తెలంగాణ

telangana

ఇంజినీరింగ్​ స్టూడెంట్స్​కు గుడ్​ న్యూస్​ : ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి ఫీజు రీయింబర్స్​మెంట్​? - CM Revanth SAID fee reimbursement

By ETV Bharat Telangana Team

Published : Jul 13, 2024, 5:00 PM IST

Updated : Jul 13, 2024, 5:37 PM IST

CM Revanth Meeting in JNTU : ఇంజినీరింగ్​ కళాశాలల్లో సివిల్​, మెకానిక్​, ఎలక్ట్రికల్​ కోర్సులను కచ్చితంగా నడపాలని సీఎం రేవంత్​ రెడ్డి ఆదేశించారు. ఇంజినీరింగ్​ కాలేజీలకు సహాయం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. మ్యాన్​మెడ్​ వండర్స్​ను క్రియేట్​ చేసిందే ఇంజినీర్లు అని సీఎం తెలిపారు. జేఎన్​టీయూలో ఇంజినీరింగ్​ కాలేజీల యాజమాన్యాలతో సీఎం సమావేశం నిర్వహించారు.

cm revanth reddy jntu
cm revanth reddy jntu (ETV Bharat)

CM Revanth Reddy meet with Management of Engineering Colleges : ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి ఫీజు రీయింబర్స్​మెంట్​ బకాయిలు లేకుండా చేస్తానని సీఎం రేవంత్​ రెడ్డి హామీ ఇచ్చారు. ఇంజినీరింగ్​ కళాశాలకు సహాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం చెప్పారు. నిరుద్యోగులను తయారు చేసే పరిశ్రమలుగా కళాశాలలు ఉండకూడని అన్నారు. జేఎన్​టీయూలో ఇంజినీరింగ్​ కాలేజీల యాజమాన్యాలతో సీఎం సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో నాణ్యమైన ఇంజినీరింగ్​ విద్య అనే కార్యక్రమంలో సీఎం రేవంత్​ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్​ బాబు, జేఎన్​టీయూ వీసీ బుర్రా వెంకటేశంతో పాటు పలువురు ఉన్నతాధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్​ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ విధానాలు అందరికీ తెలిసే విధంగా ప్రస్తుత కార్యక్రమం ఉందని పేర్కొన్నారు. ప్రతి విషయంలో ప్రభుత్వ విధానం కీలకమని స్పష్టం చేశారు. మ్యాన్​మేడ్​ వండర్స్​ను క్రియేట్​ చేసిందే ఇంజినీర్లు అని కొనియాడారు. ప్రపంచంలోని దేశాల్లో గొప్పగా ఏదైనా ఉంటే దాన్ని చేసింది ఇంజినీర్లే అని చెప్పారు. అభివృద్ధి చెందుతున్న దేశానికి అత్యంత అవసరమైంది సివిల్​ ఇంజినీరింగ్​ అని తెలిపారు.

కొన్ని కళాశాలల్లో సివిల్​ ఇంజినీరింగ్​ను లేకుండా చేసే విధంగా ప్రణాళికలు చేస్తున్నారని సీఎం రేవంత్​ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కాలేజీల్లో సివిల్, మెకానికల్​, ఎలక్ట్రికల్​ కోర్సులను కచ్చితంగా నడపాలని సీఎం రేవంత్​ రెడ్డి సూచించారు. ఈ మూడు కోర్సులు లేకపోతే దేశం ప్రమాదాన్ని ఎదురుకుంటుందని హెచ్చరించారు. ఉద్యోగాలు సృష్టించే సంస్థలుగా కాకుండా మేధావులను అందించే సంస్థలు ఉండాలన్నారు.

తొలిసారి ఫీజు రియింబర్స్​మెంట్​ పెట్టిందే కాంగ్రెస్​ : తొలిసారి ఫీజు రీయింబర్స్​మెంట్​ విధానం ప్రవేశపెట్టిందే కాంగ్రెస్​ ప్రభుత్వం అని గుర్తు చేశారు. జేఎన్​టీయూ పరిధిలో కళాశాలలు నిర్వహిస్తున్న సిబ్బందికి ప్రభుత్వ విధానం గురించి తెలవాలని సీఎం స్పష్టం చేశారు. లక్ష మంది ఇంజినీరింగ్​ పట్టాలు పొందిన వారికి ప్రభుత్వ విధానం తెలుస్తుందని చెప్పారు. ముందుగా జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని సీఎం రేవంత్​ రెడ్డి ప్రారంభించారు. ఏఐ గ్లోబల్​ సమ్మిట్​ లోగోను సీఎం, మంత్రి శ్రీధర్​ బాబు ఆవిష్కరించారు.

'గత సీఎంలు తీసుకున్న విధానాల వల్ల మనం ఐటీ, ఫార్మా రంగాల్లో ముందు ఉన్నాం. భవిష్యత్తులో అవసరాలను దృష్టిలో పెట్టుకుని కోర్సులు ఉండాలి. 60 లక్షల నిరుద్యోగులు ఉన్న రాష్ట్రంలో ఇతర ప్రాంతాల నుంచి ఉపాధి పొందుతున్నారు. ఫార్మా, ఐటీ తర్వాత ఏఐ ప్రపంచాన్ని నడిపించబోతోంది. రాష్ట్రంలోని కళాశాలల్లో ఏఐకి సంబంధించిన కోర్సు ప్రవేశపెట్టాలి. ఏఐకి సంబంధించిన కోర్సులు ప్రవేశపెడితే ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది.' అని సీఎం రేవంత్​ రెడ్డి తెలిపారు.

త్వరలో స్కిల్​ డెవలప్​మెంట్​ యూనివర్సిటీకి అటానమస్​ హోదా : త్వరలోనే స్కిల్​ డెవలప్​మెట్​ యూనివర్సిటీకి అటానమస్​ హోదా ఇస్తామని సీఎం రేవంత్​ రెడ్డి తెలిపారు. పక్క రాష్ట్రాలతో పోటీ పడే విధంగా కాకుండా ప్రపంచంతోనే పోటీపడే విధంగా మనం తయారు కావాలన్నారు. మా ప్రభుత్వం నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకే కృషి చేస్తుందని చెప్పారు. మా ప్రభుత్వం నిరుద్యోగులకు సంబంధించిన ప్రణాళికలను సిద్ధం చేస్తుందని వివరించారు. గ్రూప్​ 1 ప్రిలిమ్స్​ పరీక్షలు ఎలాంటి సమస్యలు లేకుండా నిర్వహించామని వెల్లడించారు. నోటిఫికేషన్​ ఇచ్చిన ప్రకారమే గ్రూప్​1 ప్రిలిమ్స్​ నిర్వహిస్తామని సీఎం రేవంత్​ రెడ్డి స్పష్టం చేశారు.

సీఎం రేవంత్‌ రెడ్డి నయా అస్త్రం 'హైడ్రా' - దీని గురించి మీకు తెలుసా? - HYDRA for Disaster Management

ఇక నుంచి ప్రతి నెలా మొదటి వారంలో నిర్ణీత ఆదాయ లక్ష్యాలపై సమీక్ష : సీఎం రేవంత్ - CM Revanth Review Revenue Dept

Last Updated : Jul 13, 2024, 5:37 PM IST

ABOUT THE AUTHOR

...view details