తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉపాధి లేక ఉసురు తీసుకుంటున్నా ఆదుకోరా? - సీఎం రేవంత్‌కు కేటీఆర్ లేఖ - KTR LETTER TO CM REVANTH REDDY

KTR On Hand loom Workers Problems: నేతన్నల ఆత్మహత్యలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పందించాలని మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం నేతన్నల ఆత్మహత్యలు పెరిగాయని ఆరోపించారు. గత ఆరు నెలలుగా నేతన్నలు ఉపాధి కోల్పోవడంతో పాటు, పవర్ లూమ్స్ పూర్తిగా బంద్ అయ్యాయని వెల్లడించారు. ఈ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వానికి కేటీఆర్ లేఖ రాశారు.

By ETV Bharat Telangana Team

Published : Jun 24, 2024, 7:46 PM IST

KTR wrote a letter to CM Revanth Reddy
KTR wrote a letter to CM Revanth Reddy (ETV Bharat)

KTR letter to CM Revanth Reddy: నేతన్నలవి ఆత్మహత్యలు కాదని, అవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. నేతన్నల సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ఉపాధి లేక ఉసురు తీసుకుంటున్నా ఆదుకోరా అని ప్రశ్నించారు. ఇప్పటి దాకా పది మంది నేతన్నలు ఆత్మబలిదానం చేసుకున్నారని లేఖలో పేర్కొన్నారు. గత పదేళ్లు చేతినిండా పనులతో కళకళలాడిన చేనేతరంగం, ఇందిరమ్మ రాజ్యం పేరుతో కాంగ్రెస్‌ ప్రభుత్వంలో సంక్షోభంలో కూరుకుపోయిందని ఆక్షేపించారు.

గత కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో వస్త్ర పరిశ్రమ ఎలాంటి దుర్భర పరిస్థితుల్లో మునిగిపోయిందో మళ్లీ ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన ఆర్నెళ్లలోనే అలాంటి విషాదకర పరిస్థితిని ఎదుర్కొంటోందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం గత ప్రభుత్వం చేపట్టిన నేతన్నల సంక్షేమ కార్యక్రమాలను ఆపివేయాలన్న ప్రభుత్వ కక్షపూరిత వైఖరితో వ్యవహరిస్తోందని ఆరోపించారు. నేతన్నలు ఉపాధి కోల్పోవడంతో పాటు, పవర్ లూమ్స్ పూర్తిగా బంద్ అయ్యాయని తెలిపారు. చేనేత కార్మికులు, పవర్ లూమ్ ఆసాములతో పాటు కార్మికులు రోడ్డున పడ్డారన్నారు.

KTR On Hand Loom Workers Problems : కేవలం కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తామన్న దుర్నీతి పాలనతోనే ఈ పరిస్ధితి వచ్చింది. గత ప్రభుత్వం ప్రారంభించిన మంచి పనులపై అక్కసుతో, వాటిని ఆపివేశారు. దానివల్ల నేతన్నలు ఉపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బందులతో వారి జీవితాలు దుర్భరంగా మారాయి. ప్రభుత్వానికి కనీస కనికరం లేదు. ఆకలి బాధ తట్టుకోలేక ఆత్మగౌరవం చంపుకోలేక నేతన్నలు తనువు చాలిస్తున్నారు. సిరిసిల్ల, కరీంనగర్‌తో పాటు టెక్స్ టైల్ శాఖ మంత్రి జిల్లా ఖమ్మంలోనూ ఇద్దరు కార్మికులు ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరం. ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకు ప్రత్యేకంగా 25 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి. అని కేటీఆర్ డిమాండ్ చేశారు.

'చరిత్ర పునరావృతం అవుతుంది' - ఫిరాయింపులపై కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు - KTR React on Leaders Leaving

పదేళ్ల పాటు కళకళలాడిన నేతన్నల జీవితాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చీకట్లు నింపిందన్న కేటీఆర్ ఆ పార్టీ గతంలో అధికారంలో ఉన్న సమయంలో ట్రాక్ రికార్డు చూసినా ఎన్నడూ నేతన్నల కష్టాలు పట్టించుకున్న చరిత్ర లేదని మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో నేతన్నల ఆత్మహత్యలు, ఆకలి చావులు ఆగిపోయాయని పేర్కొన్నారు. సంక్షోభం నుంచి గట్టెక్కిందనుకున్న చేనేత రంగంnో మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే చిమ్మ చీకట్లు అలుముకుంటున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పిన విధంగా పవర్ లూమ్స్, నేత పరికరాలపై 90 శాతం రాయితీ అమలు చేయాలని డిమాండ్ చేశారు.

గతంలో ఉన్న విషాదకర పరిస్థితులను తిరిగి తేవద్దని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేసిన కేటీఆర్, నేతన్నల విషాదకర పరిస్థితిని రాజకీయ కోణంలో కాకుండా మానవత్వంతో పరిష్కరించాలని కోరారు. పరిస్థితి తీవ్రత దృష్ట్యా ముఖ్యమంత్రి వెంటనే సమస్యపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. ఉపాధి లేక దిక్కు తోచని స్థితిలో ఉన్న నేతన్నలు, నేత పరిశ్రలమకు భరోసా కల్పించాలని కోరారు. గత ప్రభుత్వం అమలు చేసిన చేనేత మిత్రా, థ్రిప్ట్, యారన్ సబ్సిడీ, నేతన్న ఫించన్లు, నేతన్న బీమా, విద్యుత్ రాయతీ మొదలైన పథకాలను కొనసాగించాలన్నారు.

రుణమాఫీపై మాట తప్పినా, మడమ తిప్పినా - లక్షలాది రైతు కుటుంబాల తరఫున ఉద్యమిస్తాం : కేటీఆర్​ - KTR TWEET ON Rs 2 lakhs Loan waiver

నాంపల్లి మల్టీలెవల్​ కారు పార్కింగ్​ను కాంగ్రెస్​ పూర్తి చేయడం సంతోషకరం : కేటీఆర్ - KTR Tweet Multi Level Car Parking

ABOUT THE AUTHOR

...view details