ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పైపులైన్లు వేసి ఓట్లు వేయించుకున్నారు- ఎన్నికలయ్యాక గొంతెండుతున్న గుంటూరు శివారు - DRINKING WATER CRISIS

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 29, 2024, 10:30 AM IST

Drinking Water Crisis Guntur People Facing Problems : గుక్కెడు నీటి కోసం గుంటూరు శివారు కాలనీ వాసులు అల్లాడుతున్నారు. మండు వేసవిలో 'దాహమో రామచంద్రా' అంటూ వేడుకుంటున్నారు. ఎన్నికల వేళ హడావుడిగా పైపులైన్లు వేసి దాహార్తిని తీర్చిన పాలకులు పోలింగ్‌ ముగియగానే సరఫరా నిలిపివేశారు. దాదాపు రెండు వారాల నుంచి తాగునీరు రావట్లేదని అప్పుడప్పుడు వచ్చే ఒకటీ, రెండూ ట్యాంకర్లు సరిపోవట్లేదని స్థానికులు వాపోతున్నారు.

drinking_water_crisis_guntur_people_facing_problems
drinking_water_crisis_guntur_people_facing_problems (ETV Bharat)

Drinking Water Crisis Guntur People Facing Problems :గుంటూరు ప్రజలను తాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి. నగరంలో అధికారికంగా 10 లక్షల మంది జనాభా నివిసిస్తుండగా ఉపాధి కోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వేలాది మంది శివారు కాలనీల్లో జీవనం సాగిస్తున్నారు. నగర పాలక సంస్థ ప్రజలకు తాగునీరు అందించేందుకు సమగ్ర తాగునీటి పథకం కింద 460 కోట్లు, అమృత్ పథకం కింద మరో 33 కోట్లు వెచ్చించినా శివారు కాలనీ వాసులకు మాత్రం దాహార్తిని తీర్చలేకపోతుంది. పాత గుంటూరులోని సుద్దపల్లి డొంక, ప్రగతి నగర్‌తో పాటు ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు పరిసర కాలనీలైన అన్నపూర్ణ నగర్‌, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు ప్రగతి నగర్‌, మదర్‌ థెరిస్సా కాలనీ, పలకలూరు రోడ్డు, రైలుకట్టలోని ప్రజలు నీరు లేక ఇబ్బందులు పడుతున్నారు.

కృష్ణమ్మ చెంతనే ఉన్నా తీరని దాహం - కలుషిత నీరు తాగలేక జనం అవస్థలు - WATER PROBLEM IN VIJAYAWADA

Drinking Water Scarcity : తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో శివారు కాలనీ వాసులకు తాగునీరు అందించేందుకు గోరంట్ల కొండ మీద రిజర్వాయర్‌ నిర్మాణం చేపట్టారు. నిధులు కూడా విడుదల చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రిజర్వాయర్‌ పనులను పూర్తిగా నిలిపివేసింది. ఐదేళ్లుగా నీటి సరఫరా గురించి పట్టించుకోని స్థానిక ప్రజాప్రతినిధులు ఎన్నికల వేళ మాత్రం హడావుడిగా శివారు కాలనీ ఇళ్లకు పైపులైన్ల కనెక్షన్‌ ఇచ్చి తాగునీరు అందించారు. పోలింగ్‌ ముగిసిన వెంటనే నీటి సరఫరా నిలిపివేశారని స్థానికులు వాపోతున్నారు.

నీటి సమస్యతో అల్లాడుతున్న ప్రజలు - ట్యాంకర్ నీరు సరిపోవట్లేదని మహిళల ఆవేదన - WOMENS SUFFERING No WATER

పైపులైన్లు వేసి ఓట్లు వేయించుకున్నారు- ఎన్నికలయ్యాక గొంతెండుతున్న గుంటూరు శివారు (ETV Bharat)

'పైపులైన్ల ద్వారా తాగునీరు రావట్లేదు. ఈ విషయమై చాలా సార్లు స్థానికులంతా కలిసి నగర పాలక సంస్థ అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. అధికారులు మాత్రం నామమాత్రంగా నాలుగు రోజులకొకసారి ట్యాంకర్లు పంపిస్తున్నారు. ట్యాంకర్ల ద్వారా అందించే నీరు ఏ మూలకు సరిపోవడం లేదు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.' - స్థానికులు

ఎన్నికల వేళ హడావిడి చేసిన నాయకులకు ఇప్పుడు మా కష్టాలు కనబడటం లేదా అని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.

రాష్ట్రంలో దాహం కేకలు - తాగునీటి కోసం మారణాయుధాలతో కొట్టుకున్న టీడీపీ, వైఎస్సార్సీపీ వర్గీయులు - Water problems in andhra pradesh

ABOUT THE AUTHOR

...view details