ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దేశంలోనే ఏపీ పోలీస్‌కు ప్రత్యేక బ్రాండ్‌ ఉంది: సీఎం చంద్రబాబు

దేశంలోనే ఏపీ పోలీస్‌కు ప్రత్యేక బ్రాండ్‌ ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. తాను సీఎంగా ఉన్న ప్రతిసారీ పోలీసు వ్యవస్థను పటిష్ఠపరిచే అనేక చర్యలు చేపట్టానని తెలిపారు.

By ETV Bharat Andhra Pradesh Team

Published : 4 hours ago

Updated : 25 minutes ago

cbn_in_police_commemoration_day
cbn_in_police_commemoration_day (ETV Bharat)

CM Chandrababu Speech in Police Commemoration Day : విధి నిర్వహణలో పోలీసులు ప్రాణాలు విడిచి ప్రజల హృదయాల్లో త్యాగధనులుగా నిలిచారని సీఎం చంద్రబాబు అన్నారు. అన్ని శాఖల కంటే పోలీసు శాఖ అత్యంత కీలకమని కొనియాడారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా విజయవాడలో నిర్వహించిన కార్యక్రమానికి సీఎం హాజరయ్యారు. ఈ క్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ ఏ ప్రగతి జరగాలన్నా పోలీసులే కీలకని ప్రజల ప్రాణాలు, ఆస్తులు కాపాడేందుకు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారని కొనియాడారు. అహర్నిశలు శ్రమిస్తున్న పోలీసులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని సీఎం అన్నారు.

దేశంలోనే ఏపీ పోలీస్‌కు ప్రత్యేక బ్రాండ్‌ ఉంది: సీఎం చంద్రబాబు (ETV Bharat)

ఉమ్మడి రాష్ట్రంలో నక్సలిజాన్ని ఉక్కుపాదంతో అణచివేశారని సీఎం అన్నారు. ఫ్యాక్షనిజం, రౌడీల ఆట కట్టించారని శాంతిభద్రతలను కాపాడటంలో ఏమాత్రం రాజీ పడలేదని వివరించారు. పోలీసుల సంక్షేమం కూటమి ప్రభుత్వం బాధ్యత అని అంతే కాకుండా పటిష్ఠ యంత్రాంగంగా తయారు చేయడం తమ కర్తవ్యమని వెల్లడించారు. రాష్ట్ర విభజన తర్వాత పోలీసు వ్యవస్థలో అనేక మార్పులు తీసుకొచ్చామని వాహనాలతో పాటు పరికరాలు, సాంకేతిక సౌకర్యం కల్పించామని తెలిపారు. 2014-2019లో పోలీసు శాఖకు రూ.600 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. కొత్తగా వాహనాల కోసం రూ.150కోట్లు, పోలీసు కార్యాలయాల మరమ్మతులు, నిర్వహణకు రూ.60కోట్లు, పోలీసు సంక్షేమానికి రూ.55 కోట్లు ఖర్చు చేశామని మరో రూ.27కోట్లతో ఏపీఎఫ్‌ఎస్‌ఎల్‌ ఎక్విప్‌మెంట్‌ కొనుగోలు చేసినట్లు సీఎం వివరించారు.

'వైఎస్సార్సీపీ పునాదులే నేరాలు - ఘోరాలు' - ఎక్స్​లో నారా లోకేశ్ V/S వైఎస్ జగన్

సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు దీటైన పోలీసు వ్యవస్థకు శ్రీకారం చుట్టినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. విశాఖలో గ్రేహౌండ్స్‌ కోసం ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేసినట్లు వివరించారు. కేంద్రం ఎప్పటికప్పుడు పోలీసు వ్యవస్థ ప్రక్షాళనకు ముందుకొస్తోందని అన్నారు. ఆధునిక ఆయుధాలు, సాంకేతిక పరిజ్ఞానం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వెల్లడించారు. అధికారంలోకి వచ్చిన 125 రోజుల్లో పెండింగ్‌లో ఉన్న బిల్లులన్నీ చెల్లించామని అన్నారు. దిశ పేరుతో వాహనాలకు రూ.16కోట్లు, కమ్యూనికేషన్‌ పరికరాల కోసం రూ.20కోట్లు పెండింగ్‌ పెడితే వాటినీ చెల్లించామని సీఎం తెలిపారు.

తప్పు చేసిన వ్యక్తిని వెంటనే పట్టుకునే వ్యవస్థ అవసరం. గత ప్రభుత్వం కక్ష సాధింపులే పనిగా పెట్టుకుంది. రాగద్వేషాలకు అతీతంగా పనిచేసేదే పోలీసు వ్యవస్థ. సర్వే రాళ్లపై బొమ్మల కోసం జగన్ రూ.700 కోట్లు తగలేశారు. కానీ, సీసీ కెమెరాల కోసం రూ.700 కోట్లు ఇవ్వలేకపోయారు. నేరాల తీరు మారుతోంది పోలీసు వ్యవస్థ అప్రమత్తంగా ఉండాలి. రాజకీయ ముసుగులో నేరాలకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించాలి. - చంద్రబాబు, సీఎం

తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు - జగన్​కు మంత్రి లోకేశ్‌ హెచ్చరిక

"లైసెన్సులు మాకిచ్చి పోండి - ప్రతి నెలా ముడుపులివ్వాల్సిందే"- మద్యం వ్యాపారులకు ఎమ్మెల్యేల బెదిరింపులు

Last Updated : 25 minutes ago

ABOUT THE AUTHOR

...view details