Mine Accident In Ramagundam :పెద్దపల్లి జిల్లా రామగుండం పరిధిలోని లడ్నాపూర్ ఓపెన్కాస్ట్-2లో ప్రమాదం జరగడంతో ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే ఇద్దరు చనిపోగా మరో ఇద్దరు స్వల్పగాయాలతో బయటపడ్డారు. పైప్లైన్ లీకేజీని అరికట్టేందుకు ఒక ఫిట్టర్తో పాటు మరో ముగ్గురు కార్మికులు మరమ్మతులు చేస్తుండగా పక్కనే ఉన్నమట్టి దిబ్బలు కూలినట్లు ప్రత్యక్షసాక్షులు తెలిపారు.
మట్టిదిబ్బలు కూలడంతో అందులో కూరుకుపోయిన ఫిట్టర్ వెంకటేశ్వర్లుతో పాటు జనరల్ మజ్దూర్ విద్యాసాగర్ ఊపిరాడక చనిపోయారు. మరో ఇద్దరు కార్మికుల్లో శ్రీనివాస్ రాజు, సమ్మయ్య స్వల్పగాయాలతో బయట పడ్డారు. మట్టిలో కూరుకుపోయిన ఇద్దరి మృతదేహాలను గోదావరిఖని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతిని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకొని బోరున విలపించారు.