ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వైఎస్సార్సీపీ ఇసుక దోపిడీకి వెంకటరెడ్డి సహకారం - జేపీ పవర్‌ వెంచర్స్‌కు 6 నెలల గడువు పొడిగింపు - JP Company Sand Mining Deadline

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 12, 2024, 7:20 AM IST

Sand Mining Deadline Extended for JP Company: ఇసుక తవ్వకాలు, విక్రయాల విషయంలో గనుల శాఖ పూర్వ సంచాలకుడు వెంకటరెడ్డి అక్రమాలు బయటపడ్డాయి. ప్రభుత్వంతో సంబంధం లేకుండా వెంకటరెడ్డే జేపీ సంస్థకు ఇసుక తవ్వకాల గడువు పెంచినట్లు తేలింది. గనుల శాఖ అధికారుల ఇసుక దస్త్రాల పరిశీలనలో వెంకటరెడ్డి గుట్టురట్టయింది.

Sand Mining Deadline Extended for JP Company
Sand Mining Deadline Extended for JP Company (ETV Bharat)

Sand Mining Deadline Extended for JP Company : రాష్ట్రంలో మొన్నటి వరకు సాగిన ఇసుక దందాలో గనుల శాఖ పూర్వ సంచాలకుడు వెంకటరెడ్డే కీలక పాత్ర పోషించారు. వైఎస్సార్సీపీ ముఖ్య నేతల ఆధ్వర్యంలో సాగిన వేల కోట్ల దోపిడీకి సహకరించారు. ఇసుక గుత్తేదారుగా జయ్‌ ప్రకాష్‌ పవర్‌ వెంచర్స్‌కు ఉన్న రెండేళ్ల గడువును, మరో ఆరు నెలలు పొడిగించి దీనికి ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయంటూ మొండిగా వాదిస్తూ వచ్చారు. అయితే ప్రభుత్వానికి దస్త్రాన్ని పంపకుండా, వెంకటరెడ్డే గడువు పెంచేసినట్లు తాజాగా వెలుగు చూసింది.

వారేమైనా మా చుట్టాలా? :రాష్ట్రమంతటా ఇసుక తవ్వకాలు, విక్రయాలకు టెండరు దక్కించుకున్న జేపీ సంస్థ 2021 మే నుంచి 2023 మే వరకు వ్యాపారం చేసేలా ఒప్పందం చేసుకుంది. 2023 మే రెండోవారంతో గడువు ముగిసింది. అయితే తర్వాత కూడా జేపీ సంస్థ పేరిట ఇసుక తవ్వకాలు, విక్రయాలు కొనసాగాయి. దీనిపై గనుల శాఖ అప్పటి డైరెక్టర్‌ వెంకటరెడ్డిని ప్రశ్నిస్తే ఆ సంస్థకు ప్రభుత్వం గడువు పెంచిందని అన్నారు.

JP Company Not Paid Sand Arrears to APMDC: జేపీ సంస్థపై వైసీపీ సర్కారు ప్రేమ.. రూ.120 కోట్ల బకాయిపై నోరెత్తని వైనం

మరో ఏడాది గానీ, మళ్లీ టెండర్లు నిర్వహించే వరకు గానీ ఆ సంస్థే కొనసాగేలా ఉత్తర్వులొచ్చాయని తెలిపారు. ఆదేశాల కాపీ ఇవ్వాలని ఎవరడిగినా దాటవేశారు. గత ఏడాది ఆగస్టు 31న అప్పటి గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, డైరెక్టర్‌ వెంకటరెడ్డి సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలోనూ ఇలాగే వాదించారు. గడువు పొడిగింపు ఆదేశాలున్నాయని వెంకటరెడ్డి చెప్పారు. జేపీ సంస్థకి పొడిగింపు ఇవ్వకుండా నడిపించడానికి వారేమైనా మా చుట్టాలా? అని పెద్దిరెడ్డి తిరిగి ప్రశ్నించారు.

ఇసుకలో భారీగా దోపిడీ :తాజాగా గనుల శాఖ అధికారులు ఇసుక వ్యవహారాల దస్త్రాలు పరిశీలించారు. జేపీ సంస్థకి గడువు పొడిగించేలా అనుమతి ఇవ్వాలంటూ ప్రభుత్వానికి దస్త్రమే పంపలేదని వెంకటరెడ్డే ఆదేశాలిచ్చినట్లు తేలింది. గడువు పొడిగించాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా ఉండాలి. దీన్ని పట్టించుకోకుండా గడువు పెంచుతూ వెంకటరెడ్డి ఇచ్చిన ఆదేశాల కాపీ బయటపడింది.

ఇసుక పంపిణీలో అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటాం: మంత్రి కొల్లు రవీంద్ర - Free Sand Distribution

ఇటీవల జేపీ సంస్థ నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్, బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లకు అందించిన ఆడిట్‌ రిపోర్ట్‌లోనూ 6 నెలలు ఇసుక వ్యాపారం కొనసాగించాలని గనుల శాఖ డైరెక్టర్‌ వెంకటరెడ్డి ఆదేశాలిచ్చారని స్పష్టంగా పేర్కొంది. ఆ 6 నెలల్లోనే వైఎస్సార్సీపీ ముఖ్య నేతలు ఇసుకలో భారీగా దోపిడీకి పాల్పడ్డారు.

'ఏపీ ఇసుక ఫైల్స్' తవ్విన కొద్దీ అక్రమాలు - ఆ ఒక్క సంతకంతో రూ.800 కోట్లు - AP Sand Files

ABOUT THE AUTHOR

...view details