AP Officials Remove Illegal Structures :భద్రాద్రి కొత్తగూడెం జిల్లాభద్రాచలంలోని శివారు ప్రాంతంలో పట్టణానికి ఆనుకుని ఉన్న భూముల్లో ఉన్న గుడిసెలను ఆంధ్రప్రదేశ్ అధికారులు తొలగించారు. ఈ మేరకు రెండు ఎకరాల విస్తీర్ణంలోని ప్రభుత్వ భూముల్లో ఉన్న నిర్మాణాలను జేసీబీల సాయంతో కూల్చి వేయించారు. తెలంగాణలో ఉన్న నిర్మాణాలను ఏపీ అధికారులు తొలగించడమేంటని సందేహం వచ్చిందా? అసలేం జరిగిందో తెలుసుకుందాం.
ఇదీ జరిగింది :భద్రాచలం శివారు ప్రాంతంలో పట్టణానికి ఆనుకొని ఉన్న ఆంధ్రాలో కలిసిన చాలా ఎకరాల ప్రభుత్వ భూములు గత కొంతకాలంగా ఆక్రమణకు గురయ్యాయి. చుట్టుపక్కల ప్రాంతాల్లోని గిరిజనలంతా ఆ భూములను ఆక్రమించి గుడిసెలు నిర్మించుకున్నారు. ప్రభుత్వ అధికారులు చాలా కాలం నుంచి భూములను ఖాళీ చేయాలని చెబుతున్నప్పటికీ వినకపోవడంతో ఈరోజు అల్లూరి జిల్లా ఎటపాక మండల అధికారులు గుడిసెలను తొలగించారు.