ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఈటీవీ భారత్​ కథనానికి స్పందన- చిన్నారి వైద్యానికి సీఎం రేవంత్ సాయం - Revanth Reddy Helps Child Treatment

CM Revanth Reddy Helps For Child Treatment: 'చిన్నారి మెదడులో గడ్డ కట్టిన రక్తం - ఆపన్న హస్తం కోసం తల్లిదండ్రుల ఎదురుచూపులు' అనే శీర్షికతో ఈటీవీ భారత్ తెలంగాణలో ప్రచురించిన కథనానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందించారు. స్థానిక ఎమ్మెల్యేకు సమాచారమిచ్చిన సీఎం​వో బాబును శస్త్ర చికిత్స తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించింది. ఈ మేరకు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి బాధితులను పిలిపించి, వైద్యానికి ఏర్పాట్లు చేశారు.

CM Revanth Reddy Helps For Child Treatment
CM Revanth Reddy Helps For Child Treatment

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 20, 2024, 11:04 AM IST

ఈటీవీ భారత్​ కథనానికి స్పందన- చిన్నారి వైద్యానికి సీఎం రేవంత్ సాయం

CM Revanth Helps For Child Treatment:'చిన్నారి మెదడులో గడ్డ కట్టిన రక్తం - ఆపన్న హస్తం కోసం తల్లిదండ్రుల ఎదురుచూపులు' అనే శీర్షికతో ఈటీవీ భారత్ తెలంగాణలో వచ్చిన కథనానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందించారు. స్థానిక ఎమ్మెల్యేలకు సీఎం​వో సమాచారం అందించింది. బాబును శస్త్ర చికిత్స తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించింది. ఈ మేరకు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి బాధితులను పిలిపించి, బాబు వైద్యానికి ఏర్పాట్లు చేశారు.

ఇదీ బాబు సమస్య: హనుమకొండ జిల్లా పరకాల మండలం వెంకటాపూర్‌కు చెందిన సిల్వేరు వెంకటేశ్‌ - అశ్విత దంపతుల ఏడాది వయసున్న కుమారుడు మహాన్‌ పుట్టిన నెల రోజులకే మెదడులో రక్తం గడ్డకట్టి అనారోగ్యానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే తలకు కణతి ఏర్పడి పెద్దగా మారిపోయింది. చిన్నారి వైద్యం కోసం ఆస్పత్రుల చుట్టూ తిరిగిన తల్లిదండ్రులు అప్పు చేసి మూడు శస్త్ర చికిత్సలు చేయించారు. అయినప్పటికీ కణతి పరిమాణం పెరిగిందే తప్పితే బాగు కాలేదు. మళ్లీ పరీక్షించిన వైద్యులు ఆపరేషన్‌కు ఐదు లక్షలు ఖర్చవుతుందని చెప్పారు.

CM Response Child Suffering Blood Clots In Brain:నిరుపేద కుటుంబం కావడంతో బాబు ఇంకా చికిత్స చేయించే స్థోమత లేక వారు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఇప్పటికే లక్షల్లో అప్పులు చేసి చికిత్స చేయించిన తమకు ఏం చేయాలో అర్థం కాలేదు. దీంతో ఈటీవీ భారత్​తో తమ కష్టాలను చెప్పుకున్నారు. 'చిన్నారి మెదడులో గడ్డ కట్టిన రక్తం - ఆపన్న హస్తం కోసం తల్లిదండ్రుల ఎదురుచూపులు' అనే శీర్షికతో చిన్నారి పడుతున్న బాధను ఈటీవీ భారత్ కథనంగా ప్రచురించింది.

ఈ కథనంలో ఎవరైనా దాతలు సహాయం చేస్తే తమ కుమారిడిని కాపాడుకుంటామని బాబు తల్లిదండ్రులు ప్రాధేయపడ్డారు. ఈ నేపథ్యంలోనే ఈ కథనం కాస్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్లింది. విషయం తెలుసుకున్న రేవంత్ రెడ్డి స్పందించి చిన్నారి చికిత్సకు సంబంధించి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. చిన్నారికి వచ్చిన పెద్ద కష్టానికి ప్రభుత్వం స్పందించటంపై బాధితులు హర్షం వ్యక్తం చేశారు.

కన్నా లక్ష్మీనారాయణ ఔదార్యం- సొంత ఖర్చులతో ప్రయాణికులకు ఆటోలు ఏర్పాటు

"పరకాల మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో అశ్విత కుమారునికి తలకు పెద్ద గడ్డ అయింది. ఆ బాబు చికిత్సకు ఆ తల్లిదండ్రులు పడుతున్న కష్టాలు గురించి ఈటీవీ భారత్​లో కథనం వచ్చింది. ఆ కథనాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూసి బాధిత కుటుంబానికి వైద్యం చేయించాలని ఆదేశాలు ఇచ్చారు. అందులో భాగంగా వారిని పిలిపించి రెయిన్ బో ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడి ఆపరేషన్​కు ఏర్పాట్లు చేశాం." -నాయిని రాజేందర్‌రెడ్డి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే

"బాబుని చూసి ఈటీవీ భారత్ వాళ్లు వచ్చారు. వాళ్లకి మా బాబు సమస్యలు చెప్పుకున్నాం. వాళ్లు స్పందించి ఈటీవీ భారత్​లో కథనం రాశారు. దీనికి స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మా బాబుకు వైద్యం చేయిస్తున్నారు. మాకు సాయం చేసిన ముఖ్యమంత్రికి, మా బాధను సీఎం వరకూ తీసుకువెళ్లి సాయం అందేలా చేసిన ఈటీవీ భారత్ యాజమాన్యానికి కృతజ్ఞతలు." -మహాన్, తల్లిదండ్రులు

మీ సమస్య గురించి తర్వాత ఆలోచిద్దాం- ముందు వైఎస్సార్సీపీలో చేరి గెలిపించండి

ABOUT THE AUTHOR

...view details