తెలంగాణ

telangana

హైదరాబాద్​లో నేరస్థులకు అడ్డాగా పలు కాలనీలు - పట్టుకునేందుకు వెళితే పోలీసులపైనే దాడులు - Telangana Govt Focus On Drugs

By ETV Bharat Telangana Team

Published : Jul 13, 2024, 12:38 PM IST

Telangana Govt Focus On Drugs In Hyderabad: హైదరాబాద్‌ను అడ్డాగా చేసుకొని మాదకద్రవ్యాల స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. నగరంలోని పలు కాలనీల్లో యథేచ్ఛగా గంజాయి, డ్రగ్స్​ను అమ్ముతున్నారు. తనిఖీలకు వెళ్లిన పోలీసులపైనే దాడులకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలతో నిందితులు ఆయా బస్తీల్లో ఉన్నట్లు తెలిసినా, పోలీసులకు వారిని అరెస్ట్ చేయడం సవాల్​గా మారుతుంది.

Drug Gang Attack On police In Hyderabad
Telangana Govt Focus On Drugs In Hyderabad (ETV Bharat)

Drug Gang Attack On police In Hyderabad : హైదరాబాద్​లోని పలు కాలనీలు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారాయి. బస్తీల్లోని కొంత మంది దొంగలు, రౌడీలు, గంజాయి ముఠాలకు, డ్రగ్స్‌ ఏజెంట్లకు రక్షణ కవచంగా తయారయ్యారు. బస్తీల్లో తనిఖీలు చేసేందుకు వెళ్లేందుకు పోలీసులు వెనుకంజ వేస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా నగరంలోని నాంపల్లి రైల్వేస్టేషన్‌ సమీపంలో మాంగారి బస్తీకి చెందిన ఓ దొంగ పోలీసులపై గొడ్డలితో దాడికి తెగబడ్డాడు. ఆత్మరక్షణకు పోలీసులు జరిపిన కాల్పుల్లో గాయపడి ఆసుపత్రి పాలయ్యాడు. సైదాబాద్‌ ఠాణా, బోరబండ ఠాణా పరిధిలోని కొన్ని బస్తీలు రౌడీలకు, బెల్టు దుకాణాలకు కేంద్రమయ్యాయి. పోలీసులు నిర్బంధ తనిఖీలకు వెళితే అక్కడి రౌడీ మూకలు దాడికి దిగుతున్నారు. దీంతో నిందితులు ఆయా కాలనీల్లో నివసిస్తున్నట్లు తెలిసినా అరెస్ట్‌ చేయడం సవాల్‌గా మారుతోందని నగరానికి చెందిన ఓ ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు.

ఆ బలహీనతే నేరస్థులకు అస్త్రం: మంగళ్‌హాట్‌ పరిధిలో 100 కుటుంబాలకుపైగా గంజాయి స్మగ్లింగ్, సట్టాతో పలు ప్రాంతాలను శాసిస్తున్నాయి. షాహినాయత్‌గంజ్, బేగంబజార్‌లలో నకిలీ దందా యథేచ్ఛగా సాగుతుందనేది బహిరంగ రహస్యం. సున్నితమైన ఆ ప్రాంతాల్లో కాలుపెడితే శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందనే పోలీసుల ముందు చూపు నేరస్థులకు అవకాశంగా మారుతోంది. మత్తు దందాలో నాంపల్లి సమీపంలోని ఆ కాలనీ ప్రధాన కేంద్రం. అక్కడ 20 కుటుంబాలు వ్యాపారం చేస్తూ రూ.లక్షలు ఆర్జిస్తున్నట్లు తెలిసినా దాడులు చేసే సాహసం చేయలేక పోయామని ఓ ఇన్‌స్పెక్టర్‌ వాపోయారు.

నిర్బంధ తనిఖీలు :రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్​పై ఉక్కుపాదం మోపాలని, ఈ విషయంలో మరింత యాక్టివ్​గా పనిచేయాలని సీఎం రేవంత్​ రెడ్డి వివరించారు. అనుమానిత ప్రాంతాల్లో స్పెషల్​ డ్రైవ్స్​ నిర్వహించాలని సూచించారు. దీంతో హైదరాబాద్​లో పలు చోట్ల పోలీసులు తనిఖీలు చేపట్టారు. నగరంలోని పలుచోట్లలో నిర్బంధ తనిఖీలు నేరస్థుల వెన్నులో వణకు పుట్టించాయి. ఎన్నో కీలకమైన కేసుల్లో పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న దొంగలు చిక్కారు. అంతర్రాష్ట్ర ముఠాలతో స్థానిక చోరుల లింకులు బయటపడ్డాయి. సరైన పత్రాల్లేని ద్విచక్రవాహనాలు, ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. నేర నియంత్రణలో ఇంతటి ప్రభావం చూపిన నిర్బంధ తనిఖీలు అటకెక్కాయి.

హైదరాబాద్​లో రెచ్చిపోతున్న మాదకద్రవ్యాల స్మగ్లర్లు - డెకాయ్‌ ఆపరేషన్స్‌తో సూత్రధారుల గుట్టురట్టు - TG GOVT FOCUS ON DRUGS CONTROL

డ్రగ్స్ వాడొద్దని భారతీయుడు-2 టీమ్ స్పెషల్ వీడియో - అభినందించిన సీఎం రేవంత్​ - CM Revanth Reacts on Bharateeyudu 2

ABOUT THE AUTHOR

...view details