Actor Allu Arjun Attend Nampally Court :సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ ఇవాళ నాంపల్లి కోర్టుకు హాజరై బెయిల్ పత్రాలు సమర్పించారు. న్యాయమూర్తి ముందు హాజరైన బన్నీ, బెయిల్ పూచీకత్తుకు సంబంధించిన పత్రాలను అందించారు. పుష్ప సినిమా బెనిఫిట్ షో సందర్భంగా డిసెంబర్ 4న సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో నాంపల్లి కోర్టు నిన్న అల్లు అర్జున్కు కండీషనల్ బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ ఇవాళ(శనివారం) నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. బెయిల్ పూచీకత్తులను సమర్పించి అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు.
నాంపల్లి కోర్టుకు హాజరైన అల్లు అర్జున్ :బెయిల్ కోసం రూ.50 వేల చొప్పున 2 పూచీకత్తులను సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. రెండు నెలల పాటు ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ముందు అల్లు అర్జున్ వ్యక్తిగతంగా హాజరు కావాలని కోర్టు షరతు విధించింది. కేసుకు సంబంధించిన సాక్షులను ప్రభావితం చేయవద్దని, కేసును ప్రభావితం చేసేలా వ్యాఖ్యలు చేయవద్దని అల్లు అర్జున్కు సూచించింది.
డిసెంబర్ 4న పుష్ప బెనిఫిట్ షో రోజు సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో కొద్ది రోజుల క్రితం అల్లు అర్జున్ను పోలీసులు అరెస్టు చేశారు. హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ను మంజూరు చేయడంతో మరుసటి రోజు విడుదలయ్యారు. రెగ్యులర్ బెయిల్ కోసం అల్లు అర్జున్ నాంపల్లి కోర్టులో దాఖలు చేసినటువంటి పిటిషన్పై శనివారం కోర్టు తీర్పు ఇస్తూ షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది. రూ.50వేల రెండు పూచీకత్తులను సమర్పించాలని సూచించింది.