్రి తెలిపారు. ఇవాళ్టి తో బుడమేరు వరద నుంచి విజయవాడ ప్రజలకు విముక్తి కలిగిస్తామని మంత్రి తేల్చిచెప్పారు. విపత్తుతో వేలాది మంది పడుతున్న కష్టంతో పోల్చితే తమకష్టం చాలా తక్కవ అని ఆయన అన్నారు.

బుడమేరుకు భారీగా గండ్లు పడటంతో విజయవాడలోని పలు కాలనీలకు వరద పోటెత్తింది. యుద్ధప్రాతిపదికన బుడమేరు గండ్లు పూడ్చేందుకు ప్రభుత్వ యంత్రాంగం పని చేస్తోంది. సైన్యం కూడా రంగంలోకి దిగింది. గండ్ల వద్ద సమస్య పరిష్కరించేందుకు పలు చర్యలు తీసుకుంటోంది. బుడమేరు గండ్లను గేబియాన్‌ బుట్టల (ఇనుప చువ్వలతో బుట్టలా చేసి దానిని పెద్ద రాళ్లు, ఇసుక బస్తాలతో నింపుతారు) ద్వారా పూడ్చాలని నిర్ణయించినట్లు సైన్యం వెల్లడించింది.

యుద్ధప్రాతిపదికన సాగుతున్న బుడమేరు పనులు - గండ్లు పూడ్చేందుకు శ్రమిస్తున్న సైన్యం - Army Helping in Budameru Works

‘‘బుడమేరుకు గండ్లు పడిన చోట 10 నుంచి 15 మీటర్ల వెడల్పు ఉన్నట్లు గుర్తించాం. మూడో గండి 80 నుంచి 100 మీటర్లు ఉంది. వీటిని గేబియాన్‌ బుట్టలతో పూడ్చుతాం. మొదట గేబియాన్‌ బుట్టలు పేర్చి తర్వాత రాళ్లు వేస్తాం. బుట్టలను పటిష్టం చేసేందుకు 4 మీటర్ల వరకు రక్షితకట్ట నిర్మిస్తాం. గేబియాన్‌ బుట్టల తయారీ స్థానికంగా జరుగుతోంది. ఇసుక సంచులతో నింపి హెస్కో బుట్టలు కూడా వాడతాం. గండ్లను పూడ్చేందుకు ఆర్మీ హెచ్‌ఏడీఆర్‌ బృందం పనిచేస్తోంది’’అని ఆర్మీ అధికారులు తెలిపారు. మరోవైపు జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు దగ్గరుండి బుడమేరు మూడో గండి పూడ్చివేత పనులు పర్యవేక్షిస్తున్నారు. గత నాలుగు రోజులుగా ఇదే గండి ద్వారా 30 నుంచి 40వేల క్యూసెక్కుల వరదనీరు విజయవాడలోని రాయనపాడు, అజిత్‌సింగ్‌నగర్‌ తదితర ప్రాంతాలను ముంచెత్తింది.

బుడమేరుకు చేరుకున్న ఆర్మీ - గండ్లు పూడ్చివేత పనులు వేగవంతం - LEAKAGE WORKS Under Indian Army

ABOUT THE AUTHOR

...view details