ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇంధన సర్దుబాటు ఛార్జీల పాపం జగన్‌దే: మంత్రి గొట్టిపాటి రవికుమార్

క్విడ్‌ ప్రో ద్వారా ప్రజల సొమ్ము తాడేపల్లి ప్యాలెస్‌కు తరలింపు - ప్రజల మీద మరో రూ. 11,826.42 కోట్ల భారం

Gottipati_Ravi_Kumar
Gottipati Ravi Kumar (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : 4 hours ago

Gottipati Ravi Kumar On Electricity Charges: ఇంధన సర్దుబాటు ఛార్జీల (Fuel and Power Purchase Cost Adjustment charges) పాపం జగన్ రెడ్డిదేనని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ధ్వజమెత్తారు. జగన్ హయాంలోనే డిస్కంలు వసూళ్లకు అనుమతి కోరాయన్నారు. దానిని అప్పట్లో వాయిదా వేస్తూ, కమిషన్ ముగిసే మూడు రోజుల ముందుగా వసూళ్లకు ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. జగన్ రెడ్డి చేసిన పాపాలే ప్రజల మెడకు ఉరితాళ్లని దుయ్యబట్టారు. గత ఐదేళ్లలో జగన్ రెడ్డి తీసుకున్న అనాలోచిత నిర్ణయాల కారణంగా ప్రస్తుతం ప్రజల మీద విద్యుత్ ఛార్జీల భారం పడుతోందని వెల్లడించారు.

విద్యుత్ కొనుగోళ్లలో క్విడ్ ప్రోకో విధానం: విద్యుత్ ఉత్పత్తికి మారుపేరు అయిన ఏపీ జెన్​కోని (Andhra Pradesh Power Generation Corporation Limited) నిర్వీర్యం చేసి, ప్రజావసరాల కోసం అనే పేరుతో యథేచ్ఛగా ప్రైవేటు వ్యక్తుల నుంచి అధిక రేట్లకు విద్యుత్ కొనుగోళ్లు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్లలో చేసిన విద్యుత్ కొనుగోళ్లలో జగన్ సర్కార్ ఎక్కడా పారదర్శకత ప్రదర్శించలేదని విమర్శించారు. విద్యుత్ కొనుగోళ్లలో క్విడ్ ప్రోకో విధానం ద్వారా జరిపి, వచ్చిన ప్రజల సొమ్ము అంతా తాడేపల్లి ప్యాలెస్​కి తరలించారని ఆరోపించారు.

ఐదేళ్లలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు: బొగ్గు కొనుగోళ్ల వ్యవహారం అంతా కూడా రహస్యంగానే నడిపించారన్నారు. ఇదంతా చేసింది జగన్ రెడ్డి, పెద్దిరెడ్డిలేనని దుయ్యబట్టారు. జగన్ మోహన్ రెడ్డి బరితెగింపు, దోపిడీ కారణంగా గడిచిన ఐదేళ్లలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ మండిపడ్డారు. జగన్ రెడ్డి చేసిన పాపాల కారణంగా ప్రస్తుతం ఏపీ ప్రజల మీద 2023-24 సంవత్సరానికి మరో 11 వేల 826.42 కోట్ల భారం పడుతోందన్నారు. జగన్ రెడ్డి చేసిన అక్రమ వసూళ్లు చంద్రబాబు హయాంలో కట్టాల్సి వస్తోందని తెలిపారు. కూటమి ప్రభుత్వ సంక్షేమ పాలనను చూసి ఓర్వలేక 'సాక్షి' పత్రిక ద్వారా తప్పుడు కథనాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

ఎనర్జీ స్టోరేజ్ క్యాపిటల్​గా ఏపీని మార్చుతాం: మంత్రి గొట్టిపాటి - Gottipati At RE INVEST 2024

ABOUT THE AUTHOR

...view details