Vijayawada Death Case : ఊళ్లలో పక్కింటి వాళ్లు రెండ్రోజులు ఊరెళ్తే ఏదో తెలియని వెలితి ఉంటుంది. వారితో రోజు మాట్లాడటం అలవాటుగా మారి మనసంతా వారిపైకి వెళ్లిపోతుంది. అలా ఉంటాయి మరి గ్రామాల్లో ఆప్యాయతలు, అనుబంధాలు. కానీ పట్టణాలు, నగరాల్లో పక్కింటివారితో మాట ముచ్చట చాలా తక్కువగా ఉంటుంది. వారు ఏదైనా ఊరుకెళ్తే వారి ఇంటిపైకి చూసేవారు చాలా తక్కువ. ఈ రోజుల్లో పక్కింట్లో మనిషి రోజుల తరబడి బయటకు రాకపోయినా పట్టించుకునే వాళ్లే కరవయ్యారు. నాలుగు గోడల మధ్య ఎవరి జీవితాలు వాళ్లవే అన్నట్లుగా పట్టణాల్లో పరిస్థితులు మారిపోయాయి. ఆఖరికి ప్రాణాపాయ పరిస్థితులు తలెత్తినా పట్టించుకునే వారే లేరు. ఇలాంటి ఘటనే విజయవాడలో జరిగింది.
అసలేం జరిగిందంటే : ఏపీలోని నంద్యాలకు చెందిన చింతా నాగరాజు (30) విజయవాడ విద్యాధరపురంలో ఉంటున్నారు. అతని మొదటి భార్య విజయరాణి అనారోగ్యంతో కొన్నేళ్ల కిందట మృతి చెందారు. దీంతో నాగరాజు బతుకుదెరువు నిమిత్తం 2017వ ఏటా విజయవాడలో దుర్గాఘాట్ వద్ద పారిశుద్ధ్య కార్మికుడిగా పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో అక్కడే పని చేసే పొదిలి సమ్మక్క (36)తో నాగరాజుకు పరిచయం ఏర్పడింది. ఆమె భర్తకు దూరంగా ఉంటోంది. వీరి పరిచయం కాస్తా ఇష్టంగా ఏర్పడి పెళ్లి చేసుకునే వరకు వెళ్లింది.
కాళ్ల పారాణి ఆరకముందే కాటేసిన కాలం - ఉన్నట్టుండి నవ వధువు మృతి