తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రంలో 15 మంది ఐపీఎస్​లు బదిలీ - రాచకొండ సీపీగా సుధీర్​ బాబు - ips officers transfer in telangana

Telangana IPS Officers Transfers : 15 మంది ఐపీఎస్​లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బదిలీల్లో శాంతిభద్రతల అదనపు డీజీపీగా మహేశ్​ భగవత్​, రాచకొండ పోలీస్ కమిషనర్‌గా సుధీర్ బాబు, హోంగార్డులు, ఆర్గనైజేషన్​ అదనపు డీజీగా స్వాతి లక్రా, గ్రేహౌండ్స్​ ఏడీజీగా స్టీఫెన్​ రవీంద్ర బదిలీ అయ్యారు.

By ETV Bharat Telangana Team

Published : Jul 10, 2024, 6:51 PM IST

Updated : Jul 10, 2024, 10:08 PM IST

Telangana IPS Officers Transfers
Telangana IPS Officers Transfers (ETV Bharat)

IPS Transfers in Telangana : రాష్ట్రంలో భారీగా ఐపీఎస్​ల బదిలీ జరిగింది. ఈ క్రమంలో 15 మంది ఐపీఎస్​లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బదిలీల్లో శాంతిభద్రతల అదనపు డీజీపీగా మహేశ్​ భగవత్​, రాచకొండ పోలీస్ కమిషనర్‌గా సుధీర్ బాబు, హోంగార్డులు, ఆర్గనైజేషన్​ అదనపు డీజీగా స్వాతి లక్రా, గ్రేహౌండ్స్​ ఏడీజీగా స్టీఫెన్​ రవీంద్ర బదిలీ అయ్యారు.

ప్రస్తుతం రైల్వే డీజీగా ఉన్న మహేశ్​ భగవత్​ను లా అండ్​ ఆర్డర్​ అదనపు డీజీగా నియమించింది. పోలీస్​ ఆర్గనైజేషన్​ అండ్​ హోంగార్డ్స్​ డీజీగా స్వాతి లక్రా బదిలీ అయ్యారు. పోలీస్​ పర్సనల్​ అదనపు డీజీగా విజయ్​ కుమార్​ను ప్రభుత్వం నియమించింది. అలాగే ఆయనకు అదనపు బాధ్యతలుగా పోలీసు సంక్షేమం, క్రీడల ఏడీజీగా నియమించారు. గ్రేహౌండ్స్​ అండ్​ ఆక్టోపస్​ అదనపు డీజీగా స్టీఫెన్​ రవీంద్ర, తెలంగాణ స్పెషల్​ పోలీసు బెటాలియన్​ అదనపు డీజీగా సంజయ్​కుమార్​ జైన్​, రాచకొండ సీపీగా సుధీర్​ బాబును నియమించింది.

ప్రస్తుతం రాచకొండ సీపీగా ఉన్న తరుణ్​ జోషీని ఏసీబీ డైరెక్టర్​గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మల్టీజోన్​ 1 ఐజీగా ఎస్​ చంద్రశేఖర్​, రైల్వే ఐజీగా కె.రమేశ్​ నాయుడు, మల్టీజోన్​ 2 ఐజీగా వి.సత్యనారాయణ, హైదరాబాద్​ సీఏఆర్​ హెడ్​ క్వార్టర్స్​ డీసీపీగా రక్షితా మూర్తి, మెదక్​ ఎస్పీగా ఉదయ్​కుమార్​ రెడ్డి, వనపర్తి ఎస్పీగా గిరిధర్​, హైదరాబాద్​ తూర్పు మండల డీసీపీగా బాలస్వామిని నియమించింది. నైరుతి మండల డీసీపీగా చంద్రమోహన్​ను నియమిస్తూ సీఎస్​ ఉత్తర్వులు జారీ చేశారు.

రాష్ట్రంలో 15 మంది ఐపీఎస్‌లు బదిలీలు :

  • శాంతిభద్రతల అదనపు డీజీపీగా మహేష్ భగవత్
  • హోంగార్డులు, ఆర్గనైజేషన్ అదనపు డీజీగా స్వాతి లక్రా
  • గ్రేహౌండ్స్‌ ఏడీజీగా స్టీఫెన్‌ రవీంద్ర
  • పోలీస్ పర్సనల్ అదనపు డీజీగా విజయ్ కుమార్
  • పోలీసు సంక్షేమం, క్రీడల అదనపు డీజీగా విజయ్ కుమార్‌కు అదనపు బాధ్యతలు
  • టీజీఎస్పీ బెటాలియన్ల అదనపు డీజీగా సంజయ్ కుమార్ జైన్
  • రాచకొండ పోలీస్ కమిషనర్‌గా సుధీర్ బాబు
  • ఏసీబీ డైరెక్టర్‌గా తరుణ్ జోషి
  • మల్టీజోన్ 1 ఐజీగా ఎస్.చంద్రశేఖర్ రెడ్డి
  • రైల్వే, రోడ్ సేఫ్టీ ఐజీగా కె.రమేష్ నాయుడు
  • మెదక్ ఎస్పీగా ఉదయ్ కుమార్ రెడ్డి
  • వనపర్తి ఎస్పీగా ఆర్.గిరిధర్
  • హైదరాబాద్ తూర్పు మండలం డీసీపీగా బి.బాలస్వామి
  • హైదరాబాద్ పశ్చిమ మండలం డీసీపీగా జి.చంద్రమోహన్
  • సీఏఆర్‌హెడ్ క్వాటర్స్ డీసీపీగా రక్షితమూర్తి

తెలంగాణ డీజీపీగా జితేందర్ నియామకం - ప్రభుత్వం ఉత్తర్వులు జారీ - Telangana New DGP Jitender

రాష్ట్రంలో 28 మంది ఐపీఎస్‌ అధికారుల బదిలీలు - IPS Officers Transfers in Telangana

Last Updated : Jul 10, 2024, 10:08 PM IST

ABOUT THE AUTHOR

...view details