Shadnagar Incident Update : రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో దొంగతనం కేసులో మహళ, ఆమె భర్త, కుమారుడిని ఠాణాకు తీసుకొచ్చి చిత్రహింసలకు గురి చేసిన ఘటనలో పోలీస్ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. దీనికి బాధ్యుడైన డిటెక్టివ్ సీఐ రామిరెడ్డితో పాటు మరో ఐదుగురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి ఉత్తర్వులు జారీ చేశారు. షాద్నగర్ ఠాణాలో పని చేస్తున్న కానిస్టేబుళ్లు జాకీర్, రాజు, మోహన్ లాల్, అఖిల, కరుణాకర్లను సీపీ సస్పెండ్ చేశారు. దీంతో పాటు ఘటనపై తదుపరి విచారణ కొనసాగిస్తున్నట్లు అవినాశ్ మహంతి తెలిపారు.
అసలు ఏం జరిగిందంటే? రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని అంబేడ్కర్ నగర్కు చెందిన దళిత మహిళను పోలీసులు ఠాణాలో చిత్రహింసలకు గురి చేసిన వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. దళితవాడలో నివాసముండే పీఎంపీ వైద్యుడు నాగేందర్ జులై 24న తన ఇంట్లో 22.5 తులాల బంగారం, రూ.2 లక్షలు పోయాయని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నాగేందర్ ఇంటికెదురుగా ఉంటూ కూలీ చేసుకునే భీమయ్య, సునీత దంపతుల్ని జులై 26న డిటెక్టివ్ సీఐ రామిరెడ్డి విచారణ కోసమని స్టేషన్ పిలిచారు. చోరీ చేయలేదని చెప్పడంతో వదిలేశారు.
ఖాకీల కర్కశత్వం - దొంగతనం ఆరోపణలతో ఎస్సీ మహిళపై విచక్షణరహితంగా దాడి - Police Crushed Accused Woman