ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 22, 2024, 8:52 AM IST

ETV Bharat / state

స్పీకర్‌గా చింతకాయల అయ్యన్న పాత్రుడు ఎన్నిక ఏకగ్రీవం - నేడు అసెంబ్లీలో ప్రకటన - ap assembly speaker Ayyanna Patrudu

AP Assembly Speaker Ayyanna Patrudu: శాసనసభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నికైన చింతకాయల అయ్యన్న పాత్రుడు నేడు బాధ్యతలు స్వీకరిస్తారు. అసెంబ్లీలో అధికారిక ప్రకటన తర్వాత సభాపతి స్థానంలో ఆశీనులవుతారు. ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన అయ్యన్న సభా గౌరవానికి భంగం కలగకుండా చూస్తానని ప్రకటించారు.

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

AP Assembly Speaker Ayyanna Patrudu :శాసనసభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నికైన చింతకాయల అయ్యన్న పాత్రుడు నేడు బాధ్యతలు స్వీకరిస్తారు. అసెంబ్లీలో అధికారిక ప్రకటన తర్వాత సభాపతి స్థానంలో ఆశీనులవుతారు. ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన అయ్యన్న సభా గౌరవానికి భంగం కలగకుండా చూస్తానని ప్రకటించారు.

స్పీకర్‌ గురించి చంద్రబాబు నాయుడు ప్రసంగం :ఆంధ్రప్రదేశ్‌ 16వ శాసనసభ సమావేశాల్లో రెండో రోజైన ఇవాళ స్పీకర్ ఎన్నిక ప్రక్రియ జరుగనుంది. ఉదయం పదిన్నర గంటలకు సభ సమావేశంకాగానే తొలి రోజు మిగిలిపోయిన సభ్యుల ప్రమాణ స్వీకారం ఉంటుంది.! ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, కాకినాడ ఎమ్మెల్యే వనమాడి ప్రమాణం చేస్తారు. తరువాత సభకు స్వల్ప విరామం ప్రకటిస్తారు. ఉదయం 11 గంటలకు తిరిగి సభ ప్రారంభంకాగానే, ప్రొటెం స్పీకర్‌ గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పీకర్ ఎన్నిక ప్రక్రియ చేపడతారు.

శాసనసభ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు- నామినేషన్​ దాఖలు చేసిన కూటమి నేతలు - SPEAKER AYYANNA PATRUDU

స్పీకర్‌ పదవికి, చింతకాయల అయ్యన్న పాత్రుడు ఒక్కరే నామినేషన్ వేయడంతో ఆయన ఎన్నిక లాంఛనం కానుంది. ఈ విషయాన్ని ప్రొటెం స్పీకర్‌ ప్రకటించగానే ఆయన్న పాత్రుడును సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ శాసన సభా పక్ష నేతలు కలిసి స్పీకర్ స్థానంలో కూర్చోబెడతారు. ఆ తర్వాత సభా నాయకుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పీకర్‌ గురించి ప్రసంగిస్తారు. సీఎం ప్రసంగాన్ని బలపరుస్తూ ఇతర ఎమ్మెల్యేలు కూడా మాట్లాడతారు. వీటికి సభాపతి సమాధానం ఇచ్చాక అసెంబ్లీ నిరవధిక వాయిదా పడనుంది.

'నేనింతే - నా తీరింతే - అసెంబ్లీకి రానంతే' - Jagan on Speaker Election Process

నాలుగు దశాబ్దాలుగా రాజకీయాలు : అనకాపల్లి జిల్లా నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న అయ్యన్న పాత్రుడుకి నాలుగు దశాబ్దాలకుపైగా రాజకీయ అనుభవం ఉంది. 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆయన ఒకసారి ఎంపీగా కూడా పని చేశారు. ఇప్పటి వరకూ ఐదు ప్రభుత్వాల్లో సాంకేతిక విద్య-క్రీడలు, రహదారులు-భవనాలు, అటవీ, పంచాయతీరాజ్‌ శాఖల మంత్రిగా పని చేసిన అనుభవమూ ఉంది.

1983 నుంచి ఇప్పటివరకూ దాదాపు 10 సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఏడు సార్లు విజయం సాధించారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించిన అయ్యన్న చట్ట సభలో చివరి సారి సభాధ్యక్ష పదవి దక్కడం అదృష్టమని అన్నారు. సభా గౌరవానికి భంగం కలగకుండా చూస్తానని తెలిపారు.

తొలిరోజు సందడిగా శాసన సభ- చంద్రబాబు, పవన్​, జగన్​ ఎలా స్పందించారంటే! - AP Assembly Sessions 2024

ABOUT THE AUTHOR

...view details