తెలంగాణ

telangana

ETV Bharat / state

లిక్కర్​ షాపుల లాటరీకి వేళాయే - దరఖాస్తుదారుల్లో ఉత్కంఠ

ఏపీలో మద్యం దుకాణాలు టెండర్లకు 89,882 దరఖాస్తులు - సోమవారం జిల్లాల వారీగా లాటరీ పద్ధతిలో షాపుల కేటాయింపు

By ETV Bharat Telangana Team

Published : Oct 13, 2024, 5:27 PM IST

Updated : Oct 13, 2024, 7:09 PM IST

AP Liquor Shops Tenders
AP Liquor Shops Lottery on Monday (ETV Bharat)

AP Liquor Shops Lottery on Monday :ఏపీ వ్యాప్తంగా 3396 లిక్కర్​ షాపులకు మొత్తం 89,882 దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్‌ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. అప్లికేషన్​ ఫీజు ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 1797.64 కోట్ల ఆదాయం సమకూరినట్లు వెల్లడించింది. అనంతపురం జిల్లాలో 12 దుకాణాలకు అతి తక్కువగా అప్లికేషన్​లు రాగా, వాటిని పునఃపరిశీలించాలని ఎక్సైజ్‌ శాఖ భావిస్తోంది. ఎన్టీఆర్ జిల్లాల్లోని 113 మద్యం దుకాణాలకు అత్యధికంగా 5,764 దరఖాస్తులు వచ్చాయి.

సోమవారం జిల్లాల వారీగా ఎక్సైజ్‌ శాఖ లాటరీ పద్ధతిలో మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ చేపట్టనుంది. దీంతో దరఖాస్తు దారుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈనెల 15న ప్రైవేటు వ్యక్తులకు లిక్కర్​ షాపులను అప్పగించనుంది. 16వ తేదీ నుంచి రాష్ట్రంలో నూతన మద్యం పాలసీ అమల్లోకి రానుంది. దేశంలో తయారైన విదేశీ లిక్కర్​ బాటిళ్ల ఎమ్మార్పీ ధరను చిల్లర లేకుండా సర్దుబాటు చేసేలా ఎక్స్​ట్రా ప్రివిలేజ్ ఫీజును విధించనుంది. క్వార్టర్ బాటిల్‌ను 99 రూపాయలకే అమ్మేలా సవరణ చేసింది.

Andhrapradesh Liquor Prices 2024 : ఈమేరకు ఏపీ గవర్నర్ అబ్దుల్​ నజీర్​​ ఆమోద ముద్ర వేశారు. ఆయన ఆమోదం మేరకు గెజిట్​ నోటిఫికేషన్​ను ఎక్సైజ్​ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేశ్​ కుమార్​ మీనా రిలీజ్​ చేశారు. అదననపు ప్రివిలేజ్​ ఫీజు కింద ఎమ్మార్పీ ధరల్లో చిల్లర కాకుండా రూ.10 పెంచుతూ ఏపీ సర్కార్​ సవరణ చేసింది.

ఎలా లెక్కిస్తారు : ఈ లెక్కన చూసుకుంటే మద్యం సీసా​ ఎమ్మార్పీ ధర 150.50 ఉంటే దాన్ని రూ.160కి పెంచుతారు. పెంచిన ఈ రూ.10 ప్రివిలేజ్​ రుసుం. క్వార్టర్​ బాటిల్​ ధర రూ.90.50గా ఉంటే ఏపీఎఫ్​ కలిపి దాని ధర రూ.100 అవుతుందని అధికారులు వివరించారు. గవర్నమెంట్​ ఆదేశాల మేరకు క్వార్టర్​ బాటిల్​ ధర రూ.99కే నిర్ధారించారు. అందుకే రూ.100 ధరలో రూ.1ని మినహాయించి అమ్మకాలు జరపాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

షాపులు స్వల్పం - అప్లికేషన్లు అధికం : ఏపీలో 2017 మార్చిలో చివరిసారిగా ప్రైవేటు లిక్కర్​ పాలసీకి సంబంధించి నోటిఫికేషన్‌ విడుదలైంది. అప్పట్లో 4,380 మద్యం దుకాణాలకు ప్రకటన ఇవ్వగా 76,000 దరఖాస్తులు వచ్చాయి. అంటే సగటున ఒక్కో దుకాణానికి 17 నుంచి 18 అప్లికేషన్లు దాఖలయ్యాయి. దరఖాస్తులతోపాటు రిజిస్ట్రేషన్‌ ఫీజు రూపంలో అప్పట్లో ఎక్సైజ్‌ శాఖకు కేవలం రూ. 474 కోట్ల ఆదాయం సమకూరింది. ఈసారి 3,396 షాపులకు మాత్రమే ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. అంటే 2017 కన్నా తక్కువ దుకాణాలకే ప్రకటన ఇచ్చినా దరఖాస్తులు మాత్రం ఎక్కువ వచ్చాయి.

వామ్మో! ఏందిరా సామీ - 11 రోజుల్లో రూ.1057 కోట్ల మద్యం తాగేశారా!

ఏపీ-తెలంగాణ సరిహద్దున లెక్కే వేరప్పా - మద్యం దుకాణాలకు కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు

Last Updated : Oct 13, 2024, 7:09 PM IST

ABOUT THE AUTHOR

...view details