తెలంగాణ

telangana

ETV Bharat / state

రూ.19 వేలకు ఆశపడి - రూ.10.10 కోట్లు పోగొట్టుకున్న అకౌంటెంట్ - అమ్మాయి చెప్పింది కదా అని నమ్మి! - 10CRORE CYBER CRIME IN HYDERABAD

హైదరాబాద్​లో భారీ సైబర్ క్రైమ్ - రూ.10 కోట్లు పోగొట్టుకున్న అకౌంటెంట్ - సైబర్​ మోసంలో ఇంతటి భారీ మొత్తంలో సొమ్ము కోల్పోవడం ఇది మూడో ఘటన

Accountant Lost Rs.10 cr in Cyber Crime in Hyderabad
Accountant Lost Rs.10 cr in Cyber Crime in Hyderabad (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 17, 2024, 7:35 AM IST

Accountant Lost Rs.10 cr in Cyber Crime in Hyderabad :స్టాక్​ మార్కెట్​లో పెట్టుబడులతో భారీగా లాభాలు వస్తాయంటూ నమ్మించి నగరంలోని ఓ అకౌంటెంట్ నుంచి సైబర్ నేరగాళ్లు రూ.10.10 కోట్లు కొట్టేశారు. మొదట రూ.19 వేల లాభం చూపించి, తర్వాత భారీ మొత్తాన్ని బదిలీ చేయించుకున్నారు. అలా ఆ వ్యక్తి నుంచి రూ.10 కోట్లు పెట్టుబడి పెట్టించారు. అందుకు రూ.24.36 కోట్ల లాభం వచ్చినట్లు వర్చువల్​గా చూపించారు. కానీ ఆ డబ్బు మొత్తం విత్​డ్రా చేసుకోవడానికి మరో రూ.3 కోట్లు బదిలీ చేయాలని కండీషన్ పెట్టారు. దీంతో అనుమానం వచ్చిన అతను మోసపోయాయని గ్రహించి సైబరాబాద్​ సైబర్​క్రైమ్​ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఒక సైబర్​ మోసంలో ఇంతటి భారీ మొత్తంలో సొమ్ము కోల్పోవడం ఇది మూడో ఘటన అని పోలీసులు తెలిపారు.

కొత్త నంబర్​ నుంచి మీ వాట్సప్​కు వెడ్డింగ్‌ ఇన్విటేషన్‌ వచ్చిందా? - అది చెక్​ చేయకుండా ఓపెన్ చేశారో?

హైదరాబాద్​లోని మణికొండ చిత్రపురి కాలనీకి చెందిన అకౌంటెంట్ ఫోన్ నంబరును ఫ్రాంక్లిన్ టెంపుల్టన్​ ఇండియా వెల్త్​ పేరుతో ఉన్న వాట్సాప్​ గ్రూప్​లో అక్టోబరు 2న గుర్తు తెలియని వ్యక్తులు యాడ్ చేశారు. ఈ గ్రూప్​లో స్టాక్​ మార్కెట్లో పెట్టుబడులపై చర్చిస్తూ, దానికి సంబంధించిన పోస్టులు పెట్టేవారు. ఫ్రాంక్లిన్​ టెంపుల్టన్ ప్రతినిధినంటూ చేతన్​ సెహగల్ అనే వ్యక్తి పెట్టుబడులపై సలహాలు, సూచనలు ఇచ్చేవాడు. అతని సహాయకురాలినంటూ మీరాదత్ అనే మహిళ అకౌంటెంట్​తో చర్చలు జరిపేది.

కండీషన్ పెట్టడంతో గ్రహించి ఫిర్యాదు : వీఐపీ ట్రేడింగ్ అకౌంట్ తెరిచి పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించేది. అలా నమ్మిన అకౌంటెంట్​ వీఐపీ ట్రేడింద్ ఖాతా తెరిచి మొదటిసారి అక్టోబరు 17న రూ.లక్ష పెట్టుబడి పెట్టారు. సైబర్ నేరగాళ్లు ఒక యాప్ డౌన్​లోడ్ చేయించి పెట్టుబడికి లాభాలు వస్తున్నట్లు ఆన్​లైన్​లో చూపించే వారు. దీంతో నవంబరు 4 వరకు ఆ అకౌంటెంట్ మొత్తం 27 లావాదేవీల్లో రూ.10.10 కోట్లు పెట్టుబడి పెట్టారు. బాధితుడు లాభాలతో కలిపి డ్రా చేసుకోవడానికి ప్రయత్నించగా, ఇంకా డబ్బులు బదిలీ చేయాలని కోరడంతో అతను మోసపోయాడని గ్రహించాడు. తొలుత 1930 టోల్​ ఫ్రీ నంబరుకు, తర్వాత సైబర్​ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

సైబర్ బాధితులను కాపాడే 'గోల్డెన్ అవర్' - ఆ ఒక్క గంట పోయిన మీ డబ్బునంతా తిరిగి ఇప్పిస్తుంది

ఆన్​లైన్​లో లోన్​ తీయించి మరీ రూ. 30 లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు

ABOUT THE AUTHOR

...view details