తెలంగాణ

telangana

వరస సెలవుల ఎఫెక్ట్ - ఖైరతాబాద్‌కు పోటెత్తిన భక్తులు - మెట్రోకు ఫుల్​ డిమాండ్ - Heavy Public At Khairatabad Ganesh

By ETV Bharat Telangana Team

Published : Sep 14, 2024, 1:51 PM IST

Updated : Sep 14, 2024, 1:57 PM IST

Huge Devotees at Khairatabad Ganesh : వరుసగా రెండు రోజులు సెలవు దినాలు కావడంతో ఖైరతాబాద్ గణేశ్ దర్శనానికి భక్తులు పోటెత్తారు. దీంతో ఖైరతాబాద్‌ మెట్రో స్టేషన్‌ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కమిటీ సభ్యులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Heavy Public At Khairatabad Ganesh Idol
Heavy Public At Khairatabad Ganesh Idol (ETV Bharat)

Heavy Public At Khairatabad Ganesh Idol :ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. ఖైరతాబాద్ గణేశుడి దర్శనం కోసం ఇటు ఎల్బీనగర్ వైపు నుంచి అటు మియాపూర్ నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుండటంతో మెట్రో స్టేషన్ పరిసరాలు సందడిగా మారాయి. వరుసగా రెండు రోజులు సెలవులు రావడంతో ఖైరతాబాద్ గణేశుడికి భక్తుల తాకిడి పెరిగింది. దీంతో మెట్రో రైలు యాజమాన్యం భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చూసుకుంటోంది.

ఖైరతాబాద్ వినాయకుడును చూడటానికి తెలంగాణ చుట్టు పక్కల రాష్ట్రాల వారు కూడా వస్తుంటారు. రెండు రోజులు సెలవులు దీంతో తెలంగాణనే కాకుండా ఇతర రాష్ట్రాల వారు కూడా గణేశుడి దర్శనం కోసం వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. అది కాకుండా నిమజ్జనానికి మూడు రోజుల సమయం ఉన్నందుకు రద్దీ పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.

టికెట్ కౌంటర్ల వద్ద, ఎగ్జిట్ గేట్ల వద్ద రద్దీ పెరగకుండా సూచనలు చేస్తోంది. క్యూఆర్ కోడ్ టికెట్లకు, కార్డ్ ద్వారా వెళ్లే ప్రయాణికులను వేరువేరుగా పంపిస్తోంది. స్టేషన్ లోపల ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ ద్వారా ముందస్తుగానే టికెట్లు బుక్ చేసుకోవాలని, కార్డులో సరిపడా డబ్బులు లేకపోతే ఎంట్రీ స్టేషన్‌లో రీఛార్జ్ చేసుకోవాలని సిబ్బంది సూచిస్తున్నారు.

ఖైరతాబాద్‌ గణేశుడికి భారీ ఎత్తున రుద్రహోమం - 280 జంటలతో ప్రత్యేక పూజ - Khairatabad Ganesh Pooja

గంట గంటకు పెరుగుతున్న రద్దీ :ఖైరతాబాద్ మెట్రో స్టేషన్‌లో ఉదయం నుంచి గంట గంటకు రద్దీ పెరుగుతుండటంతో మెట్రో యాజమాన్యం అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. టికెట్ కౌంటర్లు, ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లతోపాటు ఫ్లాట్ ఫాం వద్ద కూడా భద్రతా సిబ్బంది ప్రయాణికులకు తగిన సూచనలు చేస్తున్నారు.

సెప్టెంబరు 17న సెలవు :హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు ఈ నెల 17న ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఇందుకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. సెప్టెంబరు 17వ తేదీకి బదులుగా నవంబర్‌ 9(రెండో శనివారం)న పనిదినంగా ప్రభుత్వం తెలిపింది. ఈ నెల 7న మొదలైన వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు 17తో ముగియనున్నాయి.

ఈ ఏడాది ఖైరతాబాద్​ మహాగణపతి ఎత్తు ఎంతో తెలుసా? - KHAIRTABAD GANESH HEIGHT IN 2024

సో బ్యూటిఫుల్‌ - కనువిందు చేస్తున్న ఖైరతాబాద్ గణేశ్ డ్రోన్ విజువల్స్ - Khairatabad Ganesh Drone Visuals

Last Updated : Sep 14, 2024, 1:57 PM IST

ABOUT THE AUTHOR

...view details