Masked Thieves in Bhadradri Kothagudem : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొతరకం దొంగలు పడుతున్నారు. రాత్రి సమయంలో ఎవరూ తిరగని ప్రదేశాల్లో ముసుగు వేసుకుంటూ చోరీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. వారికి నచ్చిన వస్తువులను తీసుకు వెళ్లి యజమానులను నగదు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రతి చోట సీసీ కెమెరాలు ఉంటున్నాయని తెలుసుకున్న చోరులు ముఖానికి ముసుగులు వేసుకుని మరీ చోరీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా జిల్లాలో ఓ దొంగ చోరీకి ప్రయత్నిస్తున్న సమయంలో సీసీ కెమెరాల్లో చిక్కాడు. దీంతో ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ మారింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారంఇల్లందులోని సుభాశ్ నగర్, జేకే కాలనీల్లో రెండు రోజుల క్రితం ఒక ఇంట్లోకి ప్రవేశించి దొంగతనం చేసే అవకాశం లేకపోవడంతో ఓ దొంగ ఇంటి మీద నుంచి గోడలపై నడుస్తూ తాపీగా గోడ దిగి వెళ్లిన దృశ్యం ఎదురింటి సీసీ కెమెరాల్లో రికార్డయింది. ముసుగు దొంగలు తిరుగుతున్న ఆ వీధుల్లో చాలా మందికి ద్విచక్రవాహనాలు, కార్లు ఉన్నందున వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. వారు పోలీసులకు సమాచారం ఇవ్వగా రికార్డు అయిన దృశ్యాలను పరిశీలించారు. అనంతరం ఆ దొంగని పట్టుకునేందుకు దర్యాప్తు చేపట్టారు.