తెలంగాణ

telangana

రాజకీయ కక్షతో రైతులను ప్రభుత్వం ఆగం చేస్తోంది : నిరంజన్‌రెడ్డి - BRS niranjan reddy slams congress

By ETV Bharat Telangana Team

Published : Aug 9, 2024, 3:17 PM IST

Updated : Aug 9, 2024, 5:23 PM IST

BRS Niranjan reddy fires Congress : పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోందని మాజీమంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి అవగాహన, చిత్తశుద్ది లేక కృష్ణనదిలో దిగువకు వెళ్తున్న నీటిని ఒడిసి పట్టుకోవడం లేదని ఆయన మండిపడ్డారు. పాలమూరు బిడ్డ అని పదేపదే చెప్పే సీఎం రేవంత్‌రెడ్డి, ఇక్కడి రైతులు కష్టాలు పడుతుంటే అమెరికాలో మిస్సిసీపీ అందాలు చూస్తూ కూర్చుంటారా? అని మండిపడ్డారు.

Niranjan reddy on Palamuru Lift Irrigation Project
BRS Niranjan reddy fires Congress (ETV Bharat)

Niranjan reddy on Krishna Water :ఓ వైపు పాలమూరు రైతాంగం నీటి కోసం ఎదురు చూస్తుంటే, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం అవగాహన, చిత్తశుద్ధి లేక బంగారం లాంటి కృష్ణా జలాలను బంగాళాఖాతంలోకి వదిలిపెడుతున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత సింగిరెడ్డి నిరంజన రెడ్డి అన్నారు. కృష్ణా జలాలు సగటున రోజుకు 30 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని ఆయన తెలిపారు.

ప్రాజెక్టు సిద్ధం : పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల వ్యవస్థ పూర్తిగా సిద్ధమైందని నిరంజన్‌రెడ్డి తెలిపారు. నార్లాపూర్ నుంచి ఏదుల మీదుగా వట్టెం వరకు 27 టీఎంసీల వరకు నీరు ఒడిసిపట్టే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. కానీ, ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించకుండా కేసీఆర్ చేసిన ప్రాజెక్టు అని నీరు ఇవ్వడం లేదని ఆరోపించారు. కేసీఆర్‌కు చిత్తశుద్ది ఉంది కాబట్టే పెండింగ్ ప్రాజెక్టులు, పాలమూరు- రంగారెడ్డి పనులను వేగవంతం చేశారని తెలిపారు.

రాజకీయ కక్ష : కరివెన నుంచి నీరు ముందుకు పోయేలా కాల్వల కోసం టెండర్లు పిలిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిందని నిరంజన్ రెడ్డి ఆక్షేపించారు. కల్వకుర్తి పంపులు కూడా ఉపయోగించి నార్లాపూర్‌లో ఏడు టీఎంసీల నీరు నింపితే మంచినీటికి కూడా ఇబ్బంది ఉండదని ఆయన అన్నారు. నీటిపారుదలశాఖ మంత్రి, స్థానిక మంత్రి ఒక్కరోజు కూడా ప్రాజెక్టు వద్దకు వెళ్లి పనులు పర్యవేక్షించలేదన్న ఆయన, రాజకీయ కక్షతో రైతులను ప్రభుత్వం ఆగం చేస్తోందని అన్నారు.

దక్షిణ తెలంగాణపై ఉన్న ప్రేమ ఇదేనా : పాలమూరు ప్రాజెక్టులో ఎనిమిది నెలల నుంచి తట్టెడు మట్టి కూడా తీయలేదని నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. దక్షిణ తెలంగాణపై ఉన్న ప్రేమ ఇదేనా అని ఆయన ప్రశ్నించారు. పాలమూరు బిడ్డ అని పదేపదే చెప్పే సీఎం, ఇక్కడ రైతులు కడగండ్లు పడుతుంటే అమెరికాలో మిస్సిసిపీ అందాలు చూస్తూ కూర్చుంటారా అని నిరంజన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. రాజకీయ దురుద్దేశాన్ని విడనాడి తక్షణమే నీటిని సద్వినియోగం చేసుకోవాలని, పుష్కలంగా నీరు ఉండి కూడా రైతులను నీటి కోసం ఇబ్బంది పెట్టవద్దని కోరారు.

"ఓ వైపు పాలమూరు రైతాంగం నీటి కోసం ఎదురు చూస్తుంటే, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం అవగాహన, చిత్తశుద్ధి లేక బంగారం లాంటి కృష్ణా జలాలను బంగాళాఖాతంలోకి వదిలిపెడుతోంది. కృష్ణా జలాలు సగటున రోజుకు 30 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయి. రాజకీయ దురుద్దేశాన్ని విడనాడి తక్షణమే కృష్ణనది నీటిని సద్వినియోగం చేసుకోవాలి" - నిరంజన్‌రెడ్డి, మాజీమంత్రి

రుణమాఫీ విషయంలో ప్రభుత్వం రైతులను వంచిస్తోంది : నిరంజన్​ రెడ్డి

రేషన్‌కార్డు నిబంధన లక్షలాది రైతుల ఆశలపై నీళ్లు చల్లడమే : హరీశ్‌రావు - BRS Party ON LOAN WAIVER

Last Updated : Aug 9, 2024, 5:23 PM IST

ABOUT THE AUTHOR

...view details