తెలంగాణ

telangana

ETV Bharat / state

'తన హోదాను అడ్డుపెట్టుకొనే ఇలా విరుద్ధంగా చేశారు' - కాల్​ ట్యాపింగ్​ కేసులో నిజాలు - dsp Praneet Suspension copy

DSP Praneet Kumar Suspension in Call Tapping Case : కాల్​ ట్యాపింగ్​ వ్యవహారంలో సస్పెండ్​ అయిన ఎస్​ఐబీ డీఎస్పీ ప్రణీత్​ కుమార్​ సస్పెన్షన్​ కాపీలో కీలక విషయాలు ఉన్నాయి. గతంలో హైదరాబాద్​ ఎస్​ఐబీలో పని చేస్తున్న సమయంలో తన హోదాను అడ్డం పెట్టుకుని నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని పేర్కొన్నారు.

Call Tapping Case
DSP Praneet Kumar Suspension in Call Tapping Case

By ETV Bharat Telangana Team

Published : Mar 5, 2024, 3:51 PM IST

Updated : Mar 5, 2024, 10:48 PM IST

DSP Praneet Kumar Suspension in Call Tapping Case :కాల్​ ట్యాపింగ్​(Cal Tapping Case) వ్యవహారంలో సస్పెండ్​ అయిన ఎస్​ఐబీ డీఎస్పీ ప్రణీత్​ కుమార్​ సస్పెన్షన్​ ఆర్డర్​లో కీలక విషయాలు పేర్కొన్నారు. ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లా క్రైమ్​ రికార్డ్స్​ బ్యూరో డీఎస్పీగా పని చేస్తున్న ప్రణీత్​ గతంలో హైదరాబాద్​ ఎస్​ఐబీలో పని చేస్తున్న సమయంలో తన హోదాను అడ్డం పెట్టుకుని నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు గుర్తించారు.

తన ఎస్​ఓటీ బృందం కోసం హైదరాబాద్​ ఎస్​ఐబీ కార్యాలయంలో ప్రత్యేక ఇంటర్నెట్​ సదుపాయాన్ని ప్రణీత్​ ఏర్పాటు చేసుకున్నట్లు సస్పెన్షన్​ ఆర్డర్​లో ఉన్నాయి. ఈ తతంగమంతా తానే నడిపినట్లు అధికారులు తేల్చారు. కంప్యూటర్​లోని 42 హార్ట్​ డిస్క్​లు సైతం మార్చినట్లు గుర్తించారు. పలువురి ఫోన్​ ట్యాపింగ్​కు సంబంధించిన కాల్​ డీటైల్​ రికార్డ్స్​, ఐఎంఈఐ, ఇంటర్నెట్​ ప్రోటోకాల్​ రికార్డులను ప్రవీణ్​ డిలీట్​ చేశారు. ఎలక్ట్రీషియన్​ సాయంతో ఎస్​ఐబీ భవనంలో సీసీ కెమెరాలు(CC Camera) ఆఫ్​ చేయించి హార్ట్​ డిస్కులు ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు. కాగా విచారణ పూర్తయ్యే వరకూ అనుమతి లేకుండా డీఎస్పీ ప్రణీత్​ హెడ్​ క్వార్టర్స్​ను వీడకూడదని సస్పెన్షన్​ ఆర్డర్​లో పేర్కొన్నారు.

అన్ కాన్షియస్ అవుతున్నానంటూ అంబులెన్స్​కి కాల్ - వచ్చిచూసేసరికి సిబ్బందికి షాక్

Call Tapping Case Update :ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల ఫోన్ల ట్యాపింగ్​ విషయంలో సస్పెండ్​ అయిన ఎస్​ఐబీ డీఎస్పీ ప్రణీత్​ కుమార్​ గురించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేసీఆర్​ ప్రభుత్వం హయాంలో కీలక నేతల ఫోన్లు ట్యాప్​ చేసినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు రాగా, కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్​ ప్రభుత్వం ఆయన వైఖరిపై విచారణ చేపట్టింది. ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల ఫోన్ల ట్యాపింగ్​ విషయంలో సస్పెండ్​ అయిన ఎస్​ఐబీ డీఎస్పీ ప్రణీత్​ కుమార్​ గురించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

సస్పెండ్​ చేసిన డీజీపీ : కేసీఆర్​ ప్రభుత్వం హయాంలో కీలక నేతల ఫోన్లు ట్యాప్​ చేసినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు రాగా, కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్​ ప్రభుత్వం ఆయన వైఖరిపై విచారణ చేపట్టింది. కాగా సోమవారం డీఎస్పీ దుగ్యాల ప్రణీత్​రావును సస్పెండ్​ చేస్తూ డీజీపీ రవిగుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. కొన్ని రోజుల క్రితం డీజీపీ కార్యాలయానికి ఆయనను ప్రభుత్వం అటాచ్​ చేసింది.

Hyderabad SI Rajendra Drugs Case Update : డ్రగ్స్ కేసు అప్డేట్.. SI రాజేంద్ర కాల్​డేటాలో అసలుగుట్టు

లేడీ డాక్టర్​ను పొడిచి చంపిన రోగి.. ట్రీట్​మెంట్​ చేస్తుండగానే..

Last Updated : Mar 5, 2024, 10:48 PM IST

ABOUT THE AUTHOR

...view details