A Woman Dies On Burnt in Vaggampalli Of Prakasam District : ప్రకాశం జిల్లా పామూరు మండలం వెగ్గంపల్లిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రాత్రి ఆరుబయట నిద్రించిన ఓ మహిళ తెల్లారేసరికి కాలి బూడిదైంది. ఎస్సీ కాలనీకి చెందిన 53 ఏళ్ల ప్రేమమ్మ శుక్రవారం రాత్రి ఆరుబయట మంచంపై నిద్రించింది. ఉదయం చూసేసరికి కాలి బూడిదై కనిపించిందంటూ కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది హత్యా? లేక ప్రమాదవశాత్తు జరిగిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కక్షపూరితంగా ఎవరైనా ఘాతుకానికి ఒడిగట్టరా అనే కోణంలోనూ ఆరా తీస్తున్నారు. ప్రేమమ్మ నిద్రించిన మంచం పక్కనే ఉన్న వంట సామగ్రి కూడా కాలిపోయాయి.
రాత్రి ఆరుబయట నిద్రించింది - తెల్లారేసరికి కాలి బూడిదైంది - WOMAN DIES ON BURNT
రాత్రి ఆరుబయట మంచంపై నిద్రించిన 53 ఏళ్ల ప్రేమమ్మ - ఉదయం చూసేసరికి కాలి బూడిదై మహిళ - దర్యాప్తు చేస్తున్న పోలీసులు

A Woman Dies On Burnt in Vaggampalli Of Prakasam District (ETV Bharat)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 22, 2025, 10:46 PM IST