ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 16, 2024, 1:41 PM IST

Updated : Apr 16, 2024, 7:38 PM IST

ETV Bharat / state

నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం - అక్కడికక్కడే ఐదుగురు మృతి - FIVE PEOPLE DIED IN ROAD ACCIDENT

Five People Die in Road Accident Nellore : నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనుకవైపు నుంచి కారు బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

five_people_die_in_road_accident_nellore
five_people_die_in_road_accident_nellore

Five People Died in Road Accident Nellore :నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కావలి మండలం గౌరవరం గ్రామ సమీపంలోని చెన్నై-కలకత్తా జాతీయ రహదారిపై బోగోలు సమీపంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనుకవైపు నుంచి కారు బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు కావలి డివిజన్‌ పరిధిలోని జలదంచి మండలం చామదల గ్రామానికి చెందిన వారిగా భావిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కావలి ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కావలి డీఎస్పీ వెంకటరమణ తెలిపారు.

పండుగ​ వేళ విషాదం- బస్సు లోయలో పడి 17మంది భక్తులు దుర్మరణం- 38మందికి గాయాలు

Road Accident In Nellore District :వివరాల్లోకి వెళ్తే నెల్లూరు జిల్లా జలదంచి మండలం చామాదుల హరిజనవాడకు చెందిన ఓ కుటుంబం విజయవాడ దగ్గరలోని ఇబ్రహీంపట్నంకి కారులో వెళ్తోంది. కావలి మండలం గౌరవరం గ్రామం సమీపం వచ్చే సరికి ఆగి ఉన్న లారీని వెనక వైపు నుంచి వేగంగా వచ్చి బలంగా ఢీకొట్టింది. ఈ క్రమంలో ఐదుగురు (Five persons Died) అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మృతి చెందిన వారిలో దావులూరి శ్రీనివాసులు (50), ఆయన భార్య వరమ్మ (45), కూతురు నీలిమ, వదిన లక్ష్మమ్మ (55), మనుమడు (10) ఉన్నారు. ఈ ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జుగా మారింది. అతి వేగం వ‌ల్లే ఈ ప్ర‌మాదం జ‌రిగింద‌ని పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కావలి డీఎస్పీ తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కావలి ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు.

హైవేపై కారు బీభత్సం- ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి- లైవ్ వీడియో

A Person Suicide in Nellore District : మరో ఘటనలో జిల్లాలోని గుడ్లూరు మండలం గుళ్లపాలెంలో సురేష్ అనే వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గుడ్లూరు వ్యవసాయ మార్కెట్ కమిటీలో విధులు నిర్వహిస్తున్న సురేష్​పై ఎసై లక్ష్మణ్ చేయిచేసుకున్నారు. దాంతో మనస్తాపం చెందిన సురేష్ తనను వేధించటం వల్లే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు లేఖలో పేర్కొన్నాడు. వివరాల్లోకి వెళ్తే, గుడ్లూరు వ్యవసాయ మార్కెట్ కమిటీలో సురేశ్ విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ఇటీవల వచ్చిన బియ్యం లారీల గురించి చెప్పాలని పోలీస్ స్టేషన్​లో నిర్భంధించి ఎసై లక్ష్మణ్ తనపై దాడి చేశాడని సురేశ్ తెలిపారు. దానికి సంబంధించిన సమాచారం తెలియదని ఎంత చెప్పిన వినకుండా వేధింస్తుండటంతో ఆత్మహత్యకు పాల్పడుతున్నాట్లు సురేశ్ లేఖలో పేర్కొన్నారు.

జాతీయ రహదారిపై అదుపు తప్పిన బస్సు- పది మందికి తీవ్ర గాయాలు

Last Updated : Apr 16, 2024, 7:38 PM IST

ABOUT THE AUTHOR

...view details