IIT Madras Summer Fellowship 2025 :దేశంలోనే ప్రముఖ విద్యాసంస్థగా ప్రఖ్యాతిగాంచిన ఐఐటీ-మద్రాస్ విద్యార్థులకు సువర్ణావకాశాన్ని అందిస్తోంది. వేసవిలో తమ నైపుణ్యాలను పెంచుకొనే అవకాశాల కోసం ఎదురుచూసే విద్యార్థుల కోసం సమ్మర్ ఫెలోషిప్ ప్రోగ్రామ్ను అమలు చేస్తోంది. ఇందుకోసం ఆసక్తి గల విద్యార్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. 2 నెలల పాటు కొనసాగే ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్కు ఆసక్తి కలిగిన విద్యార్థులు ఫిబ్రవరి 28 సాయంత్రం 5గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతం ఐఐటీల్లో చదువుతున్న విద్యార్థులు మాత్రం ఈ ఫెలోషిప్ ప్రోగ్రామ్కు అనర్హులు. ఈ ఫెలోషిప్నకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
పెలోషిప్ ముఖ్య ఉద్దేశం : ఇంజినీరింగ్, మేనేజ్మెంట్, సైన్సెస్, హ్యుమానిటీస్ విభాగాల విద్యార్థుల్లో ఉన్నత నాణ్యతతో కూడిన అకడెమిక్ రీసెర్చ్పై అవగాహన కల్పించడం, తద్వారా ఆసక్తిని పెంపొందించడం.
బీఈ/బీటెక్/బీఎస్సీ (ఇంజినీరింగ్) మూడో సంవత్సరం లేదా ఇంటిగ్రేటెడ్ ఎంఈ/ఎంటెక్/ఎమ్మెస్సీ ప్రోగ్రామ్లలో మూడు/ నాలుగో ఏడాది చదువుతున్నవారితో పాటు మంచి అకడమిక్ రికార్డు కలిగిన ఎమ్మెస్సీ/ఎంఏ/ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నవారు కూడా ఈ ఫెలోషిప్నకు దరఖాస్తు చేసుకొనే అవకాశం కల్పిస్తోంది.
ఇంటర్న్షిప్ వ్యవధి : 2 నెలలు. ఇంటర్న్షిప్ మే 19 నుంచి మొదలై జులై 18వరకు కొనసాగే అవకాశం ఉంది.
స్టైఫండ్ : నెలకు 15వేల రూపాయల చొప్పున ఇస్తారు.