తెలంగాణ

telangana

By ETV Bharat Telangana Team

Published : Mar 5, 2024, 3:51 PM IST

Updated : Mar 5, 2024, 10:48 PM IST

ETV Bharat / state

'తన హోదాను అడ్డుపెట్టుకొనే ఇలా విరుద్ధంగా చేశారు' - కాల్​ ట్యాపింగ్​ కేసులో నిజాలు

DSP Praneet Kumar Suspension in Call Tapping Case : కాల్​ ట్యాపింగ్​ వ్యవహారంలో సస్పెండ్​ అయిన ఎస్​ఐబీ డీఎస్పీ ప్రణీత్​ కుమార్​ సస్పెన్షన్​ కాపీలో కీలక విషయాలు ఉన్నాయి. గతంలో హైదరాబాద్​ ఎస్​ఐబీలో పని చేస్తున్న సమయంలో తన హోదాను అడ్డం పెట్టుకుని నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని పేర్కొన్నారు.

Call Tapping Case
DSP Praneet Kumar Suspension in Call Tapping Case

DSP Praneet Kumar Suspension in Call Tapping Case :కాల్​ ట్యాపింగ్​(Cal Tapping Case) వ్యవహారంలో సస్పెండ్​ అయిన ఎస్​ఐబీ డీఎస్పీ ప్రణీత్​ కుమార్​ సస్పెన్షన్​ ఆర్డర్​లో కీలక విషయాలు పేర్కొన్నారు. ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లా క్రైమ్​ రికార్డ్స్​ బ్యూరో డీఎస్పీగా పని చేస్తున్న ప్రణీత్​ గతంలో హైదరాబాద్​ ఎస్​ఐబీలో పని చేస్తున్న సమయంలో తన హోదాను అడ్డం పెట్టుకుని నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు గుర్తించారు.

తన ఎస్​ఓటీ బృందం కోసం హైదరాబాద్​ ఎస్​ఐబీ కార్యాలయంలో ప్రత్యేక ఇంటర్నెట్​ సదుపాయాన్ని ప్రణీత్​ ఏర్పాటు చేసుకున్నట్లు సస్పెన్షన్​ ఆర్డర్​లో ఉన్నాయి. ఈ తతంగమంతా తానే నడిపినట్లు అధికారులు తేల్చారు. కంప్యూటర్​లోని 42 హార్ట్​ డిస్క్​లు సైతం మార్చినట్లు గుర్తించారు. పలువురి ఫోన్​ ట్యాపింగ్​కు సంబంధించిన కాల్​ డీటైల్​ రికార్డ్స్​, ఐఎంఈఐ, ఇంటర్నెట్​ ప్రోటోకాల్​ రికార్డులను ప్రవీణ్​ డిలీట్​ చేశారు. ఎలక్ట్రీషియన్​ సాయంతో ఎస్​ఐబీ భవనంలో సీసీ కెమెరాలు(CC Camera) ఆఫ్​ చేయించి హార్ట్​ డిస్కులు ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు. కాగా విచారణ పూర్తయ్యే వరకూ అనుమతి లేకుండా డీఎస్పీ ప్రణీత్​ హెడ్​ క్వార్టర్స్​ను వీడకూడదని సస్పెన్షన్​ ఆర్డర్​లో పేర్కొన్నారు.

అన్ కాన్షియస్ అవుతున్నానంటూ అంబులెన్స్​కి కాల్ - వచ్చిచూసేసరికి సిబ్బందికి షాక్

Call Tapping Case Update :ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల ఫోన్ల ట్యాపింగ్​ విషయంలో సస్పెండ్​ అయిన ఎస్​ఐబీ డీఎస్పీ ప్రణీత్​ కుమార్​ గురించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేసీఆర్​ ప్రభుత్వం హయాంలో కీలక నేతల ఫోన్లు ట్యాప్​ చేసినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు రాగా, కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్​ ప్రభుత్వం ఆయన వైఖరిపై విచారణ చేపట్టింది. ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల ఫోన్ల ట్యాపింగ్​ విషయంలో సస్పెండ్​ అయిన ఎస్​ఐబీ డీఎస్పీ ప్రణీత్​ కుమార్​ గురించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

సస్పెండ్​ చేసిన డీజీపీ : కేసీఆర్​ ప్రభుత్వం హయాంలో కీలక నేతల ఫోన్లు ట్యాప్​ చేసినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు రాగా, కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్​ ప్రభుత్వం ఆయన వైఖరిపై విచారణ చేపట్టింది. కాగా సోమవారం డీఎస్పీ దుగ్యాల ప్రణీత్​రావును సస్పెండ్​ చేస్తూ డీజీపీ రవిగుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. కొన్ని రోజుల క్రితం డీజీపీ కార్యాలయానికి ఆయనను ప్రభుత్వం అటాచ్​ చేసింది.

Hyderabad SI Rajendra Drugs Case Update : డ్రగ్స్ కేసు అప్డేట్.. SI రాజేంద్ర కాల్​డేటాలో అసలుగుట్టు

లేడీ డాక్టర్​ను పొడిచి చంపిన రోగి.. ట్రీట్​మెంట్​ చేస్తుండగానే..

Last Updated : Mar 5, 2024, 10:48 PM IST

ABOUT THE AUTHOR

...view details