తెలంగాణ

telangana

By ETV Bharat Telangana Team

Published : 5 hours ago

ETV Bharat / state

తిరుమల కల్తీ నెయ్యి ఘటన - సిట్‌ దర్యాప్తు తాత్కాలికంగా నిలిపివేత - AP DGP ON TIRUMALA LADDU ISSUE

AP DGP ON TIRUMALA LADDU ISSUE : తిరుమల కల్తీ నెయ్యి ఘటనపై ఏపీ డీజీపీ స్పందించారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో సిట్‌ దర్యాప్తును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా సిట్‌ దర్యాప్తు కొనసాగుతుందని స్పష్టం చేశారు.

DGP Dwaraka Tirumala Rao On Laddu Issue
AP DGP ON TIRUMALA LADDU ISSUE (ETV Bharat)

DGP Dwaraka Tirumala Rao On Laddu Issue : తిరుమలలో కల్తీ నెయ్యి ఘటనపై సిట్‌ దర్యాప్తు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్​ డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఈ కేసు విచారణ సుప్రీంకోర్టులో సాగుతున్న దృష్ట్యా, రాష్ట్ర న్యాయవాదుల సూచనల మేరకు దర్యాప్తు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగానే సిట్ దర్యాప్తు కొనసాగుతుందని డీజీపీ వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details