ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తీవ్ర నిరాశ మిగిల్చిన మామిడి సాగు - ధరలను నియంత్రిస్తూ నిలువు దోపిడీ చేస్తున్న వ్యాపారులు - Mango Farmers problems

Mango Farmers Suffering Huge Losses in Nellore District : ఫలాల్లో రారాజు మామిడి. కానీ ఆ మామిడిని సాగు చేస్తున్న రైతులను మాత్రం కష్టాలు వెంటాడుతున్నాయి. నీటి ఎద్దడి, మంచు, గాలివానల వల్ల ఈసారి దిగుబడి పడిపోయింది. కొన్ని తోటల్లో అసలు కాయనేలేదు. కాయ దిగుబడి తగ్గితే ధరలు పెరగాలి. కానీ వ్యాపారులు ధరలను నియంత్రిస్తుండటంతో నష్టాల భారం రైతులు, కొనుగోలుదారులపై పడుతోంది. నెల్లూరు జిల్లాలో మామిడి రైతుల పరిస్థితిపై ఎలా ఉందో ఈ కథనంలో తెలుసుకుందాం.

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 19, 2024, 5:01 PM IST

Updated : May 19, 2024, 6:58 PM IST

Mango Farmers Suffering Huge Losses in Nellore District
Mango Farmers Suffering Huge Losses in Nellore District (ETV Bharat)

తీవ్ర నిరాశ మిగిల్చిన మామిడి సాగు - ధరలను నియంత్రిస్తూ నిలువు దోపిడీ చేస్తున్న వ్యాపారులు (ETV Bharat)

Mango Farmers Suffering Huge Losses in Nellore District : ఫలాల్లో రారాజైన మామిడిని మధుర ఫలంగా పిలుస్తారు కాయను చూడగానే ధర చూడకుండా కొనేస్తారు. మామిడి తోటలు సాగు చేస్తున్న రైతుకు మాత్రం ఈ ఏడాది చేదును మిగిల్చింది. ప్రకృతిలో మార్పులు కారణంగా కొన్ని తోటల్లో ఈ ఏడాది కాపులేక పోవడంతో దిగుబడులు భారీగా తగ్గిపోయాయి. నెల్లూరు మార్కెట్ లో వ్యాపారులు ధరలను నియంత్రిస్తూ రైతులు, వినియోగదారులను నష్టానికి గురిచేస్తున్నారు.

రూపాయికే కిలో మామిడి పండ్లు.. సాగు రైతుల కష్టాలు.. ఎక్కడంటే?

భారీగా తగ్గిన మామిడి పంట దిగుబడులు :నెల్లూరులోని మామిడి మార్కెట్​లో రోజుకు కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోంది. ఈ ఏడాది మామిడి పంటలో 80శాతం దిగుబడి తగ్గింది. డిసెంబర్, జనవరి మాసాల్లో వచ్చిన ఈదురు గాలులకు పూత, పిందె రాలిపోయింది రైతులు వాపోయారు. ఏప్రిల్‌ నెలకి కొన్నితోటల్లో కాయలు అసలు కాయలేదు. ఎకరాకి కనీసం ఆరు టన్నులకు తగ్గకుండా కాయ దిగుబడి వస్తుంది. కొద్దిపాటి వర్షం కూడా లేకపోవటంతో పది ఎకరాలు సాగు చేసిన రైతుకు ఎకరాకి టన్ను కూడా దిగుబడి రాలేదు. లక్ష రూపాయలు ఖర్చు చేసి తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

ధరలు నియంత్రిస్తూ నిలువు దోపిడీ చేస్తున్న వ్యాపారులు :నెల్లూరులోని మార్కెట్‌కు నాలుగు జిల్లాల నుంచి మామిడి పంట వస్తుంది. చిన్నబజార్, పెద్దబజార్‌లో 60 వరకు దుకాణాలు ఉన్నాయి. సీజన్‌లో రోజుకు 3 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. ఈసారి 80 శాతం మేర మామిడి దిగుబడి పడిపోవడంతో మార్కెట్‌కు రావాల్సిన పంట తగ్గింది. దిగుబడి భారీగా తగ్గినా మామిడి పంటకు ధర మాత్రం పెరగలేదు. మామూలు ధరలకే కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారులు మాత్రం రెట్టింపు ధరలకు అమ్ముకుంటున్నారని చెబుతున్నారు.

"గతేడాది టన్ను మామిడికాయలు 50వేలకు కొనుగోలు చేసిన వ్యాపారులు ఈ ఏడాది టన్ను కాయలను 40వేలకు కొనుగోలు చేస్తున్నారు. పోయిన సంవత్సరానికి కంటే ఉత్పత్తి తగ్గింది. ఉత్పత్తి తగ్గితే ధర పెరుగుతుందనే డిమాండ్ సూత్రం ఇక్కడ వర్తించడంలేదు. రైతులను వ్యాపారులు నిలువు దోపిడీ చేస్తున్నారు. రైతు వద్ద 40వేలకు కొనుగోలు చేసిన వ్యాపారులు బయట 60వేలకి అమ్మి గంట సమయంలోనే 20వేలు లాభం పొందుతున్నారు." - మామిడి రైతులు

రైతుల్లో తీవ్ర నిరాశ మిగిల్చిన మధురఫలం : సాధారణంగా మామిడి తోటలను రైతులు పూతదశలోనే కొనుగోలు చేస్తారు. వారే వ్యాపారులుగా మారి బయట మార్కెట్లో అమ్ముకుంటారు. ఈ విధంగా కొనుగోలు చేసిన పెద్ద రైతులు కూడా ఈ సారి నష్టపోయారు. కొన్ని తోటల్లో కాపు లేకపోవడంతో పూర్తిగా నష్టపోయామని రైతులు తెలిపారు. తోటల్లో దిగుబడులు లేనందున ఈ సారి టన్ను 80 వేల నుంచి లక్ష రూపాయలకు కూడా ధరలు పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు అంటున్నారు. కడప, తిరుపతి, నెల్లూరు ,ప్రకాశం జిల్లాల నుంచి సరుకు నెల్లూరుకు రావడంతో భారీగా వ్యాపారం జరుగుతుందని వ్యాపారస్థులు తెలిపారు.

Mango farmers Problems:నష్టాల్లో మామిడి...కష్టాల్లో రైతులు!

చిన్నబోయిన నున్న మార్కెట్​- డీలా పడిన ఫలరాజం - Mango Yields Fallen Nunna Market

Last Updated : May 19, 2024, 6:58 PM IST

ABOUT THE AUTHOR

...view details