ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మునేరు ఉద్ధృతిని పరిశీలించిన నందిగామ ఆర్డీఓ- జలదిగ్బంధంలో నందిగామ - Floods Increasing in Munneru River - FLOODS INCREASING IN MUNNERU RIVER

Flood Water Increasing in Munneru River : భారీ వర్షాలతో ఎన్టీఆర్​ జిల్లా నందిగామ పట్టణం చుట్టూ వరద పోటెత్తింది. నందిగామ- మధిర రోడ్డుపై మునేరు ప్రవాహంతో రాకపోకలు నిలిచిపోయాయి. అదే విధంగా హైదరాబాద్‌ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలు ఆగిపోవటంతో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.

flood_water_increasing_in_munneru_river
flood_water_increasing_in_munneru_river (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 2, 2024, 1:36 PM IST

Flood Water Increasing in Munneru River :ఐతవరం గ్రామం వద్ద మునేరు వరద ఉద్ధృతిని నందిగామ ఆర్డీవో రవీందర్ రావు పరిశీలించారు. విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై మున్నేరు వరద ప్రవహిస్తుండటంతో వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి. మునేరు కొద్దిగా వరద తగ్గినప్పటికీ జాతీయ రహదారిపై ప్రవహిస్తుంది. దీంతో వాహనాలు రాకపోకలను పూర్తిగా నిషేధించారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా మునేరు ఉగ్రరూపం దాల్చింది. దీంతో ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ మండలం ఐతవరం వద్ద విజయవాడ హైదరాబాద్‌ జాతీయ రహదారిపై వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి వాహనాల రాకపోకలకు ఆగిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలంగాణ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు మునేరుకు భారీగా వరద వస్తుంది. వాహనాల రాకపోకలు నిలిపివేయడంతో కీసర టోల్ గేట్ వద్ద ప్రయాణీకుల అవస్థలు పడుతున్నారు. ప్రయాణికులకు పరిటాల రాము ఆధ్వర్యంలో భోజనాలు ఏర్పాటు చేశారు.

భారీ వర్షాలతో ఎన్టీఆర్​ జిల్లా నందిగామ పట్టణం చుట్టూ వరద పోటెత్తింది. మునేరుకు పెద్దఎత్తున వరద చేరటంతో మార్కెట్ యార్డ్ ఆవరణలో మూడు అడుగులకుపైగా నీరు చేరింది. రెండు 108వాహనాలు వరదలో చిక్కుకుపోయాయి. వ్యవసాయశాఖ ఏడీ కార్యాలయంలో నీరు నిలిచిపోయింది. నందిగామ- మధిర రోడ్డుపై మునేరు ప్రవాహంతో రాకపోకలు నిలిచిపోయాయి.

Munneru Floods Effect in Nandigama: మునేరు ఉద్ధృతి.. కొట్టుకుపోయిన రోడ్లు.. జనాల అవస్థలు

దీనికి అదనంగా నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాలో గత మూడురోజులుగా కురిసిన వర్షాలకు తెగిన చెరువులు వరదలు మునేరుకు చేరుతున్నాయి. ఉదయం పది గంటలకు పోలంపల్లి డ్యాం వద్ద 1,67,841, ఒంటి గంటకు 2.40, సాయంత్రం 5 గంటలకు 3 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వస్తుంది. మరో 50 వేల క్యూసెక్కుల నీరు చేరే అవకాశం ఉందని పీడబ్ల్యూడీ అధికారులు తెలిపారు. విజయవాడ నుంచి హైదరబాద్‌ వైపు వెళ్తున్న 15 వాహనాలు ఐతవరం వద్ద వరదలో చిక్కుకున్నాయి. అదే విధంగా హైదరాబాద్‌ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలు ఆగిపోవటంతో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. వరద తీవ్రత నేపథ్యంలో పోలీసులు విజయవాడ వైపు చిల్లకల్లు, హైదరబాద్‌ వైపు కీసర టోల్‌ప్లాజా వద్ద వాహనాలను నిలిపివేశారు.

Vehicles Allowed on NH-65: తగ్గిన మునేరు వరద ఉద్ధృతి.. విజయవాడ-హైదరాబాద్​ మార్గంలో రాకపోకలు పునరుద్ధరణ

ABOUT THE AUTHOR

...view details