ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనంత పోలీసుల అదుపులో మోస్ట్‌ వాంటెడ్‌ ‘ధార్‌ గ్యాంగ్‌’ - DHAR GANG ROBBERY IN ANANTAPUR

అనంతపురం శ్రీనగర్‌ కాలనీలో భారీ చోరీ చేసిన ‘ధార్‌ గ్యాంగ్‌’ - మధ్యప్రదేశ్​లోని మారుమూల గ్రామాల్లో జల్లెడపట్టి నిందితులను అరెస్ట్‌ చేసిన పోలీసులు

Anantapur Police Arrest Dhar Gang from Madhya Pradesh
Anantapur Police Arrest Dhar Gang from Madhya Pradesh (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 9, 2025, 6:25 PM IST

Anantapur Police Arrest Dhar Gang from Madhya Pradesh : దేశంలో మోస్ట్‌ వాంటెడ్‌గా ఉన్న మధ్యప్రదేశ్‌కు చెందిన ‘ధార్‌ గ్యాంగ్‌’ను అనంతపురం జిల్లా పోలీసులు పట్టుకున్నారు. 18 రోజుల క్రింత అనంతపురం శ్రీనగర్‌ కాలనీలోని ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఈ చోరీ చేసింది ధార్‌ గ్యాంగ్‌గా పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ జగదీశ్‌ ఆధ్వర్యంలో నాలుగు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. మధ్యప్రదేశ్‌లోని మారుమూల గ్రామాల్లో ఈ ముఠా కోసం జల్లెడపట్టి టెక్నాలజీ సాయంతో నిందితులను పట్టుకున్నారు. ఈ గ్యాంగ్‌లోని ముగ్గురు మాత్రమే పోలీసులకు చిక్కారు. వీరి వద్ద నుంచి రూ.90లక్షల విలువ చేసే బంగారం, వజ్రాల ఆభరణాలు, రూ.19.35లక్షల నగదుతో పాటు మూడు బైక్​లను స్వాధీనం చేసుకున్నారు.

తాళం వేసిన ఇళ్లే టార్గెట్‌ : అరెస్ట్ అయిన వారిలో గ్యాంగ్‌ లీడర్‌ నారూ పచావార్‌ కూడా ఉన్నారు. వీరిపై ఆంధ్రా, తెలంగాణ, తమిళనాడు, గుజరాత్‌ రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో కేసులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. దక్షిణ భారత దేశంలోనే ఈ గ్యాంగ్‌పై 32కు పైగా కేసులు ఉన్నట్టు జిల్లా ఎస్పీ జగదీశ్‌ తెలిపారు. తాళం వేసిన ఇళ్లను టార్గెట్‌ చేసుకొని పగలు రెక్కీ చేసి రాత్రి పూట ఈ ముఠా చోరీలకు పాల్పడుతుందని జిల్లా వెల్లడించారు. చోరీ తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా బైక్‌లపై వీరు సంచరిస్తుంటారని వివరించారు. నాలుగు రాష్ట్రాల్లో పోలీసులు వీరికోసం గాలిస్తున్నట్టు జిల్లా ఎస్పీ జగదీశ్‌ చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details