తెలంగాణ

telangana

ETV Bharat / state

సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్​లకు కేంద్రం షాక్ - తెలంగాణకు కేటాయించాలన్న అభ్యర్థన తిరస్కరణ

తెలంగాణ, ఏపీ కేడర్ విభజనపై కేంద్రం కీలక నిర్ణయం - పలువురు ఐఏఎస్, ఐపీఎస్‌ల అభ్యంతరాలు తోసిపుచ్చిన కేంద్రం

By ETV Bharat Telangana Team

Published : 4 hours ago

Updated : 2 hours ago

CENTERS KEY DECISION ON IAS IPS
CENTERS KEY DECISION ON IAS IPS (ETV Bharat)

Center Key Decision On Telangana Ap Cadre :ఐఏఎస్, ఐపీఎస్ కేడర్ విభజనపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పదమూడు మంది అధికారుల అభ్యంతరాలను తోసిపుచ్చిన కేంద్రం తాము గతంలో కేటాయించిన రాష్ట్రానికే వెళ్లాలని స్పష్టం చేసింది. తెలంగాణలో ఉన్న ఐఏఎస్ అధికారులు వాణీ ప్రసాద్, రొనాల్డ్ రోస్, వాకాటి కరుణ, ఆమ్రపాలి, మల్లెల ప్రశాంతి ఐపీఎస్​లు అంజనీ కుమార్, అభిలాష బిస్త్, అభిషేక్ మొహంతిని ఏపీకి వెళ్లాలని డీవోపీటీ ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్​లో పనిచేస్తున్న ఐఏఎస్​లు అనంతరాము, ఎస్ఎస్ రావత్, ఎల్.శివశంకర్, సృజన, హరి కిరణ్​ను తెలంగాణలో చేరాలని కేంద్రం స్పష్టం చేసింది.

ఇదీ వివాదం :ఉమ్మడి రాష్ట్రంలోని ఐఏఎస్, ఐపీఎస్​లను 2014లో తెలంగాణ, ఏపీ మధ్య విభజిస్తూ కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అందులో ఐఏఎస్ అధికారులు సోమేష్ కుమార్, వాణీ ప్రసాద్, రొనాల్డ్ రోస్, వాకాటి కరుణ, ఆమ్రపాలి, ప్రశాంతి ఐపీఎస్​లు అంజనీ కుమార్, సంతోష్ మెహ్రా, అభిలాష బిస్త్, అభిషేక్ మొహంతిని ఏపీకి కేటాయించారు. ఐఏఎస్ అధికారులు అనంతరాము, సృజన గుమ్మిళ్ల, ఎస్ఎస్ రావత్, ఎల్.శివశంకర్, సి.హరి కిరణ్ ఐపీఎస్ అధికారి ఏవీ రంగనాథ్​ను తెలంగాణను కేటాయించారు.

క్యాట్​ను ఆశ్రయించిన అధికారులు :విభజన తీరుపై అభ్యంతరం వ్యక్తం వీరందరూ 2014లో కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్​ను ఆశ్రయించారు. ఆ తర్వాత రంగనాథ్, సంతోష్ మెహ్రా తమ పిటిషన్లను వెనక్కి తీసుకున్నారు. మిగతా పిటిషన్లపై విచారణ జరిపిన క్యాట్ 2016లో అధికారులకు అనుకూలంగా తీర్పు వెల్లడించింది. క్యాట్ తీర్పులను సవాల్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం పరిధిలోని డీవోపీటీ 2017లో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది.

మొదట పిటిషన్లపై వేర్వేరుగా విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు సోమేష్ కుమార్ తెలంగాణ కేడర్​ను రద్దు చేసి ఏపీకి వెళ్లాలని గతేడాది జనవరిలో ఆదేశించింది. మిగతా పిటిషన్లన్నీ కలిపి విచారణ జరిపిన హైకోర్టు. అధికారుల అభ్యర్థనలు, అభ్యంతరాలను మరోసారి పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని ఈ ఏడాది మార్చిలో తీర్పు వెల్లడించింది.

ఆ అధికారులకు ఏపీలో చేరాలని ఆదేశం :హైకోర్టు ఆదేశాల మేరకు కేడర్ కేటాయింపుల పునఃపరిశీలన కోసం డీవోపీటీ మాజీ కార్యదర్శి, విశ్రాంత ఐఏఎస్ అధికారి దీపక్ ఖండేకర్​ను కేంద్రం నియమించింది. దీపక్ ఖండేకర్ ఏకసభ్య కమిటీ ఐఏఎస్, ఐపీఎస్​ల అభ్యంతరాలు, అభ్యర్థనలు, వాదనలు పరిశీలించింది. అధికారుల అభ్యంతరాలను తోసిపుచ్చి గతంలో డీవోపీటీ నిర్ణయమే సరైనదని దీపక్ ఖండేకర్ సిఫార్సు చేసింది.

కమిటీ సిఫార్సుల మేరకు తాజాగా డీవోపీటీ ఉత్తర్వులు జారీ చేసింది. ఐఏఎస్ అధికారులు వాణిప్రసాద్, రొనాల్డ్ రోస్, వాకాటి కరుణ, ఆమ్రపాలి, ఎం.ప్రశాంతి ఐపీఎస్ అధికారులు అంజనీ కుమార్, అభిలాష బిస్త్, అభిషేక్ మొహంతి ఏపీలో చేరాలని ఆదేశించింది. ఐఏఎస్ అధికారులు అనంతరాము, ఎస్ఎస్ రావత్, ఎల్.శివశంకర్, శ్రీజన, హరికిరణ్ తెలంగాణలో ఈనెల 16లోగా చేరాలని ఆదేశించింది.

ఉమ్మడి జిల్లాలకు ప్రత్యేక అధికారుల నియామకం - ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

రాష్ట్రంలో 8 మంది ఐఏఎస్‌ అధికారుల బదిలీ

Last Updated : 2 hours ago

ABOUT THE AUTHOR

...view details