Ganganamma Decorated with Currency of RS.2.30 Crores in Eluru District :రాష్ట్రంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో కొలువైన శ్రీ గంగానమ్మ అమ్మవారు రూ.2.30 కోట్ల విలువైన కరెన్సీ నోట్లతో అలంకరించారు. ఆరో రోజు శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. కోరిన కోర్కెలు తీర్చే చల్లని తల్లిగా గంగానమ్మ విగ్రహం చుట్టూ నోట్ల కట్టలు, కాయిన్స్ ఉంచారు. ఈ నేపథ్యంలో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఉదయం నుంచి భారీగా తరలివస్తున్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
"రూ.2.3కోట్ల కట్టలు, నాణేల కుప్పలు" - భారీగా తరలివచ్చిన భక్తులు
జంగారెడ్డిగూడెం గంగానమ్మ అమ్మవారికి కరెన్సీ నోట్లతో అలంకరణ
By ETV Bharat Andhra Pradesh Team
Published : 7 hours ago
GANGANAMMA_DECORATED_WITH_CURRENCY (ETV Bharat)