ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కనకదుర్గమ్మను దర్శించుకున్న స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు, సీఎస్​ నీరభ్‌కుమార్‌ - CS And Speaker Visit Bejwada Temple

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 24, 2024, 10:51 AM IST

CS Nirab Kumar Visited Kanaka Durga Temple: విజయవాడ ఇంద్రకీలాద్రీపై ఉన్న కనకదుర్గమ్మను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శాసన సభాపతి కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. దర్శనం అనంతరం వారికి వేదపండితులు వేదాశీర్వచనం చేశారు.

CS Nirab Kumar Visited Kanaka Durga Temple
CS Nirab Kumar Visited Kanaka Durga Temple (ETV Bharat)

కనకదుర్గమ్మను దర్శించుకున్న స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు, సీఎస్​ నీరభ్‌కుమార్‌ (ETV Bharat)

CS Nirab Kumar Visited Kanaka Durga Temple: విజయవాడ ఇంద్రకీలాద్రీపై ఉన్న దుర్గమ్మను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీరభ్‌కుమార్‌ ప్రసాద్‌ దర్శించుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి వారు దుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని అనంతరం సేవలో పాల్గొన్నారు. ముందుగా ఆలయ కార్య నిర్వహణ అధికారి కె.ఎస్ రామరావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. దర్శనం అనంతరం వారికి వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం ఆలయ ఈవో వారికి ప్రసాదములు, శేష వస్త్రములు, చిత్రపటం అందించారు.

శ్రీవారిని దర్శించుకున్న పలువురు సినీ నటులు - సుప్రభాత సేవలో పాల్గొన్న కేంద్రమంత్రి కుమారస్వామి - Movie Actors in Tirumala Temple

Speaker Ayyannapatrudu Visited Kanaka Durga Temple: ఆంధ్రప్రదేశ్‌ శాసన సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఇంద్రకీలాద్రీపై ఉన్న దుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి అమ్మవారి ఆలయానికి వచ్చారు. ఆలయ అధికారులు మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. రాష్ట్ర శాసనసభాపతిగా ఎన్నికైన తర్వాత కుటుంబ సమేతంగా అమ్మవారి గుడికి వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వేదపండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ ఈవో శ్రీ అమ్మవారి ప్రసాదములు, శేష వస్త్రములను అందించారు.

కనకదుర్గమ్మకు రాజధాని రైతుల మొక్కులు- తుళ్లూరు నుంచి పాదయాత్ర - amaravati farmers padayatra

ABOUT THE AUTHOR

...view details