ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోస్టల్ ఉద్యోగి ఫేక్ ఫోన్ పే - డబ్బులు పంపినట్లు నమ్మించి కొత్త రకం మోసం - జాగ్రత్త సుమా!

ఫేక్ ఫోన్‌పే ద్వారా ప్రజలను మోసం చేస్తున్న వ్యక్తిని పట్టుకున్న బాధితులు

By ETV Bharat Andhra Pradesh Team

Published : 12 hours ago

Fake Phonepe Fraud in Kurnool
Fake Phonepe Fraud in Kurnool (ETV Bharat)

Fake Phonepe Fraud in Kurnool :మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీతోపాటే మోసాలు కూడా కొత్త పుంతలు తొక్కుతున్నాయి. అమాయకులను బురిడీ కొట్టిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. నమ్మకంగా మాట్లాడుతూ నట్టేట ముంచుతున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, అప్రమత్తంగా ఉన్నా ఏదో ఒక రూపంలో ప్రజలు నిత్యం మోసపోతూనే ఉన్నారు. నిన్నటివరకూ జరిగిన ఆన్​లైన్​ మోసాలు ఒక ఎత్తైతే, సరికొత్త పంథాలో యూపీఐ చెల్లింపులతో జరుగుతున్న దోపీడీలు మరో ఎత్తు.

అతను ఒక ప్రభుత్వ ఉద్యోగి. నెమ్మదిగా ఆన్​లైన్ బెట్టింగ్ వ్యసనాలకు అలవాటు పడ్డాడు. చేతిలో ఉన్న డబ్బంతా బెట్టింగ్​లో పొగొట్టుకున్నాడు. ఇక ఏం చేయాలో తెలియక కొత్త పథకానికి తెరతీశాడు. ఏటీఎంల వద్ద ఉంటూ అక్కడికి వచ్చే వారిని గమనించేవాడు. వారి దగ్గరకి వెళ్లి తనకు డబ్బులు (క్యాష్) అవసరమని ఇస్తే ఫోన్ పే ద్వారా ట్రాన్స్​ఫర్ చేస్తానని నమ్మించేవాడు. ఇది నమ్మిన బాధితులు అతడికి నగదు ఇచ్చేవారు. ఈ క్రమంలోనే నిందితుడు ఫేక్ ఫోన్​పే ద్వారా డబ్బులు పంపించినట్లు మేసేజ్​ చూపించి అక్కడి నుంచి ఉడాయించేవాడు. ఆ తర్వాత బాధితులు తమ ఖాతాల్లోకి సొమ్ము రాకపోడంతో మోసపోయామని గ్రహించారు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది.

నిందితుడు కార్తీక్​ (ETV Bharat)

ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. తాండ్రపాడు గ్రామానికి చెందిన కార్తీక్​ పోస్టల్ శాఖలో ఉద్యోగి. ఆన్‌లైన్‌ వ్యసనాలకు అలవాటుపడి అతను డబ్బుల కోసం మోసాలకు తెరలేపాడు. కర్నూలులోని ఎస్బీఐ మెయిన్‌ బ్రాంచ్ ఏటీఎం వద్ద ఉండి అక్కడి వచ్చే వారిని డబ్బులు అవసరమని నమ్మంచేవాడు. అలా ఫోన్‌ పే ద్వారా వేస్తానని చెప్పి నకిలీ ఫోన్ పే ద్వారా పంపుతూ మోసం చేస్తున్నాడు. కొంతకాలం నుంచి కార్తీక్​ ఇలా చేస్తున్నట్లు సమాచారం.

జాగ్రత్తగా ఉండాలి : బాధితులు కార్తీక్​ని పట్టుకొని కర్నూలు రెండో పట్టణ పోలీసులకు అప్పగించారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అపరిచితులకు డబ్బులు ఇచ్చే విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఎవరైనా ఇలాంటి మోసాలకు పాల్పడితే తమకు సమాచారం ఇవ్వాలని చెప్పారు.

పది వేలు ఎర వేశారు - సాఫ్ట్​వేర్ సొరను ముంచేశారు - IPO షేర్ల పేరిట భారీ మోసం

రాష్ట్రంలో పెరిగిపోతున్న సైబర్ నేరాలు - జాగ్రత్తగా లేకుంటే జేబుకు చిల్లే

ABOUT THE AUTHOR

...view details