ఆంధ్రప్రదేశ్

andhra pradesh

శ్రీవారి సుప్రభాత సేవలో మహేశ్​ బాబు ఫ్యామిలీ - స్వామివారిని దర్శించుకున్న వరుణ్​ తేజ్​ దంపతులు - Mahesh Babu Family in Tirumala

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 14, 2024, 10:38 PM IST

Mahesh Babu Family Visit in Tirumala: తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ నటుడు మహేశ్‌ బాబు కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. శ్రీవారి సుప్రభాత సేవలో నమ్రతా, కుమారుడు గౌతమ్, కుమార్తె సితార పాల్గొన్నారు.

Mahesh Babu Family Visit in Tirumala
Mahesh Babu Family Visit in Tirumala (ETV Bharat)

Mahesh Babu Family Visit in Tirumala By Steps Way: తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని సూపర్​ స్టార్ మహేశ్ బాబు కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం శ్రీవారి సుప్రభాత సేవలో నమ్రతా, కుమారుడు గౌతమ్, కుమార్తె సితార పాల్గొన్నారు. శ్రీవారిని దర్శించుకునేందుకు మహేశ్‌ బాబు కుటుంబ సభ్యులు బుధవారం తిరుమలకు చేరుకున్నారు. అలిపిరి నడక మార్గాన మహేశ్‌ సతీమణి నమ్రతా శిరోద్కర్, కుమారుడు గౌతమ్, కుమార్తె సితార తిరుమలకు చేరుకున్నారు.

తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లు కావాలా? ఇలా బుక్​ చేసుకోండి - TTD DARSHAN TICKETS November 2024

Actor Varun Tej and Lavanya Tripathi Visit Tirumala : తిరుమల శ్రీవారిని సినీ నటుడు వరుణ్ తేజ్, సతీమణి లావణ్య త్రిపాఠి బుధవారం ఉదయం దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి స్వామివారి సేవలో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం గర్భాలయంలో స్వామి వారిని దర్శించుకున్న వరుణ్ తేజ్ దంపతులు మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి దర్శనం తర్వాత వరుణ్ తేజ్ దంపతులకు రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

తిరుమల శ్రీవారిని సినీ నటి జాన్వీ కపూర్ మంగళవారం దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు జాన్వీకి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం జాన్వీకి రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ క్రికెటర్‌ గంభీర్ - కోహ్లీ, రోహిత్​ రిటైర్మెంట్​పై ఏమన్నారంటే? - Gautham Gambhir Visit in Tirumala

సర్వదర్శనానికి 18 గంటలు: శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్లు లేని భక్తులకు 18 గంటలు సమయం పడుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. మంగళవారం శ్రీవారిని 73,246 మంది భక్తులు దర్శించుకున్నారు. మంగళవారం శ్రీవారికి 28,133 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. తిరుమలలో మంగళవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.35 కోట్లు వచ్చింది.

మూడు రోజులపాటు పవిత్రోత్సవాలు: శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా మూడు రోజులపాటు పవిత్రోత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు. గురువారం ఉదయం 9 నుంచి 11 గంటల వరకు ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం జరగనుంది. అంకురార్పణ కారణంగా సహస్రదీపాలంకార సేవను రద్దు చేశారు పవిత్రోత్సవాలు ముగిసేవరకు కల్యాణోత్సవం, ఊంజల్‌ సేవ రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. పవిత్రోత్సవాలు ముగిసేవరకు ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలు రద్దు చేసినట్లు వెల్లడించారు.

భక్తుల సౌకర్యాలపై ఫోకస్- తిరుమలలో మార్పులపై భక్తుల ఆనందం - AP Govt Key Changes in Tirumala

ABOUT THE AUTHOR

...view details