తెలంగాణ

telangana

ETV Bharat / state

తిరుమల కొండపై కోడిపుంజులు పెంచిన డీఎస్పీ - క్షమశిక్షణ చర్యలకు ఏపీ ప్రభుత్వం ఆదేశం - CHICKENS COTTAGES IN TIRUMALA

తిరుమల డీఎస్పీగా టీటీ ప్రభాకర్​ బాబు పనిచేసిన కాలంలో కాటేజీల మద్య కోళ్ల పెంపకం - వాటి అన్నస్నానాదుల బాధ్యత కానిస్టేబుళ్లకు - కోళ్లవల్ల భక్తులకు ఇబ్బంది - క్రమశిక్షణ చర్యలకు ప్రభుత్వం సిద్ధం

Chickens Cottages In Tirumala Row
Chickens Cottages In Tirumala Row (EV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Feb 22, 2025, 1:15 PM IST

Chickens Cottages In Tirumala Row : టీటీ ప్రభాకర్‌బాబు ఆంధ్రప్రదేశ్​ పోలీసు శాఖలో ప్రస్తుతం అదనపు ఎస్పీ హోదాలో పని చేస్తున్నారు. వైఎస్సార్​సీపీ హయాంలో 2019 ఆగస్టు 10 నుంచి 2020 నవంబరు 30 వరకు తిరుమల డీఎస్పీగా ఆయన బాధ్యతలు నిర్వహించారు. ఆ సమయంలో సదరు అధికారి నిర్వాకంపై రాష్ట్ర ప్రభుత్వం తాజాగా శుక్రవారం అభియోగాలు మోపింది. ‘టీటీడీ కేటాయించిన వసతిగృహంలో నివసించిన ప్రభాకర్‌బాబు అందులో కోడిపుంజులను పెంచారు. ఆ వసతిగృహం భక్తులు, యాత్రికులకు కేటాయించిన కాటేజీల మధ్యలో ఉండటంతో రాత్రివేళ ఆ కోళ్ల అరుపుల శబ్దాలు, వాటి విసర్జితాల దుర్వాసనకు యాత్రికులకు సరిగ్గా నిద్ర పట్టేది కాదు ఫలితంగా వారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యేవారు.

టీటీ ప్రభాకర్​ బాబు (ETV Bharat)

ఆ కోళ్లకు స్నానం చేయించడం, ఆహారం పెట్టడం లాంటి పనులు కానిస్టేబుళ్లతో చేయించేవారు. ప్రభాకర్‌బాబు ప్రవర్తనతో విసిపోయి మానసికంగా తీవ్ర ఇబ్బందులు పడ్డ పోలీసు సిబ్బంది తాము అక్కడ పని చేయలేమని వేరే చోటకు పంపించాలని కోరగా వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం మాత్రమే కాకుండా బెదిరింపులకు పాల్పడ్డారు' అనేది అభియోగాల సారాంశం. ప్రభాకర్‌బాబుపై ఏడు అభియోగాలను నమోదు చేసిన ఏపీ ప్రభుత్వం వాటన్నింటికీ 15 రోజుల్లోగా లిఖితపూర్వకంగా లేదా నేరుగా హాజరై సమాధానాలివ్వాలని ప్రభాకర్​బాబును ఆదేశించింది. గడువు తేదీలోగా సమాధానాలివ్వకపోతే తమ వద్దనున్న సమాచారం ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజిత్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రధాన అభియోగాలివే :

  • ప్రభాకర్‌బాబు నివాసానికి పాలు పోసే వ్యక్తికి 9 మాసాల పాటు బిల్లు ఇవ్వకపోవడం వల్ల అతను పాల ప్యాకెట్లు వేయడం ఆపేశారు. దీన్ని మనసులో పెట్టుకున్న ప్రభాకర్‌బాబు అతన్ని వరాహస్వామి అతిథి గృహం వద్దకు రప్పించి, అతని వాహనంపై రూ.2 వేల ఫైన్​ వేయించారు.
  • ప్రభాకర్‌బాబు వద్ద వాహన డ్రైవర్‌గా పనిచేసే హోంగార్డును ఒక రోజంతా అవిశ్రాంతంగా తిప్పించారు. ఫలితంగా వాహనం వేడెక్కి ప్రమాదానికి గురైంది. నిర్లక్ష్యంగా, అజాగ్రత్తగా వాహనం నడిపి తనను హత్య చేయడానికి ప్రయత్నించాడంటూ ఆ హోంగార్డుపై కేసు పెట్టించారు.
  • తిరుమల ఒకటో పట్టణ ఠాణా పరిధిలో నమోదైన ఓ కేసుకు సంబంధించి ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేకుండానే టీటీడీ ఉద్యోగులు, ఇతరులను కలిపి 40 మందిని నిందితులుగా చేర్చారు. అందులో డిప్యూటీ ఈవో కూడా ఉన్నారు. వారెవరినీ విచారించలేదు.

తిరుమలలో భక్తుల సొత్తు స్వాహా! - దొరికిన వస్తువులను అప్పనంగా పంచేసుకున్నారు!

వేసవి సెలవుల్లో తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్ - ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శన టికెట్ల విడుదల తేదీలివే!

ABOUT THE AUTHOR

...view details